Blood Money: ఉరిశిక్ష నుంచి కేరళ నర్సును రక్షించాలంటే ‘బ్లడ్ మనీ’ ఒక్కటే మార్గం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Blood Money: కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్ కోర్టు మరణశిక్ష విధించింది. యెమెన్ దేశ పౌరుడిని హత్య చేసిన కేసులో 2017లో ఆమెకు శిక్ష విధించింది. అక్కడి సుప్రీంకోర్టు కూడా ఆమె చేసుకున్న అప్పీల్ని తిరస్కరించింది. అయితే ఇండియాలో ఉన్న ఆమె తల్లి మాత్రం కూతురు ప్రాణాల కోసం పోరాడుతోంది. దీనిపై ఢిల్లీ హైకోర్టులో తాను యెమెన్ వెళ్లేందుకు అవకాశం కల్పించాలని ఈ ఏడాది ప్రారంభంలో ప్రియ తల్లి పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు కేంద్రాన్ని కోరింది.
ఇదిలా ఉంటే ఈ కేసు నుంచి ప్రాణాలతో నిమిష ప్రియ బయటపడాలంటే కేవలం ‘బ్లడ్ మనీ’తో మాత్రమే సాధ్యమని న్యాయవాది సుభాష్ చంద్రన్ తెలిపారు. యెమెన్లో షరియా చట్టాన్ని పాటిస్తారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే బాధిత కుటుంబంతో నేరుగా చర్చలు జరపడమే మార్గమని, వారికి నష్టపరిహారానికి ఒప్పుకుని క్షమాభిక్ష పెడితేనే ప్రియ మరణశిక్ష నుంచి తప్పించుకోగలదని చెప్పారు.
అయితే అది అనుకున్నంత సులభం కానది చంద్రన్ వెల్లడించారు. 2016 నుంచి యెమెన్కి ప్రయాణ నిషేధం ఉంది. భారత ప్రభుత్వ అనుమతి లేకుండా అక్కడికి వెళ్లలేం. దీని కారణంగానే ప్రియ తల్లి యెమెన్ వెళ్లి భాదిత కుటుంబంతో చర్చించలేకపోతోందని అన్నారు.
Also Read
- Trump: రష్యా, ఉక్రెయిన్కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
- Modi-Meloni: ఇటలీ ప్రధానిగా మెలోని రికార్డ్.. మోడీ అభినందనలు.. రిప్లై ఇదే!
- Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. "మహామంత్రం" జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..
- Belgium: భారత్ ఎప్పుడో హెచ్చరించింది, మేము వినలేదు.. చైనాకు బెల్జియం ప్రధాని షాక్..
‘బ్లడ్ మనీ’ అనేది హత్య చేసిన వ్యక్తి, హత్యకు గురైన వ్యక్తి కుటుంబానికి ఇచ్చే నష్టపరిహారం. దీనిపై శిక్ష పడిన వ్యక్తి కుటుంబ సభ్యులు, బాధిత కుటుంబంతో చర్చించాల్సి ఉంటుంది. అయితే గురువారం ఢిల్లీ హైకోర్టు ప్రియ తల్లి యెమెన్ వెళ్లే అంశంపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది.
కేసు వివరాలు ఇవే:
కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియా కుటుంబం కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం యెమెన్ వెళ్లింది. 2014లో ఆమె భర్త, కూతురు తిరిగి ఇండియాకు వచ్చారు. అయితే నిమిష మాత్రం ఉద్యోగరీత్యా అక్కడే ఉండిపోయింది. ఆ దేశానికి చెందిన తలాల్ మహ్దీ సాయంతో అక్కడే ఓ క్లినిక్ ప్రారంభించింది. కాగా కొన్ని రోజులకే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. నిమిష ప్రియను అతను శారీరకంగా, మానసికంగా వేధించడమే కాకుండా ఆమె పాస్పోర్టును లాక్కున్నాడు. తన పాస్ పోర్టును తిరిగి పొందాలనే ఉద్దేశంతో నిమిష అతనికి మత్తుమందు ఇచ్చింది. ఇది ఓవర్ డోస్ కావడంతో అతను మరణించాడు. ఏం చేయాలో తెలియక హత్య విషయాన్ని వేరే వ్యక్తికి చెప్పింది. ఇద్దరూ కలిసి మృతదేహాన్ని మాయం చేశారు. నాలుగు రోజుల తర్వాత వారి నేరం బయటకు రావడంతో ఇద్దర్ని అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో యెమెన్ కోర్టు నిమిష ప్రియకు మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
తాజావార్తలు
-
Dancers Union Clash: పోలీసుల వద్దకి సినీ డాన్సర్స్ యూనియన్ పంచాయతీ!
-
NSE IPO: భారత చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ రెడీ.. రూ. 5 లక్షల కోట్ల వ్యాల్యుయేషన్..
-
Hyderabad: లవ్ ఫెయిల్యూర్తో సూసైడ్ ప్లాన్.. నిమిషాల్లో యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు
-
Free LPG Cylinders Scheme: గుడ్న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
-
Krishna River Management Board: తెలంగాణకు KRMB షాక్.. కీలక ఆదేశాలు జారీ..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!