Nimisha priya Case: కేరళ నర్సు నిమిష ప్రియ కేసేంటి.? ఏం జరిగింది..?
- ఉరికంబానికి చేరువగా నిమిషా ప్రియా..
- యెమెన్లో హత్యా నేరానికి శిక్ష ఖరారు..
- శిక్ష నుంచి తప్పించేందుకు ‘‘బ్లడ్ మనీ’’ ఆఫర్..
- అసలు ఏంటీ నిమిషా ప్రియా కేసులు, ఎలా హత్య నేరంలో ఇరుక్కుంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nimisha priya Case: కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియా యెమెన్ దేశంలో ఉరికంబానికి దగ్గర అవుతున్నారు. ఆ దేశస్తుడైన తలాల్ అబ్దో మహదీని 2017లో హత్య చేసిన కారణంగా ఆమెను అక్కడి చట్టాల ప్రకారం ఉరిశిక్ష విధించబడింది. జూలై 16న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు. ప్రస్తుతం, ఈ కేసును భారత సుప్రీంకోర్టు జూలై 14న విచారించబోతోంది. ఈ కేసులో నిమిషా ప్రియాను రక్షించాలంటే, బాధితుడు మహదీ కుటుంబం ‘‘బ్లడ్ మనీ’’ రూపంలో పరిహారానికి అప్పగించడమే మార్గంగా ఉంది. మహదీ కుటుంబానికి “సేవ్ నిమిషా ప్రియ యాక్షన్ కౌన్సిల్” భారీ పరిహారాన్ని ఆఫర్ చేస్తోంది.
ఏమిటి నిమిషా ప్రియా కేసు..?
Also Read
- Tiffany Trump: తాజ్ మహల్ అందాలకు ఫ్లాట్ అయిన ట్రంప్ బిడ్డ.. భారత్లో టిఫనీ సందడి మామూలుగా లేదుగా!
- Pete Hegseth: ఇరాన్పై మళ్లీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.. అమెరికా రక్షణ మంత్రి హెచ్చరిక
- Cuba vs America: క్యూబాలో నాయకత్వ మార్పు? ఫిడెల్ కాస్ట్రో కుమార్తె సంచలన వ్యాఖ్యలు!
- Lashkar-e-Taiba: భారత్ను టార్గెట్ చేస్తూ బార్డర్ల కొత్త ఉగ్ర కోట.. నిఘా వర్గాల చేతికి లష్కర్ సీక్రెట్ మ్యాప్!
యెమెన్ దేశంలో నర్సుగా పనిచేసేందుకు వెళ్లిన నిమిషా అనూహ్యంగా హత్య కేసులో ఇరుక్కుంది. నర్సుగా యెమెన్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో కొన్ని సంవత్సరాలు పనిచేసింది. 2014లో ఆమె భర్త, మైనర్ కుమార్తె ఆర్థిక కారణాల వల్ల భారత్ తిరిగి వచ్చారు. అదే ఏడాది యెమెన్ అంత్యర్ధుద్ధంలో చిక్కుకుంది. దేశం కొత్త వీసాలు జారీని నిలిపివేసినందుకు తిరిగి వెళ్లలేకపోయారు.
అయితే, 2015లో నిమిషా యెమెన్ రాజధాని సనా వెళ్లిన నిమిషా అక్కడ స్థానిక యెమెన్ జాతీయుడైన మహదీతో ఓ క్లినిక్ ఓపెన్ చేసింది.యెమెన్ చట్టం ప్రకారం, క్లినిక్లు మరియు వ్యాపార సంస్థలను స్థాపించడానికి జాతీయులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె మహదీ మద్దతు కోరింది. ఆ తర్వాత పరిణామాల్లో మహదీ ఆమెను వేధించడం ప్రారంభించాడు. ఆమె పాస్పోర్టుని లాక్కుని వేధింపులకు గురిచేశాడు. ఆమెను పెళ్లి చేసుకున్నట్లుగా అనేక దొంగ సాక్ష్యాలు సృష్టించాడు. ఈ నేపథ్యంలోనే ఆమె తన పాస్పోర్టుని లాక్కోవడానికి మహదీకి మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చింది. ఇది వికటించి అనుకోకుండా అతను మరణించాడు.
“బ్లడ్ మనీ” ఒక్కటే మార్గం:
షరియా చట్టాల ప్రకారం, ఒక వ్యక్తి ఏదైనా నేరం, ముఖ్యంగా హత్య వంటి కేసుల్లో శిక్ష నుంచి తప్పించుకోవాలంటే బాధిత కుటుంబాల ‘‘క్షమాభిక్ష’’ అవసరం. వారు క్షమిస్తేనే శిక్ష నుంచి నిందితుడు బయటపడొచ్చు. దీని కోసం బాధిత కుటుంబానికి భారీ పరిహారాన్ని ఇచ్చి క్షమాభిక్షను సాధించవచ్చు. దీనిని ‘‘బ్లడ్ మనీ’’గా పిలుస్తారు. బాధిత కుటుంబం బ్లడ్ మనీ అంగీకరించేలా యెమెన్కు చెందిన ప్రభావవంతమైన వ్యక్తుల సాయంతో ప్రయత్నిస్తున్నారు. మెహదీ కుటుంబానికి ఇచ్చిన ఆఫర్లలో, ఆ కుటుంబానికి 1 మిలియన్ డాలర్ల సాయం అందించడంతో పాటు, ఆ కుటుంబం సిఫారసు చేసిన వ్యక్తికి లేదా ఏ ఇతర వ్యక్తికైనా కేరళలో ఉచిత చికిత్స అందించడం, ఇందులో ప్రయాణ ఖర్చుల్ని కూడా భరించడం ఉంది. దీనికి తోడు మెహదీ సోదరుడు యూఏఈ, సౌదీ అరేబియాలో స్థిరపడాలని నిర్ణయించుకుంటే ఖర్చులను భరించేందుకు ముందుకొచ్చారు.
తాజావార్తలు
-
IRCTC Jyotirlinga Darshan Yatra: శివభక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్.. ఒకే టూర్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!
-
Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
-
Peddi Pre-Release Event : ‘పెద్ది’ ప్రీరిలీజ్ ఈవెంట్ కు అతిథిగా స్టార్ హీరో
-
Mamata Banerjee: “ఇక మేమేంటో చూపిస్తాం”.. అల్లుడు అభిషేక్పై దాడి అనంతరం దీదీ ఆడియో వైరల్..
-
LPG New Rules: LPG కస్టమర్లకు షాక్.. జూన్ 1 నుంచి మీ గ్యాస్ కనెక్షన్ రద్దు కావచ్చు! కేంద్రం కొత్త రూల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..