రజనీకాంత్ చిత్రసీమలో అడుగుపెట్టక ముందు బెంగళూరులో సిటీ బస్ కండక్టర్ గా పనిచేశారు. ఆ సమయంలో ప్రతి రోజూ సెకండ్ షో చూడడం ఆయనకు అలవాటుగా ఉండేదట. రజనీ మాతృభాష మరాఠీ. పెరిగిందేమో కర్ణాటక రాజధాని బెంగళూరులో. అయినా ఆయనకు తెలుగు నటులు యన్టీఆర్ సినిమాలంటే భలే ఇష్టం. యన్టీఆర్ ‘శ్రీకృష్ణ పాండవీయం’ చిత్రాన్నిబెంగళూరులో పలు మార్లు చూశానని చెబుతారు. అలాగే యన్టీఆర్ పౌరాణికాలంటే ఆయనకు ఎంతో అభిమానం. ఇక హిందీ నటుడు శత్రుఘ్న సిన్హా స్టైల్…
పలు పురస్కారాలతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న దివంగత నటి, భరతనాట్య కళాకారిణి పద్మిని రామచంద్రన్ మనవరాలు లక్ష్మీ దేవి రూపొందిస్తున్న మ్యూజిక్ వీడియో ‘యదలో మౌనం’. ఇందులో నడిగర్ తిలకం శివాజీ గణేశన్ మనవడు దర్శన్, శ్రీదేవి మేనకోడలు శిరీష జంటగా కనిపించనున్నారు. శివాజీ గణేశన్, పద్మిని సుమారు 50 చిత్రాల్లో జంటగా నటించారు. ఇప్పుడు పద్మిని మనవరాలి దర్శకత్వంలో శివాజీ గణేశన్ మనవడు ఓ మ్యూజిక్ వీడియో చేయడం విశేషం. ఇందులో ఇంకా విఘ్నేష్…
లేడీ సూపర్ స్టార్ నయనతార కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఒక పక్క సినిమాలు మరోపక్క నిర్మాణ రంగంలో రాణిస్తున్న ఈ భామ ఈసారి బ్యూటీ రంగంలోకి దిగింది. తాజాగా రిటైల్ బ్రాండ్ కంపెనీని ప్రారంభిస్తున్నట్లు ఆమె అధికారిక ప్రకటన చేసింది. డెర్మటాలజిస్ట్ రేణిత రాజన్తో కలిసి నయన్ లిప్ బామ్ కంపెనీ ని మొదలుపెట్టినట్లు తెలిపింది. త్వరలోనే ఈ కంపెనీకి సంబంధించిన అన్ని విషయాలను పంచుకొంటానని నయన్ పేర్కొంది. ఇకపోతే ప్రస్తుతం నయన్ కాత్తువక్కుల…
చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు భయాందోళలకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. తాజాగా తమిళ్ డైరెక్టర్ ఎం.త్యాగరాజన్ మృతి చెందారు. రోడ్డుపక్కన అనాథ శవంలా ఆయన మృతదేహం పడిఉండడం మనసును కలిచివేస్తోంది. కోలీవుడ్ లో విజయ్ కాంత్, ప్రభు లాంటి హీరోలతో ‘వెట్రి మేల్ వెట్రి’, ‘మానగంకావల్’ సినిమాలను తెరకెక్కించిన ఎం.త్యాగరాజన్ గురువారం ఉదయం ఏవీఎం స్టూడియో సమీపంలో రోడ్డుపక్కన శవంలా కనిపించారు. ఆయనను పలువురు స్థానికులు గుర్తుపట్టడంతో ఈ విషయం…
కమలహాసన్ హోస్ట్ గా నిర్వహిస్తున్న బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, ఆనతి కాలంలోనే ప్రేక్షకుల మన్ననలు పొందిన నటి జూలీ అమింజికరై అలియాస్ మరియా జులియానా,. గతంలో జల్లికట్టు ఉద్యమంలో పాల్గొనడం వల్ల ఫేమస్ అయిన ఈ భామ ఆ తర్వాత తమిళ్ బిగ్ బాస్ లో పాల్గొని అందరికి దగ్గరయింది. ఇక తాజాగా ఆమె పోలీసులను ఆశ్రయించింది. ప్రేమ పేరుతో తనను మోసం చేసి, తనవద్ద ఉన్న డబ్బులు, నగలు…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి మరోసారి చిక్కుల్లో పడ్డాడు. ఇటీవల అతనిపై మైసూర్ విమానాశ్రయం లో ఒక వ్యక్తి దాడికి పాల్పడగా .. విజయ్ మేనేజర్ అతడిపై దాడికి దిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే . ఈ విషయమై విజయ్ సేతుపతి పోలీసులకు ఫిర్యాదు కూడా చేయకుండా అది చిన్న గొడవ అని, అతడు తాగిన మైకంలో మాట్లాడాడని, ఈ ఘటనను హైలెట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా ఈ ఘటనలో…
నటుడు సత్యరాజ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరి, గాంగేయం మాజీ ఎమ్మెల్యే అర్జునన్ సతీమణి కల్పన కన్నుమూశారు. గతకొద్దికాలంలాగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతిచెందారు. దీంతో సత్యరాజ్ ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఏ. కల్పన సత్యరాజ్ కి రెండో చెల్లెలు.. ఆమె తిరుప్పూరు జిల్లా గాంగేయంలో నివసిస్తున్నారు. చెల్లెలి మరణ వార్త విన్న సత్యరాజ్ కుటుంబం హుటాహుటిన తిరుప్పూరుకి చేరుకున్నారు. ఇకపోతే తమిళ్ నటుడిగా పేరు గాంచిన…
కారు రేస్, బైక్ రేస్ లపై చాలా సినిమాలు వచ్చాయి.. కానీ మొదటిసారి మడ్ రేస్ పై ఒక చిత్రం రాబోతోంది. నూతన దర్శకుడు డా. ప్రగాభల్ దర్శకత్వంలో యువన్, రిధాన్ కృష్ణ, అనూష సురేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మడ్డీ’.. యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పూర్తి కావడానికి ఐదు సంవత్సరాలు పట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా…
చిత్రపరిశ్రమలో మీటూ ఉద్యమం ఎంతటి ప్రళయాన్ని సృష్టించిందో అందరికి తెలుసు. హీరోయిన్లపై హీరోలు, దర్శకనిర్మాతలు లైంగిక వేధింపులకు పాల్పడడాన్ని నిరసిస్తూ ఈ ఉద్యమం మొదలయ్యింది. ఈ మీటూ ఉద్యమంలో ఎంతమంది హీరోయిన్లు తాము ఎదుర్కొన్న వేధింపులు బహిరంగంగా చెప్పుకొచ్చారు. ఈ ఉద్యమం నడిచేటప్పుడే కోలీవుడ్ హీరోయిన్ శృతి హరిహరన్, స్టార్ హీరో అర్జున్ సర్జా తనను లైంగికంగా వేధించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి సంచలనం సృష్టించింది. షూటింగ్ సమయంలో తనను అసభ్యంగా తాకుతూ, కౌగిలించుకోవడానికి ట్రై చేశాడని…