Pakistan Cricket: టీ20 వరల్డ్ కప్లో భారత్ ఘన విజయం సాధించింది. మూడో కప్పు కొట్టేసింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు ఆధిపత్యం చెలాయించింది. న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో ఓడించి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో అదరగొట్టాడు. ఇక బ్యాటింగ్లో సంజూ, ఇషాన్, అభిషేక్ దుమ్ముదులిపేశారు. ఈ విజయం టీమిండియా ప్లేయర్లు, అభిమానుల భావోద్వేగాలను రేకెత్తించింది. భారత్ విజయంపై ఊహించిన వ్యక్తులు శుభాకాంక్షలు తెలిపారు. ఆ వ్యక్తులు ఎవరోకాదు.. పాకిస్థాన్కు చెందిన మాజీ ప్లేయర్స్. టీమిండియాకు శుభాకాంక్షలు తెలియజేశారు. పాకిస్థాన్ మాజీ ప్లేయర్స్ మొహమ్మద్ హఫీజ్, సక్లైన్ ముష్తాక్, షాహిద్ అఫ్రిది, సనా మీర్, ఉమర్ గుల్, షోయబ్ అక్తర్ భారత్ను అభినందించారు. ఈ విజయం వారి దేశీయ నిర్మాణానికి మరియు దేశంలో ఉన్న క్రికెటర్ల రకానికి నిదర్శనమని అన్నారు. భారత్ మూడోసారి ప్రపంచ ఛాంపియన్గా నిలవడం వెనుక ఆ దేశంలోని పటిష్టమైన దేశవాళీ క్రికెట్ వ్యవస్థ ఉందనడంలో సందేహం లేదని కొనియాడారు. భారత్ నుంచి వస్తున్న అద్భుతమైన ప్లేయర్స్ క్రికెటర్లే ఈ ఘనతకు అసలు కారణమని విశ్లేషించారు. మరోవైపు.. మొదటి నుంచి భారత్పై విషం కక్కుతూ వచ్చిన పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ ఈ విజయంపై స్పందించాడు. ఇటీవల భారత్ ఫైనల్లో ఓడిపోతుందని తాను చెప్పిన జోస్యం తప్పని అంగీకరించాడు. ఫైనల్లో టీమ్ ఇండియా తన అద్భుత ప్రదర్శనతో తనను తప్పుగా నిరూపించిందని అమీర్ పేర్కొన్నాడు.