Kurkure Packet: కేవలం 20 రూపాయల కుర్కురే ప్యాకెట్ కోసం రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ దాడుల్లో 10 మందికి పైగా గాయపడగా, పలువురు పరారీలో ఉన్నారు.
కర్నాటకలోని ఉడిపిలో టైరు పగిలి మెకానిక్ గాల్లోకి ఎగిరిపడ్డ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన ఉన్న టైర్ షాప్ మెకానిక్ స్కూల్ బస్సు టైర్ని పంచర్ వేసి గాలి నింపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే టైరు పేలింది. దీంతో.. అక్కడే ఉన్న మెకానిక్ గాల్లో ఎగిరిపడ్డాడు. ఈ క్రమంలో మెకానిక్ అబ్దుల్ రజీద్ (19)కు గాయాలయ్యాయి.
భార్య మార్పిడి, గర్ల్ఫ్రెండ్స్ను ఇచ్చిపుచ్చుకోవడం వంటి డర్టీ గేమ్లు కర్ణాటకలో బట్టబయలయ్యాయి. హరీష్, హేమంత్ అనే ఇద్దరు వ్యక్తులను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అరెస్ట్ చేసింది. వీరిద్దరూ ప్రైవేట్ పార్టీ పేరుతో ఈ జుగుప్సాకరమైన గేమ్ను నడుపుతున్నారు. వీరు మహిళలను బలవంతంగా, బ్లాక్ మెయిల్ చేస్తూ దోపిడీ చేశారని తేలింది. ఓ మహిళ సీసీబీకి ఫిర్యాదు చేయడంతో ఈ రాకెట్ వెలుగులోకి వచ్చింది. బలవంతంగా శృంగారం చేసేలా ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపించారు. నిందితులు, వారికి…
Divorce Case: బిడ్డకు పేరు పెట్టే విషయంపై భార్యభర్తల మధ్య జరిగిన గొడవ చివరకు విడాకులు వరకు వెళ్లింది. తమ బిడ్డకు పేరు పెట్టడంలో ఏర్పడిన ప్రతిష్టంభనపై దంపతులు విడాకులు కోరిన ఘటన కర్ణాటకలో జరిగింది. 26 ఏళ్ల వ్యక్తి 2021లో జన్మించిన తన కుమారుడి పేరు పెట్టే కార్యక్రమానికి హాజరుకాకపోవడంతో వివాదం మొదలైంది.
చాలా మంది ప్రైవేట్ ఉద్యోగానికి బదులు ప్రభుత్వ ఉద్యోగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే కర్ణాటకలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల పనితీరు, ఉద్యోగులపై విపరీతమైన ఒత్తిళ్లపై ఓ తహసీల్దార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీశాయి. ప్రభుత్వ ఉద్యోగంలో మిగిలేది లేదని, పానీపూరీ అమ్మే వాడు మనకంటే గొప్పవాడని తహసీల్దార్ చెప్పారు. పానీ పూరీ అమ్మేవాడి సంపాదన కూడా తమ కంటే…
Robotic Elephant Donated by Shilpa Shetty and Raj Kundra couple: బాలీవుడ్ నటి శిల్పా షెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని రాంభాపురి మఠానికి ఒక రోబోటిక్ ఏనుగును దానం చేశారు. ఈ రోబోటిక్ ఏనుగు మఠంలోని భక్తులకు సేవలందించడానికి ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం స్థానికంగా పెద్ద ఎత్తున జరగడంతో దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోబోటిక్ ఏనుగు గుడి కార్యక్రమాలకు, పవిత్ర ప్రాంతాలకు…
Renukaswamy murder case: కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్, అతడి స్నేహితురాలు పవిత్ర గౌడలకు రేణుకాస్వామి హత్య కేసులో బెయిల్ మంజూరైంది. కర్ణాటక హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ ఎస్ విశ్వజిత్ శెట్టి బెయిల్ పిటిషన్లను విచారించారు. ఈ కేసులో మరో ఐదుగురు నిందితులు నాగరాజు, అనుకుమార్, లక్ష్మణ్, జగదీష్ అలియాస్ జగ్గా, ఆర్ ప్రదూష్ రావులకు బెయిల్ మంజూరు చేసింది.
కర్ణాటకలోని రామ్ నగర్లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నవజాత శిశువును విక్రయించిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. 40 ఏళ్ల మహిళ తన 30 రోజుల నవజాత శిశువును రూ. 1.5 లక్షలకు విక్రయించింది. తన కొడుకు కనిపించడం లేదని, భార్యపై అనుమానం ఉందని మహిళ భర్త ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భర్త అప్పు తీర్చేందుకే బిడ్డను భార్య అమ్మేసిందని చెబుతున్నారు.