Nimisha priya Case: నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్షపై ఏం చేయలేం.. సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడి
- నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్షపై ఏం చేయలేం
- సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యెమెన్లో భారత సంతతికి చెందిన కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్షపై కేంద్రం చేతులెత్తేసింది. ఉరిశిక్షను నిలిపివేసేందుకు అన్ని చర్యలు చేపట్టామని.. దౌత్యపరంగా చేపట్టాల్సిన అన్ని అయిపోయాయని సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. ఇక తమ చేతుల్లో ఏమీలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉరిశిక్ష నిలిపివేతపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా న్యాయస్థానానికి సోమవారం కేంద్రం ఈ విధంగా తెలియజేసింది.
ఇది కూడా చదవండి: Yamaha FZ-X Hybrid: కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా?.. యమహా FZ-X హైబ్రిడ్ విడుదల.. ఈ బైక్ పై ఓ లుక్కేయండి
Also Read
- Abhijit Deepke: బీజేపీలో చేరాలని అభిజిత్ దీప్కేకు బెదిరింపులు.. తల్లి సంచలన ఆరోపణ..
- CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
- IMD Alert: దేశ వ్యాప్తంగా రుతుపవనాలు.. ఈ రాష్ట్రాలకు భారీ వర్షాలు
- Nitin Gadkari: 2016కు ముందు వాహనాలకు కొన్ని మార్పులు అవసరం.. E20 పెట్రోల్పై గడ్కరీ..
కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిషా ప్రియ 2017, జూలైలో యెమెన్ జాతీయుడు తలాల్ అబ్దో మెహదీని హత్య చేసిన కేసులో అరెస్టు అయింది. మరొక నర్సు సహాయంతో మత్తుమందు ఇచ్చి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరూ కలిసి అతని శరీరాన్ని ముక్కలు చేసి, అవశేషాలను భూగర్భ ట్యాంక్లో పడవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే నిమిషా ఈ ఆరోపణలను కోర్టులో సవాలు చేసింది. కానీ కోర్టులు ఆమె అప్పీళ్లను తోసిపుచ్చాయి. చివరికి ఈ కేసులో ఆమెను దోషిగా తేల్చింది. అనంతరం న్యాయస్థానం ఆమెకు ఉరిశిక్ష విధించింది.
ఇది కూడా చదవండి: Rajni : సూపర్ హిట్ దర్శకుడితో సూపర్ స్టార్
అయితే ప్రస్తుతం యెమెన్ దేశం హౌతీల నియంత్రణలో ఉంది. దీంతో దౌత్యపరంగా భారత్కు అడ్డంకులు ఎదురయ్యాయి. ఆమె విడుదల కోసం కేంద్రం చేసిన ప్రయత్నాలు ఏ ఒక్కటి ఫలించలేదు. నర్సు విడుదల కోసం కేంద్రం చేపట్టాల్సిన చివరి ప్రయత్నాన్ని కూడా చేపట్టినా ప్రయోజనం లేదని కోర్టుకు కేంద్రం తరపున అటార్నీ జనరల్ తెలిపారు.
నిమిషా ప్రియ.. 2008 నుంచి యెమెన్లో నర్సుగా పనిచేస్తోంది. 2011లో వివాహం తర్వాత ఆమె తన భర్త టామీ థామస్తో కలిసి యెమెన్ దేశానికి వెళ్లింది. 2014లో యెమెన్లో అంతర్యుద్ధం కారణంగా ఆమె భర్త కుమార్తెతో కేరళకు తిరిగి వచ్చేశాడు. నిమిషా మాత్రం యెమెన్లోనే ఉండిపోయింది. అనంతరం ఆమె యెమెన్ జాతీయుడితో కలిసి నర్సింగ్ హోమ్ ప్రారంభించింది. అయితే ఆమెపై మెహదీ అఘాయిత్యం చేయబోయాడు. అనేక మార్లు శారీరికంగా వేధించాడు. అంతేకాకుండా పాస్పోర్టును కూడా స్వాధీనం చేసుకున్నాడు. అయితే పాస్పోర్టును తిరిగి పొందే క్రమంలో మత్తు మందులు ఇచ్చానని.. కానీ అతడు అధిక మోతాదులో తీసుకోవడం వల్లే చనిపోయినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె సనా సెంట్రల్ జైలులో ఉంది. మంగళవారం ఉరిశిక్ష పడే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇక ఉరిశిక్షను ఆపాలంటూ ప్రధాని మోడీకి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. ఈ మేరకు ఫిబ్రవరి 6, మార్చి 24, 2025న లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్కు లేఖలు పంపి విజ్ఞప్తి చేశారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత వేణుగోపాల్ కూడా కేంద్రాన్ని కోరారు. అయితే కేంద్రం చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.
తాజావార్తలు
-
Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ జోరు.. శ్రీశంకర్కు రజతం, దిలీప్ గావిత్కు స్వర్ణం..
-
Abhijit Deepke: బీజేపీలో చేరాలని అభిజిత్ దీప్కేకు బెదిరింపులు.. తల్లి సంచలన ఆరోపణ..
-
Pallaburusu Teaser: నాగ చైతన్య చేతుల మీదుగా ‘పళ్ళబురుసు’ టీజర్ విడుదల.. పల్లె నేపథ్యంలో వినోదానికి గ్యారంటీ!
-
US Iran War: జోర్డాన్ దాడికి ప్రతీకారం.. ఇరాన్పై అమెరికా దాడులు..
-
Astrology: జూలై 30 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!