Karnataka: పోక్సో కేసులో మాజీ సీఎం యడ్యూరప్ప బెయిల్ను పొడిగించిన కర్ణాటక హైకోర్ట్
- పోక్సో కేసులో మాజీ సీఎం యడ్యూరప్ప బెయిల్ను పొడిగించిన కర్ణాటక హైకోర్ట్..
- యడ్యూరప్పకు వ్యతిరేకంగా హైకోర్టులో ఆధారలు సమర్పించిన సీఐడీ తరపు లాయర్..
- ఈ కేసు విచారణను జనవరి 17కు వాయిదా వేసిన కర్ణాటక హైకోర్టు జస్టిస్ ఎం నాగప్రసన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప దాఖలు చేసిన పిటిషన్పై విచారణను కర్ణాటక హైకోర్టు ఈరోజు (జనవరి 15) వాయిదా వేసింది. జస్టిస్ ఎం నాగప్రసన్న ముందు సీఐడీ తరపున సీనియర్ న్యాయవాది రవివర్మ కుమార్ వాదనలు వినిపించడంతో పాటు సంఘటనకు సంబంధించిన వీడియో, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నివేదికతో సహా కీలకమైన సాక్ష్యాలను సమర్పించారు. ఇక, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నివేదిక ప్రకారం.. యడ్యూరప్ప వాయిస్ శాంపిల్ సాక్ష్యంలోని ఆడియోతో పాటు వీడియో సాక్ష్యాలను గుజరాత్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ డిపార్ట్మెంట్ ధృవీకరించింది.. అది తారుమారు చేయబడలేదని సీఐడీ తరపు లాయర్ తెలిపారు.
Read Also: China Manja: వాహనదారులకు శాపంగా మారుతున్న చైనా మాంజా..
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
ఇక, మరోవైపు, సెక్షన్ 161 కింద నమోదు చేయబడిన సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కేసును కొట్టివేయలాని సీనియర్ న్యాయవాది వాదించారు. ఇది పోలీసులు నేరం గురించి సమాచారాన్ని అందించగల వ్యక్తులను పరిశీలించడానికి అనుమతిస్తుంది అన్నారు. తన వాదనలకు మద్దతుగా సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరణగా తీసుకున్నారు. ఇక, కేసు ఆలస్యం కావడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ తన వాదనలను ముగించారు యడ్యూరప్ప తరపు న్యాయవాది. ఇక, ఇరువురు వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు తదుపరి విచారణను జనవరి 17వ తేదీకి వాయిదా వేసింది. యడ్యూరప్పకు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.
Read Also: Side Effects of Smoking: సిగరెట్లు ఎక్కువగా తాగుతున్నారా? దాని సైజ్ తగ్గుతుందట!
అయితే, 2024 ఫిబ్రవరిలో బెంగళూరు నివాసంలో యడ్యూరప్ప తన 17 ఏళ్ల కుమార్తెను వేధించాడని ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రిపై నమోదు అయింది. సదరు మహిళ గత ఏడాది మేలో ఊపిరితిత్తుల క్యాన్సర్తో చనిపోయింది. యడ్యూప్పపై లైంగిక వేధింపుల ఫిర్యాదు మార్చి 2024లో నమోదైంది. కాగా, పోలీసుల నిర్లక్ష్యంపై బాధితురాలి సోదరుడు జూన్లో యడ్యూరప్పను తక్షణమే అరెస్టు చేసి విచారించాలని డిమాండ్ చేస్తూ హైకోర్టులో తాజాగా పిటిషన్ను దాఖలు చేశారు.
తాజావార్తలు
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
-
Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!