Fake Notes: కావలిలో దొంగనోట్ల ముఠా గుట్టురట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదమరిస్తే దొంగనోట్లతో బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్ళు. నెల్లూరు జిల్లా కావలి, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో దొంగనోట్లు చలామణి చేస్తున్న దొంగనోట్ల ముఠాను అరెస్ట్ చేశారు కావలి రూరల్ పోలీసులు. వారి వద్ద నుంచి లక్షా నలభై ఏడు వేల రూపాయలు 500 రూపాయల దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు.నెల్లూరు జిల్లా కావలి, కావలి రూరల్ పరిసర ప్రాంతాల్లో కావలి పట్టణ ప్రాంతంలో దొంగనోట్ల చలామణి భారీగా జరుగుతోంది. గత కొన్ని రోజులుగా దొంగ నోట్లు బయటపడుతున్నాయి.
కావలి అడిషనల్ ఎస్పీ ప్రసాద్, నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరామారావు పర్యవేక్షణలో ఈ దొంగనోట్లను చలామణీ చేస్తున్న వారిపై నిఘా ఉంచడం జరిగింది. అందులో భాగంగా కావలి రూరల్ పోలీసులు ఒక టీంగా తయారయ్యారు. దొంగ నోట్ల చలామణీ చేస్తున్న ఏడుగురిని పట్టుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని ప్రాంతాలకు ఈ దొంగనోట్లు చలామణి చేస్తున్నారు. హైదరాబాద్, గుంటూరు పరిసర ప్రాంతాలలో ప్రింటింగ్ చేసి ఇక్కడ ఒక బ్రోకర్స్ ని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా దొంగ నోట్లు చలామణి చేస్తున్నారు. వీళ్ళంతా 30వేలు ఒరిజినల్ నోట్లు ఇస్తే లక్ష రూపాయల దొంగనోట్లు ఇస్తారు.
Also Read
- CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
- AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
- Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
Read Also: Black Magic: మంత్రాలయంలో క్షుద్రపూజల అలజడి
ఈ ముఠాకు భారీ నెట్ వర్క్ వుంది. కర్నూలులో కూడా ఈ ముఠా దగ్గరి నుంచి దొంగ నోట్లు తీసుకొనిఇంకొక ముఠా కర్నూల్ లో కూడా చలామణి చేస్తోంది. వారిని కూడా త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కావలి రూరల్ పోలీసులు సీఐ ఎస్ఐ వెంకట్రావు పోలీస్ సిబ్బంది ఒక టీంగా ఏర్పడి పట్టుకున్నారు. వీరినుంచి దొంగనోట్లతో పాటు ఒక ప్రింటర్, ఒక కంప్యూటర్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు సంబంధించిన వారు ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళుతున్నారో తెలుసుకుని వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఏడుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.హైదరాబాద్ లోని పఠాన్ షబ్బీర్ ఇంట్లో మురళి అనే అతను కలిసి ఈ దొంగనోట్లను ముద్రించే వాడు. అక్కడినుండి ఆంధ్రప్రదేశ్ లోని కావలి కి తెచ్చి ఇక్కడ మార్చేవారని కావలి అడిషనల్ ఎస్పీ ప్రసాద్, నెల్లూరు ఎస్పీ విజయరామారావు తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!