Konda Surekha: సీఎం అమెరికా టూర్ పై కేటీఆర్ విమర్శలు.. మంత్రి ఆగ్రహం
- సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పై కేటీఆర్ విమర్శలు
- ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కొండా సురేఖ
- కేటీఆర్ గతంలో అమెరికా వెళ్ళినప్పుడు ఏం చేశారో.. ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నారో తెలుసు
- పదేళ్లు బీఆర్ఎస్ నేతలు పందికొక్కుల్ల దోచుకుతిన్నారు- కొండా సురేఖ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పై కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళింది ఆయన తమ్ముడి కంపెనీ కోసం అని కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని.. కేటీఆర్ గతంలో అమెరికా వెళ్ళినప్పుడు ఏం చేశారో, ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నారో తెలుసన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ నేతలు పందికొక్కుల్ల దోచుకుతిన్నారని మండిపడ్డారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందించేందుకు నిధులు లేకుండా చేశారు.. సీఎం రేవంత్ రెడ్డి ఆయన తమ్ముడి కోసం అమెరికా వెళ్ళాడు అని బదనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నా.. కేటీఆర్ షాడో సీఎంగా పని చేశాడని కొండా సురేఖ తెలిపారు.
Read Also: Jathara : ‘జాతర’ ఫస్ట్ లుక్ పోస్టర్.. ఏంట్రా ఇలా ఉంది?
Also Read
- Yashpal Sharma: 1983 ప్రపంచకప్లో అసలైన సూపర్మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
- 7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
- రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
- Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
స్వచ్చ బయో సిలికాన్ తో సీఎం తమ్ముడికి లబ్ధి చేకూర్చేందుకు అని విమర్శలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. బీఆర్ఎస్ లక్షల కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం చేశారని తెలిపారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, భగీరథ, దళిత బంధు, ధరణి ఇలా అన్నింటిలో అవినీతి చేశారని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ అవన్నీ బయట పెడుతుందని తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అప్పులు తీర్చేందుకు.. లోటును భర్తీ చేసేందుకు పని చేస్తుంటే కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
Read Also: Manish sisodia: తీహార్ జైలు నుంచి మనీష్ సిసోడియా విడుదల.. 17 నెలల తర్వాత విముక్తి
ప్రజలు బుద్ధి చెప్పి ప్రతిపక్షంలో కూర్చో పెడితే.. ప్రభుత్వానికి సహకరించకుండా, విమర్శలు చేయడం తగదని అన్నారు. ఆధారాలు తీసుకుని వచ్చి ఆరోపణలు చేయండని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఇచ్చిన హామీల అమలు చేస్తున్నాం.. కేటీఆర్ సొంత డబ్బా కొట్టుకునేందుకు పెయిడ్ ఛానెల్స్ పెట్టుకొని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రి సీతక్క మీద కూడా దుర్మార్గంగా, నిస్సిగ్గుగా ఆరోపణలు చేశారు.. వారి మీద కూడా చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలకు మేలు కోసం ప్రభుత్వం పనులు చేస్తే.. సహకరించేందుకు ప్రతిపక్షం సహుద్భవంతో ముందుకు రావాలని అన్నారు.
తాజావార్తలు
-
Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
-
Gaja Teaser: ప్రేమించిన అమ్మాయినే చంపేశాడు.. లవ్ స్టోరీలో ఇంత షాకింగ్ ట్విస్ట్ ఏంటి?.. ‘గజ’ టీజర్ అదిరిందిగా!
-
Sourav Ganguly Death Threats: మిమ్మల్ని చంపేస్తాం.. సౌరవ్ గంగూలీ, సతీమణి డోనాకి బెదిరింపులు!
-
Yashpal Sharma: 1983 ప్రపంచకప్లో అసలైన సూపర్మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
-
Ajith Kumar : అజిత్ కుమార్ – విక్టరీ వెంకటేష్ – మోహన్ లాల్.. భారీ పాన్ ఇండియా సినిమా?
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!