KTR : హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల బాగుగోలు ప్రభుత్వమే చూసుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ ఇటీవల మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటుకు గురై మృతి చెందిన విద్యార్ధి అనిరుధ్ కుటుంబ సభ్యులని కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అనిరుధ్ తల్లి బాధను మీరు విన్నారు, అలాంటి బాధ ఎవరు పడవద్దని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ హాస్టల్లో అనిరుధ్ చదువుతున్నాడు,ఎంతో మంది తల్లిదండ్రుల బాధపడే అంశమని, కుటుంబ సభ్యులు ఒకరిని కోల్పోతే ఎలా ఉంటుందని అందరికి తెలుసు అన్నారు కేటీఆర్. గత ఎనమిది నెలల్లో 36 మంది చనిపోయారని, హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల బాగుగోలు ప్రభుత్వమే చూసుకోవాలన్నారు కేటీఆర్. రాష్ట్రంలో 500 మంది విద్యార్థులు అనారోగ్యంతో బాధపడుతున్నారని, గత ప్రభుత్వంలో ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్రంలో 1000 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు కేటీఆర్.
Madya Pradesh: పీచు మిఠాయితో ఎనిమిదేళ్ల బాలికకు ఎర.. ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం
Also Read
అంతేకాకుండా..’ఏదైనా అనుకోని దుర్ఘటన జరిగితే వారిని ప్రభుత్వం ఆదుకోవాలి. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గురుకులాలపై కొత్తగా కమిటీ వేసి కమిటీ ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వాన్ని అందిస్తాం. చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి. హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో ఆహారం ఇవ్వండి. ప్రతి జిల్లా నుండి కలెక్టర్లు గురుకులాలను దత్తత తీసుకొని వారానికి ఒకసారి పర్యవేక్షించాలి. వెయ్యి గురుకుల హాస్టల్ లో ఆరున్నర లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. ఎక్కడన్నా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి.’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Madya Pradesh: పీచు మిఠాయితో ఎనిమిదేళ్ల బాలికకు ఎర.. ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!