మూడురాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకోవడంపై అమరావతి వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ముందునుంచీ అమరావతికి తన మద్దతు ప్రకటించి, రాజధాని రైతులకు బాసటగా నిలిచారు నరసాపురం ఎంపీ రఘురామ. తాజా నిర్ణయంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరంకుశంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు సాధించిన విజయం. అవిశ్రాంతంగా పోరాటం చేసిన అమరావతి రైతులు, రైతు సోదరులకు, పర్యవేక్షణ కమిటీ నిర్వాహకులకు మహిళా సంఘాలు, సమర్ధించిన అందరికీ చెందుతుంది. అమిత్ షా తిరుపతి పర్యటన అనంతరం జరిగిన…
ఏపీలో హాట్ టాపిక్ అవుతున్న మూడురాజధానుల అంశం కీలక మలుపు తీసుకుంది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని న్యాయస్ధానానికి అడ్వకేట్ జనరల్ తెలిపారు. మూడు రాజధానులు బిల్లు అంశంపై ఏపీ హైకోర్టులో గత కొద్దిరోజులుగా విచారణ జరుగుతోంది. నేటి వాదోపవాదాల్లో భాగంగా మూడు రాజధానుల బిల్లు ఉపసంహటించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు అడ్వకేట్ జనరల్. ఇదే అంశంపై ఏపీ సచివాలయంలో అత్యవసర కేబినెట్ సమావేశం జరుగుతోంది. మూడు…
కర్నూలు జిల్లా శ్రీశైలం ముఖద్వారం సమీపంలో పెద్దపులి సంచారం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రోడ్డు దాటుతూ ప్రయాణికులకు పెద్ద పులి కనిపించింది. దీంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. వాహనాలు నిలిపివేసి ఫోటోలు, వీడియోలు తీసిన ప్రయాణికులు. ఎన్టీవీ చేతిలో వీడియోలు వున్నాయి. పెద్ద పులి ఎటు నుంచి ఎటు వెళ్ళిందోనని టెన్షన్ పడుతున్నారు. అటవీ అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.
కర్నూలు నగరంలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. నంద్యాల మైనర్ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు తెలుస్తోంది. ఆదాయానికి మించి అక్రమ ఆస్తుల కలిగి ఉన్నాడనే సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మిగనూరు , కడప, నంద్యాలలో ఉంటున్న బంధువుల ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. నంద్యాల మైనర్ ఇరిగేషన్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నారు జాకబ్ రాజశేఖర్. ఆయనపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన…
ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే కనీసం రూ.50 అవుతుంది. సరే ఇంట్లో వండుకుందామని అనుకున్నా ఒక్కొక్కరికి కనీసం రూ.30 నుంచి రూ.40 వరకు ఖర్చు అవుతుంది. నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ ధరలు పెరిగిపోవడంతో బ్రేక్ఫాస్ట్ నుంచి భోజనం వరకు ధరలు పెరిగిపోయాయి. దీంతో ప్రజలు అవస్తలు పడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఆ హోటల్లో ఏ బ్రేక్ ఫాస్ట్ తీసుకున్నా రూ.10 చెల్లిస్తే సరిపోతుంది. దోశ, ఇడ్లీ, పూరీ, వడ, ఉగ్గాని ఇలా ఏది తీసుకున్నా…
మనదేశంలో విభిన్న మతాలు, ఎన్నో ఆచారాలు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో వింత ఆచారం వుంది. అక్కడ కాలితో తంతే కష్టాలు వుండవట. సమస్యలు ఎన్నైనా పరిష్కారం ఒక్కటే. అదే ఒకే ఒక్క కాలి దెబ్బకి కష్టాలు మాయం అవుతాయి. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పెద్దహుల్తి గ్రామానికి వెల్లసిందే….దీపావళి వెళ్ళిన మూడు రోజుల తర్వాత హుల్తిలింగేశ్వర స్వామి పండుగ జరుగుతుంది. ప్రతి సంవత్సరం కార్తీకమాసం రెండవరోజు పెద్దహుల్తి గ్రామంలో హుల్తిలింగేశ్వర స్వామి ఉత్సవాలు జరుగుతాయి. హుల్తిలింగేశ్వర ఉత్సవమూర్తి…
ఏపీలో ఎన్నికల వాతావరణం మళ్ళీ వేడెక్కింది. గతంలో ఎన్నికలు జరగని మునిసిపాలిటీల్లో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో మునిసిపల్ ఎన్నికలకు నగారా మోగింది. తొలిసారి బేతంచర్లకు మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ఘట్టం ప్రారంభమయింది. రెండో రోజునామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. వివిధ పార్టీల నేతలు భారీ బందోబస్తు మధ్య నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. టీడీపీ ఛైర్మెన్ అభ్యర్థిగా బి. ప్రసన్న లక్ష్మీ…
కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రియుడితో వెళ్తూ బైక్ నుంచి కింద పడి ఇంజినీరింగ్ యువతి మృతి చెందిన ఘటన ఓర్వకల్ మండలం ఎంబాయి వద్ద చోటు చేసుకుంది. వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డి పల్లికి చెందిన ఓ యువతి.. ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈనెల19న ఆ యువతికి వేరే యువకుడితో వివాహం జరగాల్సి ఉంది. అయితే ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం లక్ష్మిపురానికి చెందిన వెంకటేశ్వర్లుని ఆమె ప్రేమించినట్టుగా తెలుస్తోంది. ఈరోజు తన…
కర్నూలు జూపాడుబంగ్లాలో అతిసార వ్యాధి ప్రబలింది. దీంతో వందలాదిమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాంతులు,విరోచనాలు తీవ్ర అస్వస్థతకు గురైన 20 మందిని నందికొట్కూరు ఆసుపత్రికి తరలించారు. వారిలో ఆరుగురు పిల్లలు వున్నారు. వీరి పరిస్థితి విషమంగా వుందని డాక్టర్లు చెబుతున్నారు.జూపాడుబంగ్లాలోని నీలిపల్లె పేటకు చెందిన 20 మంది నందికొట్కూరు ఆసుపత్రిలో చేరారు. ఆరుగురు ఆందోళనకరంగా వుండడంతో వారి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మంచి నీరు కలుషితం కావడం వల్లే అతిసార ప్రబలుతోందని స్థానికులు చెబుతున్నారు.
కర్నూలు జిల్లాలో సంచలనం కలిగించిన ఆత్మకూరు వర్ధన్ సొసైటీ మోసాలపై దర్యాప్తు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. సబ్సిడీ రుణాల పేరుతో సుమారు 3 కోట్ల 63 లక్షల రూపాయలను సేకరించారని ఎస్పీ వెల్లడించారు. ఎమ్మిగనూరుకి చెందిన మహేష్ కుమార్ అలియాస్ జాషువా తన సంస్థ ద్వారా సేకరించినట్లు తేలిందన్నారు. 2 కోట్ల 70 లక్షలు దుర్వినియోగానికి సాక్ష్యాలు లభించాయని, డబ్బు అధికశాతం సొసైటీ ప్రధాన నిర్వాహకుడు మహేష్ కుమార్ అలియాస్ జాషువా…