ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తన సెటిల్ మెంట్ కోసమే.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నట్లు బండి సంజయ్ ఆరోపించారు. అటు మంత్రి కేటీఆర్ నలుగురు బీజేపీ కార్పొరేటర్ లు టచ్ లో ఉన్నారు అని అంటున్నాడు.. మాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్నారు. తాము రాజకీయ వ్యభిచారులం కాదని... బీజేపీలో చేరాలి అంటే రాజీనామా చేయాలన్నారు.
CM KCR: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు 'తెలంగాణ మెడికల్ డే' నిర్వహించనున్నారు. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ లో అత్యాధునిక 2000 పడకల సూపర్ స్పెషాలిటీ కొత్త బ్లాక్కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు 24 జిల్లాల్లోని గర్భిణులకు కేసీఆర్ పౌష్టికాహార కిట్ల పంపిణీ తెలంగాణ వైద్య దినోత్సవ వేడుకల్లో తెలంగాణ ప్రధాన కార్యక్రమాలు జరిగాయి.
కేసీఆర్ అనాలోచిత విధానంతో రాష్ట్రం అప్పుల ఉబిలోకి పోయిదంటూ.. సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. రూ.4వేల కోట్లతో నీళ్లు అందించే అవకాశం ఉండగా.. మిషన్ భగీరథతో రూ.40 వేల కోట్ల అప్పులు చేశారని దుయ్యబట్టారు.
Komatireddy Venkat Reddy: కేసీఆర్ సర్కార్ పై భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం కొన్ని మాసాలుగా భూములు తీసుకుంటున్నారని మండిపడ్డారు.
Kuchadi Srinivasrao: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ ఎస్ కు ఊహించని దెబ్బ తగిలింది. తెలంగాణ ఉద్యమకారుడు, సీఎం కేసీఆర్ సన్నిహితుడు కూచాడి శ్రీహరిరావు బీఆర్ ఎస్ కు గుడ్ బై చెప్పారు.
సిద్దిపేట జిల్లా కొహెడ మండలం పెద్ద సముద్రాల వద్ద సిద్దిపేట నుండి ఎల్కతుర్తి వరకు జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులను మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పరిశీలించారు.
తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ తర్వాత సీఎం ఎవరన్నదానిపై ప్రచారం సాగుతుంది. ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు మొగ్గు చూపుతుండటంతో.. అటు నేతలతో పాటు ఇటు ప్రజల్లో కూడా ఓ ప్రశ్నగా మారిపోయింది. ఇప్పుడు తాజాగా తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. తన మనసులోని మాటను వెల్లగక్కారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం అవుతారని తెలిపారు.
కేసీఆర్ అతని కుటుంబ సభ్యులు నలుగురికి ఉద్యోగాలు కల్పించి రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం మరిచారు అంటూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శలు గుప్పించాడు.
BJP Reverse Gear: బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది వేడుకలకు వ్యతిరేకంగా బీజేపీ అనేక కార్యక్రమాలు (కౌంటర్ ప్రోగ్రామ్లు) నిర్వహించేందుకు సిద్ధమైంది. 21 రోజుల పాటు వివిధ అధికారిక కార్యక్రమాలపై శాఖలు, శాఖల వారీగా ప్రతికూల ప్రచారం (నెగటివ్ క్యాంపెయిన్) నిర్వహించాలని, నిరసనలతో (రివర్స్ గేర్) కేసీఆర్ ప్రభుత్వ తీరును తిప్పికొట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా ప్రజలకు ఉపయోగపడే పార్టీలు కాదు.. భారత రాష్ట్ర సమితి మాత్రమే మన ఇంటి పార్టీ.. తెలంగాణ అభివృద్ధిని.. తెలంగాణ హక్కులను కాపాడే పార్టీ అంటూ తెలిపారు.