Nurse Nimisha Priya: యెమెన్లో నిమిష ప్రియకు మరణశిక్ష.. అధికారులతో భారత ప్రభుత్వం చర్చలు
- యెమెన్లో నిమిష ప్రియకు మరణశిక్ష..
- అధికారులతో భారత ప్రభుత్వం చర్చలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nurse Nimisha Priya: యెమెన్లో కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ (36)కు మరణశిక్ష విధించిన విషయం కలకలం రేపుతోంది. యెమెన్ జాతీయుడి హత్య కేసులో నిమిష ప్రియ దోషిగా తేల్చబడగా, ఇటీవలే యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఆమె మరణశిక్షను ధృవీకరించారు. ఈ శిక్షను నెల రోజుల లోపు అమలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై భారత విదేశాంగశాఖ స్పందించింది. నిమిష ప్రియ కేసు తమ దృష్టికి వచ్చినట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం యత్నిస్తోందని పేర్కొన్నారు.
Also Read: Traffic Rules In Hyderabad: హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. అతి చేసారో..?
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
2017లో జరిగిన యెమెన్ జాతీయుడు అబ్దో మెహదీ హత్య కేసులో నిమిష ప్రియను అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం ఆమెను దోషిగా తేల్చిన కోర్టు మరణశిక్ష విధించింది. ఈ నిర్ణయంపై నిమిష ప్రియ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసినా, దాన్ని తిరస్కరించారు. చివరగా, యెమెన్ అధ్యక్షుడు మరణశిక్షను ధృవీకరించడంతో నిమిష ప్రియ పరిస్థితి దారుణంగా తయారైంది. నిమిష ప్రియను శిక్ష నుంచి కాపాడే శక్తి ఇప్పుడు హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యుల చేతిలోనే ఉంది. వారు క్షమాభిక్ష పెడితేనే ఈ శిక్ష నుంచి ఆమె బయటపడగలదు. ఈ విషయాన్ని గ్రహించిన నిమిష తల్లి ప్రేమకుమారి యెమెన్కు వెళ్లి, అక్కడి గిరిజన నేతలను సంప్రదించి క్షమాభిక్ష కోరే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, అధ్యక్షుడి నిర్ణయం ఆమె కృషిని వృథా చేయడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది.
Also Read: Parliament scuffle: ఆ రోజు రాహుల్ గాంధీ ఒక ఎంపీలా కాకుండా బౌన్సర్లా ప్రవర్తించారు..
నిమిష ప్రియ మరణశిక్ష రద్దు చేయించేందుకు భారత ప్రభుత్వం యెమెన్ అధికారులతో చర్చలు జరుపుతోంది. నిమిష కుటుంబ సభ్యులు ఆమెకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. ఈ ఘటన భారతీయుల మనోభావాలను కలిచివేసింది. నిమిష ప్రియకు న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం, యెమెన్ అధికారులను పలువురు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!