Supreme Court: చనిపోయినోళ్ల బ్యాంక్ వివరాలు బిడ్డలకు ఎందుకు చెప్పకూడదు.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
- చనిపోయినోళ్ల బ్యాంక్ వివరాలు బిడ్డలకు ఎందుకు చెప్పకూడదు
- ఆర్బీఐ, కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
- కొత్తగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చనిపోయిన తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాల వివరాలు వారసులకు ఎందుకు చెప్పకూడదని కేంద్రాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. బ్యాంకు ఖాతాల్లో స్తంభించి ఉన్న నగదు.. ఎవరూ క్లెయిమ్ చేయని డిపాజిట్ల గురించి చట్టపరమైన వారసులకు తెలియజేయడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ జర్నలిస్ట్ సుచేతా దలాల్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ విషయంలో కొత్తగా అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర, ఆర్బీఐలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది.
‘‘ఒక వ్యక్తికి వేర్వేరు దేశాల్లో 10 వేర్వేరు ఖాతాలు ఉండి.. అతను వీలునామా లేకుండా మరణిస్తే.. అతని వారసులకు ఆ వివరాలు ఎలా తెలుస్తాయి? అతను కేవైసీ (KYC) చేయించి ఉండకపోవచ్చు… ఇది విధానపరమైన ప్రశ్న కాదు. ఆ బదిలీ చట్టవిరుద్ధమని మేము చెప్పడం లేదు. మేము అంటున్నది ఏమిటంటే.. చట్టపరమైన వారసులకు సమాచారం ఇస్తే తప్పేంటి? మీరు ఏదైనా ఒక విధానంతో ముందుకు రావాలి.’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Also Read
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
ఇది కూడా చదవండి: Akshay Kumar: గ్యాస్ సంక్షోభం వేళ అక్షయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వంటింటి గుట్టు వెల్లడి
విచారణ సందర్భంగా దలాల్ తరఫున హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ.. క్లెయిమ్ చేయని ఖాతాల వివరాలను బహిరంగపరచాలని పిటిషనర్ ఆదేశాలు కోరారని పేర్కొన్నారు. మరణించిన తమ తల్లిదండ్రుల ఖాతాలను ప్రజలు గుర్తించుకునేందుకు వీలుగా ఒక “కేంద్రీకృత మరియు శోధించదగిన డేటాబేస్” ఉండాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ కూడా సిఫార్సు చేసిందని గుర్తుచేశారు. ఇక కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్. వెంకటరామన్ మాట్లాడుతూ.. ఒకవేళ నిజమైన వారసుడు ముందుకు వస్తే డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ నుంచి ఆ మొత్తాన్ని వారికి వాపసు ఇస్తారని తెలిపారు. అయితే ఈ విషయంలో కొత్తగా అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర, ఆర్బీఐలను సుప్రీంకోర్టు ఆదేశించి.. విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: US: అమెరికాలో షాకింగ్ ఘటన.. ట్రంప్ ఉన్నతాధికారి రాజీనామా.. యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
-
ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్బుక్ CX15 భారత్లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!