Kishan Reddy: ఓఆర్ఆర్ ను లీజుకు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: ఓఆర్ఆర్ను 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాల్సిన అవసరం ఏముందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. HMDA టోల్ ట్యాక్స్ ద్వారా 30 ఏళ్లలో రూ. 75 వేల కోట్ల ఆదాయం వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ORRపై ఆదాయం పెరగదు కానీ తగ్గదు. నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారమే లీజుకు ఇచ్చామని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న మాటలను కిషన్ రెడ్డి కొట్టిపారేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెబుతున్న బీఆర్ఎస్ పార్టీ ఓఆర్ఆర్ను ప్రైవేట్ కంపెనీకి ఎందుకు లీజుకు ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రశ్నించారు. ఏ కంపెనీకి టెండర్ వేయాలనేది ముందే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఓఆర్ఆర్ ప్రైవేటీకరణ పేరుతో కల్వకుంట్ల కుటుంబం కొత్త డ్రామాకు తెరలేపిందని ఆరోపించారు.
Read also: Neet Exam: నీట్ పరీక్ష నిబంధనలపై పేరెంట్స్ ఫైర్.. ఇవేం రూల్స్ అంటూ..
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
హెచ్ఎండీఏ మాస్టర్ప్లాన్కు 2031 వరకు మాత్రమే అనుమతి ఉందని.. 2031 వరకు మాత్రమే మాస్టర్ప్లాన్కు ఆమోదం తెలిపినా ఓఆర్ఆర్ను 30 ఏళ్లకు ఎలా లీజుకు ఇస్తారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రశ్నించారు. ఏపీలో విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం కొంటామని కేసీఆర్ సర్కార్ హడావుడి ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణకు తలమానికంగా ఉన్న ఓఆర్ఆర్ను కేసీఆర్ సర్కార్ ప్రైవేట్ కంపెనీకి 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడాన్ని కిషన్ రెడ్డి తప్పుబట్టారు. ఓఆర్ఆర్ను ఐఆర్బీ కొనుగోలు చేసిందని కిషన్రెడ్డి తెలిపారు. ORR టోల్ ఫీజు ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఏటా రూ. 415 కోట్ల ఆదాయం వస్తుంది. 30 ఏళ్ల తెలంగాణకు ప్రస్తుత బేస్ ధర ప్రకారం రూ. 30 వేల కోట్లు ఆదాయం వస్తుందని చెప్పారు. ఏటా 10 శాతం టోల్ ఫీజు పెంచితే 30 ఏళ్ల పాటు తెలంగాణ ప్రభుత్వానికి రూ. 70 వేల కోట్ల ఆదాయం వస్తుంది. పూణే-ముంబై ఎక్స్ప్రెస్ హైవేకి పదేళ్లపాటు రూ. 8,875 కోట్లకు లీజుకు తీసుకున్నారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. దేశంలో చాలా హైవేలను పది నుంచి 15 ఏళ్లకే లీజుకు తీసుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తావించారు.
Mocha: మోచా తుఫాన్, తెలుగు రాష్ట్రాల్లో ఎఫెక్ట్
- Tags
- BRS
- kcr
- Kishan Reddy
- NHAI
- orr
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!