డ్రైన్ వాటర్ శుద్ధిలో బీఆర్ఎస్ పాలన విజయవంతమైన విధానాన్ని ఎత్తిచూపుతూ , దాదాపు 2,000 ఎంఎల్డీ సామర్థ్యంతో హైదరాబాద్ 100 శాతం మురుగునీటిని శుద్ధి చేసిన తొలి భారతీయ నగరంగా అవతరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆదివారం అన్నారు. 3,866 కోట్లతో కే చంద్రశేఖర్రావు ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఫలించిందని ఆయన తెలిపారు. “మా ప్రణాళిక , కృషి ఫలిస్తున్నాయని పంచుకోవడం సంతోషంగా , గర్వంగా ఉంది,” అని ఆయన చెప్పారు, మూసీ నది…
రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన ఏఈఈ (సివిల్) పరీక్షల ఎంపిక జాబితాను ప్రకటించడంలో జాప్యాన్ని ప్రశ్నిస్తూ , ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు బుధవారం అన్నారు. దాదాపు 22 నెలల క్రితమే ఈ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైందని, గతేడాది సెప్టెంబరు నాటికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయిందని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున అభ్యర్థుల తుది జాబితా విడుదలను నిలిపివేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి…
MLA Sanjay Kumar: కేటిఅర్ మాటలు నన్ను బాధించాయని, విమర్శలు చేసినవారు అత్మ విమర్శలు చేసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కొసం కాంగ్రెస్ లో చేరానని అన్నారు.
ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురి మృతి..హత్య, ఆత్మహత్య అనే కోణాల్లో దర్యాప్తు మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్లో దారుణ ఘటన వెలుగు చూసింది. రౌడీ గ్రామంలో భర్త, భార్య, ముగ్గురు పిల్లల మృతదేహాలు ఉరివేసుకుని కనిపించాయి. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులుసంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎఫ్ఎస్ఎల్ బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. అలీరాజ్పూర్ ఎస్పీ రాజేష్ వ్యాస్ సమాచారం ప్రకారం.. గునేరి పంచాయతీ రౌడీ గ్రామంలోని…
ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్. మేడిగడ్డ ప్రాజెక్ట్పై గత కొన్ని రోజులు కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం నిజం కాదని.. ఇప్పుడు ఇదే అందుకు నిదర్శనమంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ట్విట్టర్లో ‘నిన్నటి దాకా… మేడిగడ్డ మేడిపండులా మారింది అన్నారు..అసలు రిపేర్ చేయడం అసాధ్యం అన్నారు. మరమ్మత్తులు చేసినా.. ఇక పనికి రాదన్నారు.లక్షకోట్లు బూడిదలో పోసిన పన్నీరు అన్నారు. వర్షాకాలంలో వరదకు కొట్టుకుపోతది అన్నారు.అన్నారం బ్యారేజీ కూడా…
గవర్నర్ రాధాకృష్ణన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ రాజ్భవన్లో గవర్నర్ రాధాకృష్ణన్తో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణ, బిల్లులు, పెండింగ్ ఎమ్మెల్సీల నియామకంపై గవర్నర్తో సీఎం రేవంత్ చర్చ జరిపారు. జులై మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలపై చర్చించినట్లు తెలిసింది. మరోవైపు కేబినెట్ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా బిల్లుల కోసమే గవర్నర్తో సీఎం సమావేశమైనట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మాది మాటల ప్రభుత్వం కాదు……
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హల్లో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మాజీమంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, జడ్పీ చైర్మన్ వసంత, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ , ఎమ్మెల్సీ రమణ, 18 మండలల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జగిత్యాలలో ఈ హౌలే గాన్ని ఎమ్మెల్యేను చేసింది ఎవరు..? జగిత్యాలను జిల్లా…
ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తున్నారని.. ఇది చారిత్రక నిర్ణయమని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. కేటీఆర్ అసలైన కోతల మాస్టర్ అని.. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం కేసీఆర్, కేటీఆర్లకు ఇష్టం లేనట్లుందని ఆయన విమర్శించారు.