ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ఆపండి అంటూ అందులో పేర్కొన్నారు.
Karnataka CM swearing-in ceremony: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 224 స్థానాల్లో ఏకంగా 135 స్థానాలను గెలుచుకుంది. అయితే గెలిచిన తర్వాత సీఎం పీఠం కోసం సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ ఎదురైంది. నాలుగు రోజుల హస్తినలో చర్చల తర్వాత సిద్దరామయ్యను కాంగ్రెస్ అధిష్టానం సీఎంగా ప్రకటించింది. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ను కాంగ్రెస్ అధిష్టానం ఒప్పించింది. మే 20న బెంగళూర్ లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.
CM KCR: ఎన్నికలు జరిగితే తెలంగాణలో బీఆర్ఎస్కు 105 సీట్లు వస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Gutha Sukender Reddy: కాంగ్రెస్ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారికి ఒక్క ఓటు వేసినా రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరే అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Good News: చదువుతో పాటు విద్యార్థుల ఆకలి తీర్చుతున్నాయి ప్రభుత్వాలు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లోని సర్కారు బడుల్లో మధ్యాహ్నా భోజనం అమలవుతుంది. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.
కర్ణాటక లో కాంగ్రెస్ గెలుపు ఖాయం అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ వస్తే తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తది అని ఆయన కామెంట్స్ చేశారు.
జూనియర్ సెక్రటరీలకు ప్రతిపక్ష నాయకులు సపోర్టు ఇస్తున్నారు. ప్రభుత్వం దర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా జేపీఎస్ ల సమ్మెకు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మద్దతు ప్రకటించారు.
Kishan Reddy: ఓఆర్ఆర్ను 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాల్సిన అవసరం ఏముందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు.
Revanth reddy: అందరూ హనుమాన్ చాలీసా చదవాలిసిందే అని, లక్ష్మణ్.. కిషన్ రెడ్డి వస్తే కలిసి చదువు కుందామని టీపీసీసీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేవారు. గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీ మీకోసం వస్తున్నారని, వరంగల్ రైతు డిక్లరేషన్ మాదిరిగానే యువత కోసం హైదరాబాద్ డిక్లరేషన్ అన్నారు.