Konda Surekha: సీఎం అమెరికా టూర్ పై కేటీఆర్ విమర్శలు.. మంత్రి ఆగ్రహం
- సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పై కేటీఆర్ విమర్శలు
- ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కొండా సురేఖ
- కేటీఆర్ గతంలో అమెరికా వెళ్ళినప్పుడు ఏం చేశారో.. ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నారో తెలుసు
- పదేళ్లు బీఆర్ఎస్ నేతలు పందికొక్కుల్ల దోచుకుతిన్నారు- కొండా సురేఖ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పై కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళింది ఆయన తమ్ముడి కంపెనీ కోసం అని కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని.. కేటీఆర్ గతంలో అమెరికా వెళ్ళినప్పుడు ఏం చేశారో, ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నారో తెలుసన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ నేతలు పందికొక్కుల్ల దోచుకుతిన్నారని మండిపడ్డారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందించేందుకు నిధులు లేకుండా చేశారు.. సీఎం రేవంత్ రెడ్డి ఆయన తమ్ముడి కోసం అమెరికా వెళ్ళాడు అని బదనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నా.. కేటీఆర్ షాడో సీఎంగా పని చేశాడని కొండా సురేఖ తెలిపారు.
Read Also: Jathara : ‘జాతర’ ఫస్ట్ లుక్ పోస్టర్.. ఏంట్రా ఇలా ఉంది?
Also Read
స్వచ్చ బయో సిలికాన్ తో సీఎం తమ్ముడికి లబ్ధి చేకూర్చేందుకు అని విమర్శలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. బీఆర్ఎస్ లక్షల కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం చేశారని తెలిపారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, భగీరథ, దళిత బంధు, ధరణి ఇలా అన్నింటిలో అవినీతి చేశారని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ అవన్నీ బయట పెడుతుందని తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అప్పులు తీర్చేందుకు.. లోటును భర్తీ చేసేందుకు పని చేస్తుంటే కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
Read Also: Manish sisodia: తీహార్ జైలు నుంచి మనీష్ సిసోడియా విడుదల.. 17 నెలల తర్వాత విముక్తి
ప్రజలు బుద్ధి చెప్పి ప్రతిపక్షంలో కూర్చో పెడితే.. ప్రభుత్వానికి సహకరించకుండా, విమర్శలు చేయడం తగదని అన్నారు. ఆధారాలు తీసుకుని వచ్చి ఆరోపణలు చేయండని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఇచ్చిన హామీల అమలు చేస్తున్నాం.. కేటీఆర్ సొంత డబ్బా కొట్టుకునేందుకు పెయిడ్ ఛానెల్స్ పెట్టుకొని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రి సీతక్క మీద కూడా దుర్మార్గంగా, నిస్సిగ్గుగా ఆరోపణలు చేశారు.. వారి మీద కూడా చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలకు మేలు కోసం ప్రభుత్వం పనులు చేస్తే.. సహకరించేందుకు ప్రతిపక్షం సహుద్భవంతో ముందుకు రావాలని అన్నారు.
తాజావార్తలు
-
HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. ‘హ్యామ్’ ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
-
ICC ODI Rankings: టీమిండియా ‘వన్డే’ జైత్రయాత్ర.. ప్రపంచ ఛాంపియన్లనే వెనక్కి నెట్టి అగ్రస్థానంలో భారత్!
-
Ittehad-ul-Mujahideen: పాక్ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!
-
Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
-
Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?