PDS Ration Scam: డబ్బులు కడితే పేర్ని నాని దొర అవుతాడా?.. తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు!
- రేషన్ బియ్యం మిస్సింగ్ కేసు
- డబ్బులు కడితే పేర్ని నాని దొర అవుతాడా?
- బియ్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటుకు సిఫార్సు చేస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని గోదాముల్లో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసుపై మంత్రి కొల్లు రవీంద్ర సీరియస్ అయ్యారు. ఈ కేసులో పేర్ని నానికి సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్న అధికారులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. విచారణలో భాగంగా అధికారుల పాత్ర ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ బియ్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటుకు సిఫార్సు చేస్తానన్నారు. తప్పు చేసి డబ్బులు కడితే పేర్ని నాని దొర అవుతాడా? అని మంత్రి ప్రశ్నించారు. పదేపదే నీతి వ్యాఖ్యలు చెప్పే పేర్ని నాని.. ఇపుడు ఎక్కడ ఉన్నాడు? అని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు.
మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ… ‘పేదల బియ్యం కొట్టేసిన పేర్ని నానిని పంది కొక్కులా చూడాలి. నీతులు చెప్పే నాని ఇప్పుడు అడ్రస్ లేరు. దొంగ పనులు చేసి.. నిత్యం నీతులు చెప్పేవారు. తప్పు చేసి డబ్బులు కడితే దొర అవుతాడా?. పదేపదే నీతి వ్యాఖ్యలు చెప్పే నాని.. ఇపుడు ఎక్కడ ఉన్నారు?. పేర్ని నాని కుటుంబం స్కాం చేసింది వాస్తవం, అది స్వయానా నాని ఒప్పుకున్నారు. దారి మళ్లిన పీడీఎస్ రైస్ స్కాంపై వివరణ ఇచ్చుకోలేని దుస్థితిలో నాని ఉన్నారు. తప్పు చేయనపుడు దొంగలా తప్పించుకొని తిరగడం ఎందుకు?’ అని ప్రశ్నించారు.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
Also Read: Prakasam Earthquakes: ప్రకాశం జిల్లాలో వరుసగా మూడోరోజు భూప్రకంపనలు!
‘తప్పు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు. స్కాంపై సిట్ ఏర్పాటుకు సిఫార్సు చేస్తాను. విచారణలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. కక్ష సాధింపు చేయాల్సిన మాకు అవసరం లేదు. కక్ష సాధింపు చేస్తే స్కాంలో ఉన్న పేర్ని నాని కుటుంభం మొత్తాన్ని జైలుకు పంపేవాళ్లం. కానీ మేము అలా చేయలేదు’ అని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. పేర్ని నాని అధికార దుర్వినియోగానికి పాల్పడి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారని ఆరోపణలు ఉన్నాయి. 32,00 బస్తాల రేషన్ బియ్యం తగ్గినట్టు అధికారులకు నాని లేఖ రాయగా.. అధికారుల పరిశీలనలో 3,708 బస్తాలు తగ్గినట్టు తేలింది. బియ్యం తగ్గడంపై 2 దఫాలుగా రూ.1.70 కోట్లు పేర్ని నాని చెల్లించారు. గోదాములు నాని భార్య జయసుధ పేరుతో ఉండటంతో పోలీసులు ఆమెపై కూడా కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
UDF Kerala Government: కేరళంలో ‘యూడీఎఫ్’ నూతన శకం.. నేడే సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం! మంత్రుల జాబితా ఇదే..
-
Peddi: రామ్ చరణ్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..?
-
F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..