Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Deputy Cm Bhatti Vikramarka Countered Ktr

Deputy CM: సుంకిశాల ప్రాజెక్టు విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు భట్టి విక్రమార్క కౌంటర్..

Published Date :August 9, 2024 , 4:43 pm
By Rajesh Veeramalla
  • సుంకిశాల ప్రాజెక్టు విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు భట్టి విక్రమార్క కౌంటర్ ఎటాక్
  • పొరపాటును ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రభుత్వంపై ఎదురుదాడి సరికాదు
  • బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల నాణ్యత పై విచారణ చేయిస్తాం- భట్టి
  • బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కాళేశ్వరం.. సుంకిశాల ప్రాజెక్టులను నిర్మించారు- డిప్యూటీ సీఎం.
Deputy CM: సుంకిశాల ప్రాజెక్టు విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు భట్టి విక్రమార్క కౌంటర్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

సుంకిశాల ప్రాజెక్టు విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఎటాక్ చేశారు. సుంకిశాలకు సంబంధించిన ఘటనలో పొరపాటును ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి.. కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడం సరికాదని అన్నారు. సుంకిశాల ఘటనతో కృష్ణా నదిపై బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల నాణ్యత పై విచారణ చేయిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కాళేశ్వరం, సుంకిశాల ప్రాజెక్టులను నిర్మించారని.. నీళ్లు రాకుండానే కాళేశ్వరం కుంగిపోయిందని పేర్కొన్నారు. నీళ్లు వచ్చిన తర్వాత సుంకిశాల ప్రాజెక్టు మునిగిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు అక్కడ కట్టడం సరికాదని కాంగ్రెస్ ముందే చెప్పిన వినకుండా.. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది.. ఫలితం ఏంటో ఇప్పుడు అందరం చూస్తున్నామన్నారు.

Hit and run: మహారాష్ట్రలో మరో హిట్ అండ్ రన్ కేసు.. కారు ఢీకొని యువకుడి మృతి

ఇంజనీర్లు చెప్పింది కాదని.. కేసీఆర్ సొంత నిర్ణయాలు తీసుకొని కాళేశ్వరం కట్టడం వల్లే కుంగుబాటుకు కారణమైందని భట్టి విక్రమార్క తెలిపారు. ఇంజనీర్లు చేయాల్సిన పని ఇంజనీర్లు చేయాలి.. కానీ, ఇంజనీర్లు చేయాల్సిన పనిని కేసీఆర్ చేయడం వలనే మేడిగడ్డ కుంగిపోయిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రాజెక్టు నాణ్యత లోపాల అవినీతిని ఎప్పుడు బయటపెట్టాలని చూస్తున్న తమకు సుంకిశాల ఘటనను దాచి పెట్టాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులకు రీ డిజైన్ చేసి ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని తెలిపారు. రూ. 1450 కోట్లతో పూర్తయ్యే రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టుగా పేరు మార్చి.. రూ. 23 వేల కోట్లకు అంచనాలు పెంచి రాష్ట్ర ఖజానాను బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ చేసిందని మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టుపై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎకరానికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదని పేర్కొన్నారు.

Uttam Kumar Reddy: దక్షిణ తెలంగాణను బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది..

హైదరాబాద్ సరూర్ నగర్లో జరిగిన బహిరంగ సభలో ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ సైతం ప్రస్తావించారని డిప్యూటీ సీఎం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతారామ ప్రాజెక్టు పై పెట్టిన ఖర్చు వృధా కాకుండా ఉండడానికి.. ముఖ్యమంత్రి భద్రాచలం పర్యటనకు వచ్చినప్పుడు ఇంజనీర్లతో కలిసి రాజీవ్ గాంధీ లింకు కెనాల్ ను ప్రతిపాదించామన్నారు.
కేవలం 75 కోట్ల రూపాయలతో రాజీవ్ లింకు కెనాల్ ను మూడు నెలల్లో పూర్తి చేసి ఒక లక్ష 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం చేపట్టామని భట్టి విక్రమార్క తెలిపారు. మూడు నెలల్లో రాజీవ్ లింకు కెనాల్ కాలువను పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనం అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఆగస్టు 15న వైరా పట్టణంలో రాజీవ్ లింక్ కెనాల్, రెండు లక్షల రుణమాఫీ అమలు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సభకు వేలాదిగా తరలివచ్చి రైతులు, ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • congress govt
  • counter
  • Deputy CM Bhatti Vikramarka
  • ktr

తాజావార్తలు

  • LPG Crisis: వారికి కేంద్రం షాక్.. “నో బుకింగ్, సిలిండర్ సరెండల్ చేయాలి “..

  • AP Power Consumption: యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం!

  • BCCI: “తుది నిర్ణయం ఇదే”.. సన్‌రైజర్స్ లీడ్స్‌ పాకిస్థాన్‌ ప్లేయర్‌ కొనుగోలుపై బీసీసీఐ సంచలన ప్రకటన..

  • Tamil Nadu: “రజనీకాంత్‌ను బెదిరించిన డీఎంకే”.. విజయ్ పార్టీ కొత్త వివాదం..

  • Robin Uthappa: “ఇదే లాస్ట్”.. ఎంఎస్‌ ధోని రిటైర్మెంట్‌పై రాబిన్ ఉతప్ప సంచలన ప్రకటన..

ట్రెండింగ్‌

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions