TMC Crisis: మమతా బెనర్జీపైనే వేటు వేసిన టీఎంసీ తిరుగుబాటు వర్గం.. కొత్త బాస్గా అరూప్ రాయ్ ప్రకటన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TMC Crisis: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీపై పట్టు కోసం సాగుతున్న అంతర్గత పోరు ఇప్పుడు క్లైమాక్స్కు చేరింది. పార్టీ అధినేత్రి, వ్యవస్థాపకురాలు మమతా బెనర్జీ నాయకత్వానికే సవాలు విసురుతూ.. రితాబ్రతా బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు (రెబెల్) వర్గం సోమవారం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా పార్టీ స్థాపించిన మమతా బెనర్జీని అధ్యక్ష పదవి నుంచి తొలగించి.. సీనియర్ ఎమ్మెల్యే అరూప్ రాయ్ను తృణమూల్ కాంగ్రెస్ అసలైన అధ్యక్షుడిగా ప్రకటిస్తూ సమాంతర కమిటీని ఏర్పాటు చేసింది. అంతటితో ఆగకుండా, ఈ సమాంతర కమిటీని ప్రకటించిన కొద్దిసేపటికే.. మమతా బెనర్జీకి అత్యంత ఆప్తుడైన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు రెబెల్ క్యాంప్ ప్రకటించింది. ఈ పరిణామంతో ఈ తిరుగుబాటు కేవలం శాసనసభకే పరిమితం కాలేదని, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని కూడా చేతుల్లోకి తీసుకునేందుకు విస్తరించిందని స్పష్టమైంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి పాలైన తర్వాత.. శాసనసభ, పార్లమెంటరీ విభాగాల్లో వరుస వలసలు, తిరుగుబాట్లతో ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్న మమతా బెనర్జీకి, ఈ తాజా పరిణామం తన రాజకీయ జీవితంలోనే అత్యంత తీవ్రమైన సంస్థాగత సవాలుగా మారింది.
న్యూటౌన్లోని ఒక ఫైవ్-స్టార్ హోటల్లో అసెంబ్లీ ప్రతిపక్ష నేత రితాబ్రతా బెనర్జీ, ఇతర తిరుగుబాటు ఎమ్మెల్యేలు, పార్టీ కౌన్సిలర్లతో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కీలక సమావేశానికి సీనియర్ నాయకులు అరూప్ రాయ్, ఫిర్హాద్ హకీమ్, అరూప్ బిస్వాస్, జావేద్ ఖాన్, సందీపన్ సాహా, అసిమ్ బోస్, జూయ్ బిస్వాస్, తారక్ సింగ్లతో పాటు కోల్కతా, హౌరా, ముర్షిదాబాద్, బెహ్రాంపూర్, పలు ఇతర జిల్లాలకు చెందిన రెబెల్ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు భారీగా హాజరయ్యారు. పార్టీలో ఏర్పడిన రాజ్యాంగ సంక్షోభాన్ని పరిష్కరించడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తిరుగుబాటు వర్గం పేర్కొంది. ఈ సందర్భంగా రితాబ్రతా బెనర్జీ మాట్లాడుతూ.. పార్టీ రాజ్యాంగం ప్రకారం ప్రతి మూడేళ్లకు ఒకసారి జాతీయ కార్యవర్గ కమిటీని పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుందని, అయితే ఫిబ్రవరి 2022లో ఏర్పాటైన మునుపటి కమిటీ పదవీకాలం ముగిసినా కొత్త కమిటీని నియమించలేదని ఆరోపించారు. అందువల్లనే తాము రాజ్యాంగబద్ధంగా పార్టీ జాతీయ నాయకత్వాన్ని పునర్నిర్మించే ప్రక్రియను ప్రారంభించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
Also Read
- నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
- Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
- Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
- Virat Kohli: అందరి చూపు కోహ్లీ వైపే.. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో బద్దలు కొట్టగల రికార్డులు లిస్ట్ ఇదిగో.!
ఈ సమావేశంలో ఏకగ్రీవంగా కొత్త జాతీయ కమిటీని ఏర్పాటు చేశారు. హౌరా సెంట్రల్ సీనియర్ ఎమ్మెల్యే అరూప్ రాయ్ను వాయిస్ ఓట్ ద్వారా పార్టీ ఛైర్పర్సన్గా ఎన్నుకున్నారు. వైస్ ఛైర్పర్సన్లుగా ఫిర్హాద్ హకీమ్, అరూప్ బిస్వాస్, రథిన్ ఘోష్, సబీనా యాస్మిన్.. జనరల్ సెక్రటరీలుగా రితాబ్రతా బెనర్జీ, జావేద్ ఖాన్, సందీపన్ సాహాలను నియమించారు. అఖ్రుజ్జమాన్ అన్సారీ ట్రెజరర్గా నియమితులయ్యారు. పార్టీ ఆర్థిక రికార్డులను పరిశీలించడానికి ఒక స్వతంత్ర ఆడిటర్ను కూడా నియమించాలని ఈ కమిటీ నిర్ణయించింది. ఈ కమిటీయే అసలైన తృణమూల్ కాంగ్రెస్కు చట్టబద్ధమైన వారసత్వమని వారు వాదించారు. ఈ సమావేశానికి దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు, కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పలువురు కౌన్సిలర్లు నేరుగా హాజరవడం లేదా మద్దతు తెలపడం గమనార్హం. మరోవైపు, మమతా బెనర్జీ పట్ల విధేయులుగా ఉన్న అధికారిక వర్గం ఈ పరిణామాలను తీవ్రంగా కొట్టిపారేసింది. టీఎంసీ అంటేనే మమతా బెనర్జీ అని, ఇదంతా ఒక పెద్ద ప్రహసనమని మండిపడింది. అధికారిక క్యాంప్కు చెందిన సీనియర్ నేత కునాల్ ఘోష్ ఎక్స్ (X) వేదికగా స్పందిస్తూ.. “ఇదొక కామెడీ షో. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఒక వ్యక్తి ప్రత్యేక సమావేశాలు పెడుతున్నాడు. ఈ వ్యవహారం కోర్టులో ఉంది, న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. ఇలాంటి విదూషక చేష్టలకు మేము ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వం.” అని ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Michael Biopic: రూ.9,500 కోట్లకు పైగా వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన బయోపిక్!
-
నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
-
Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!