కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్షపై సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ కీలక సమాచారాన్ని అందించారు. యెమెన్లో ప్రస్తుతం భారతీయ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్ష నిలిపివేయబడిందని.. ప్రతికూలంగా ఏమీ జరగలేదని న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనానికి కేంద్రం తరపున హాజరైన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి తెలిపారు.
K.A. Paul: యెమెన్లో మరణశిక్ష నుంచి తప్పించుకున్న కేరళ నర్సు నిమిష ప్రియ గురించి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచల వ్యాఖ్యలు చేశారు. యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న నిమిష ప్రియ జూలై 16న చనిపోవాల్సింది. జూలై 14 న సుప్రీం కోర్టులో నిమిషను కాపాడలేక పోయాం అని కేంద్రం చెప్పింది. కానీ మొత్తానికి ఆమెను మరణ శిక్ష నుంచి తప్పించాం. కానీ నాకు పేరు ప్రఖ్యాతలు వస్తాయని కొన్ని శక్తులు ఆమె విడుదలను ఆపించారని…
భారత సంతతికి చెందిన కేరళ నర్సు నిమిషా ప్రియను క్షమించొద్దని.. ఆమెను శిక్షించాల్సిందేనని తలాల్ అబ్దో మోహదీ సోదరుడు అబ్దుల్ఫత్తా మెహది డిమాండ్ చేశాడు. నేరస్థురాలిని బాధితురాలిగా చూడొద్దని కోరాడు. ఎట్టి పరిస్థితుల్లో ‘బ్లడ్మనీ’(పరిహారం)ని అంగీకరించబోమని తేల్చి చెప్పాడు.
భారతీయ నర్సు నిమిషా ప్రియ మరణశిక్ష వాయిదా పడింది. నిమిషా ఉరిశిక్ష అమలును వాయిదా వేసిన యెమెన్. నిమిష ప్రియను రక్షించేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. యెమెన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది భారత సర్కార్. హత్య కేసులో నిమిషా ప్రియకు మరణశిక్ష విధించింది అక్కడి ప్రభుత్వం. జూలై 16, బుధవారం ఉరిశిక్ష అమలు చేయాలని ముందుగా నిర్ణయించారు. ఆమె 2017 నుంచి యెమెన్లో జైలులో ఉంది. యెమెన్ పౌరుడు తలాల్ అబ్దో మహదీని హత్య చేసిన…
యెమెన్లో భారత సంతతికి చెందిన కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్షపై కేంద్రం చేతులెత్తేసింది. ఉరిశిక్షను నిలిపివేసేందుకు అన్ని చర్యలు చేపట్టామని.. దౌత్యపరంగా చేపట్టాల్సిన అన్ని అయిపోయాయని సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది.
Nimisha priya Case: కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియా యెమెన్ దేశంలో ఉరికంబానికి దగ్గర అవుతున్నారు. ఆ దేశస్తుడైన తలాల్ అబ్దో మహదీని 2017లో హత్య చేసిన కారణంగా ఆమెను అక్కడి చట్టాల ప్రకారం ఉరిశిక్ష విధించబడింది. జూలై 16న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు.
Nimisha Priya: యెమెన్ దేశంలో కేరళకు చెందిన నర్సు ఉరికంబం ఎక్కేందుకు సిద్ధమైంది. 2017లో ఆ దేశ జాగీయుడైన తలాల్ అబ్దో మెహదీని హత్య చేసిన కారణంగా జూలై 16న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు. 36 ఏళ్ల నిమిషాకు 2020లో అక్కడి న్యాయవ్యవస్థ మరణశిక్షను విధించింది. అయితే, నిమిషాను కాపాడేందుకు ససేవ్ నిమిషా ప్రియ యాక్షన్ కౌన్సిల్ అధికారులు, యెమెన్ అధికారులు బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది.
Nimisha Priya case: హత్య ఆరోపణలపై యెమెన్ దేశంలో మరణశిక్ష విధించబడిన భారతీయ మహిళ నిమిషా ప్రియ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ‘‘ మానవతా కారణాల’’ దృష్ట్యా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉణ్నట్లు ఇరాన్ సీనియర్ అధికారి గురువారం తెలిపారు.
Nurse Nimisha Priya: యెమెన్లో కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ (36)కు మరణశిక్ష విధించిన విషయం కలకలం రేపుతోంది. యెమెన్ జాతీయుడి హత్య కేసులో నిమిష ప్రియ దోషిగా తేల్చబడగా, ఇటీవలే యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఆమె మరణశిక్షను ధృవీకరించారు. ఈ శిక్షను నెల రోజుల లోపు అమలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై భారత విదేశాంగశాఖ స్పందించింది. నిమిష ప్రియ కేసు తమ దృష్టికి వచ్చినట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి…
Blood Money: కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్ కోర్టు మరణశిక్ష విధించింది. యెమెన్ దేశ పౌరుడిని హత్య చేసిన కేసులో 2017లో ఆమెకు శిక్ష విధించింది. అక్కడి సుప్రీంకోర్టు కూడా ఆమె చేసుకున్న అప్పీల్ని తిరస్కరించింది. అయితే ఇండియాలో ఉన్న ఆమె తల్లి మాత్రం కూతురు ప్రాణాల కోసం పోరాడుతోంది. దీనిపై ఢిల్లీ హైకోర్టులో తాను యెమెన్ వెళ్లేందుకు అవకాశం కల్పించాలని ఈ ఏడాది ప్రారంభంలో ప్రియ తల్లి పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నిర్ణయం…