Nimisha Priya: ఉరికంబం ఎక్కబోతున్న నిమిషా ప్రియను కాపాడే అవకాశం ఉందా.?
- నిమిషా ప్రియాను కాపాడే చివరి అవకాశం..
- యెమెన్లో కేరళ నర్సుకు ఉరిశిక్ష..
- ‘‘బ్లడ్ మనీ’’తో బాధిత కుటుంబానికి భారీ ఆఫర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nimisha Priya: యెమెన్ దేశంలో కేరళకు చెందిన నర్సు ఉరికంబం ఎక్కేందుకు సిద్ధమైంది. 2017లో ఆ దేశ జాగీయుడైన తలాల్ అబ్దో మెహదీని హత్య చేసిన కారణంగా జూలై 16న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు. 36 ఏళ్ల నిమిషాకు 2020లో అక్కడి న్యాయవ్యవస్థ మరణశిక్షను విధించింది. అయితే, నిమిషాను కాపాడేందుకు ససేవ్ నిమిషా ప్రియ యాక్షన్ కౌన్సిల్ అధికారులు, యెమెన్ అధికారులు బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది.
ఇప్పుడున్న చివర ఆప్షన్ ఏంటంటే, నిమిషా ప్రియాను కాపాడేందుకు బాధితుడి కుటుంబాన్ని ‘‘బ్లడ్ మనీ’’కి ఒప్పించడమే. ఈ ఆఫర్ అంగీకరించేలా ఆ కుటుంబాన్ని యెమెన్కు చెందిన ప్రభావవంతమైన వ్యక్తుల సాయంతో ప్రయత్నిస్తున్నారు. మెహదీ కుటుంబానికి ఇచ్చిన ఆఫర్లలో, ఆ కుటుంబానికి 1 మిలియన్ డాలర్ల సాయం అందించడంతో పాటు, ఆ కుటుంబం సిఫారసు చేసిన వ్యక్తికి లేదా ఏ ఇతర వ్యక్తికైనా కేరళలో ఉచిత చికిత్స అందించడం, ఇందులో ప్రయాణ ఖర్చుల్ని కూడా భరించడం ఉంది. దీనికి తోడు మెహదీ సోదరుడు యూఏఈ, సౌదీ అరేబియాలో స్థిరపడాలని నిర్ణయించుకుంటే ఖర్చులను భరించేందుకు ముందుకొచ్చారు. నిమిషా ప్రియాను రక్షించేందుకు భారత ప్రభుత్వం చేయాల్సిందంతా చేసినట్లు, సేవ్ నిమిషా ప్రియ యాక్షన్ కౌన్సిల్ సభ్యులు చెప్పారు. అయితే, ఈ ఆఫర్పై మెహదీ కుటుంబ సభ్యులు ఇంకా స్పందించలేదు.
Also Read
- Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. 'లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్' అంటూ ఫైర్!
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
Read Also: AP Cabinet: 200 కంపెనీలకు వైసీపీ తప్పుడు ఇ-మెయిల్స్.. సీఎంకు ఆధారాలు చూపిన మంత్రి పయ్యావుల!
2008లో ఉద్యోగం కోసం నిమిషా ప్రియా యెమెన్ వెళ్లింది. ఆ సమయం, మెహదీతో కలిసి స్థానికంగా 2015లో సొంత క్లినిక్ ప్రారంభించింది. అయితే, ఆ తర్వాత మెహదీ, నిమిషా పాస్పోర్టును స్వాధీనం చేసుకుని వేధించడం ప్రారంభించాడు. తన పాస్పోర్టు తిరిగిపొందేందుకు నిమిషా, మెహదీకి మత్తుమందు ఇచ్చింది. అయితే, డోస్ ఎక్కువ కావడంతో అతను చనిపోయాడు. యెమెన్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడి అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. 2020లో ప్రియాకు స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె కుటుంబం యెమెన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీల్ను 2023లో తోసిపుచ్చింది. ఈ సంవత్సరం జనవరిలో, తిరుగుబాటుదారు హౌతీల సుప్రీం పొలిటికల్ కౌన్సిల్ అధ్యక్షుడు మహదీ అల్-మషత్ ఆమెకు ఉరిశిక్ష విధించారు. షరియా చట్టాల ప్రకారం, బాధిత కుటుంబం క్షమిస్తేనే ఉరిశిక్ష నుంచి తప్పించుకోగలరు.
తాజావార్తలు
-
FIFA World Cup 2026: ఆకాశాన్నంటిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ టిక్కెట్ల ధరలు.. 32 ఏళ్లలో 10 రెట్లు పెరిగినయ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Censor Issues : జననాయగన్కు సెన్సార్ బోర్డ్ లైన్ క్లియర్.. ఇక టాక్సిక్ పరిస్థితి ఏంటి?
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వివాదాలు, చికాకులు తప్పవు!
-
Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. ‘లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్’ అంటూ ఫైర్!
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!