రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యం! రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యం అని.. ప్రజల ఆరోగ్యం బాగుంటే వ్యక్తిగత ఆదాయం పెరుగుతుందని, తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్రంలో చెత్తను సద్వినియోగం చేసుకునేందుకు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెడుతున్నాం అని.. నెల్లూరు, కాకినాడ, రాజమహేంద్రవరంలతో పాటు రాయలసీమలో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో ఏపీని చెత్త రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దాలనేది తమ…
బీసీలను గత ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తనను, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును అన్యాయంగా జైలులో పెట్టారని మండిపడ్డారు. గత ప్రభుత్వం తప్పిదం వలన అన్ని ఆగిపోయాయని విమర్శించారు. త్వరలో నాగబాబు మంత్రి వర్గంలోకి వస్తారని, ఇక మార్పులు ఉండకపోవచ్చని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంలో రైస్ పుల్లింగ్ జరిగిందని, తప్పు చేయకపోతే పేర్ని నాని ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు. కాకినాడలో ఎన్టీవీతో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ……
కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడి కళాక్షేత్రంలో కూచిపూడి పతాక స్వర్ణోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, కూచిపూడి నృత్య గురువులు, కళాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
రాజకీయ లబ్ధి పొందటం కుదరదు.. రేషన్ బియ్యం కేసులో సూత్రధారి పేర్ని నాని.. ఈ కేసు నుంచి తప్పించుకోలేడని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. గోడౌన్ ప్రారంభం చేసింది పేర్ని భార్య కాదన్నారు.. ఆడవాళ్ళ గౌరవాల గురించి ఇప్పుడు పేర్ని నాని చెప్పటం విడ్డూరంగా ఉంది.. నారా భువనేశ్వరి గురించి సభలో మాట్లాడినపుడు నీ గుణం ఏమైంది నువ్వు ఎక్కడ సచ్చావ్ అంటూ మండిపడ్డారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని గోదాముల్లో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసుపై మంత్రి కొల్లు రవీంద్ర సీరియస్ అయ్యారు. ఈ కేసులో పేర్ని నానికి సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్న అధికారులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. విచారణలో భాగంగా అధికారుల పాత్ర ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ బియ్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటుకు సిఫార్సు చేస్తానన్నారు. తప్పు చేసి డబ్బులు కడితే పేర్ని నాని దొర అవుతాడా? అని మంత్రి ప్రశ్నించారు. పదేపదే నీతి వ్యాఖ్యలు…
అందుకే నల్ల షర్టు వేసుకున్నా.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు హరీష్ రావు, కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరూ కలిసి మా జిల్లాకు నష్టం చేకూరే పనులు చేస్తున్నారు.. అందుకే నల్ల షర్టు వేసుకున్నానని మంత్రి కోమటి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరైడ్ కు శాశ్వత పరిష్కారం ఎస్ఎల్బీసీ అన్నారు. ఎస్ఎల్బీసీ, మూసీ శుద్దికరణ విషయంలో ముఖ్యమంత్రిని అభినందుస్తున్నా అన్నారు. ఒక వైపు ఫ్లోరైడ్, మరోవైపు కోటిన్నర…
హమాస్ అధినేత జాడ తెలిసినా చంపకుండ వదిలేసిన ఇజ్రాయెల్.. హమాస్ అధినేత యాహ్యా సిన్వార్ ఉన్న ప్రదేశం తెలిసిన కూడా ఇజ్రాయెల్ అతడిని మట్టుబెట్టకుండా వదిలేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇజ్రాయెల్కు చెందిన ఎన్12 న్యూస్ ఓ కథనంలో తెలిపింది. ఇటీవల ఐడీఎఫ్ బలగాలకు సిన్వార్ కదలికలపై బలమైన ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చింది. అక్కడే పలువురు బందీలు కూడా ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ఆ ఛాన్స్ ను వినియోగించుకొని అతడిని చంపేస్తే.. అది బందీల ప్రాణాలకు తీవ్ర…
ఏపీలో మద్యం పాలసీ రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐదుగురు మంత్రులతో మద్యం విధానంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవి కుమార్లు ఉండనున్నారు.
బంగ్లాదేశ్లో దేవాలయాలను రక్షించడానికి రాత్రంతా నిలబడిన విద్యార్థులు బంగ్లాదేశ్లో తిరుగుబాటు తర్వాత హిందూ వ్యతిరేక హింస కొనసాగుతోంది. ఢాకాలోని ఖిల్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిందూ దేవాలయాలు, ఇళ్లపై దాడులు జరిగాయి. ఛాందసవాదులు ఇళ్లను ధ్వంసం చేసి దోచుకున్నారు. ఇంతలో విషయం తీవ్రం కావడంతో ఎవరూ హాని చేయవద్దని మసీదుల నుండి ప్రజలు ప్రకటించారు. కొన్ని చోట్ల, దేవాలయాల భద్రత కోసం విద్యార్థులను మోహరించారు. వారు రాత్రంతా ఆలయాలను కాపలాగా ఉంచారు. బంగ్లాదేశ్లోని మసీదు లోపల నుంచి…
కొడాలి నాని, వల్లభనేని వంశీలను పేర్ని నాని దాచాడంటూ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. శవం లేస్తే తప్ప జగన్ ఏపీకి రావట్లేదంటూ కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. తన భద్రత పెంచాలని జగన్ అంటుంటే.. జగన్ నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, ఏపీలో ఎవరైనా చనిపోయి శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ వస్తున్నాడని ఆయన…