Karnataka: పోక్సో కేసులో మాజీ సీఎం యడ్యూరప్ప బెయిల్ను పొడిగించిన కర్ణాటక హైకోర్ట్
- పోక్సో కేసులో మాజీ సీఎం యడ్యూరప్ప బెయిల్ను పొడిగించిన కర్ణాటక హైకోర్ట్..
- యడ్యూరప్పకు వ్యతిరేకంగా హైకోర్టులో ఆధారలు సమర్పించిన సీఐడీ తరపు లాయర్..
- ఈ కేసు విచారణను జనవరి 17కు వాయిదా వేసిన కర్ణాటక హైకోర్టు జస్టిస్ ఎం నాగప్రసన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప దాఖలు చేసిన పిటిషన్పై విచారణను కర్ణాటక హైకోర్టు ఈరోజు (జనవరి 15) వాయిదా వేసింది. జస్టిస్ ఎం నాగప్రసన్న ముందు సీఐడీ తరపున సీనియర్ న్యాయవాది రవివర్మ కుమార్ వాదనలు వినిపించడంతో పాటు సంఘటనకు సంబంధించిన వీడియో, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నివేదికతో సహా కీలకమైన సాక్ష్యాలను సమర్పించారు. ఇక, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నివేదిక ప్రకారం.. యడ్యూరప్ప వాయిస్ శాంపిల్ సాక్ష్యంలోని ఆడియోతో పాటు వీడియో సాక్ష్యాలను గుజరాత్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ డిపార్ట్మెంట్ ధృవీకరించింది.. అది తారుమారు చేయబడలేదని సీఐడీ తరపు లాయర్ తెలిపారు.
Read Also: China Manja: వాహనదారులకు శాపంగా మారుతున్న చైనా మాంజా..
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ఇక, మరోవైపు, సెక్షన్ 161 కింద నమోదు చేయబడిన సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కేసును కొట్టివేయలాని సీనియర్ న్యాయవాది వాదించారు. ఇది పోలీసులు నేరం గురించి సమాచారాన్ని అందించగల వ్యక్తులను పరిశీలించడానికి అనుమతిస్తుంది అన్నారు. తన వాదనలకు మద్దతుగా సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరణగా తీసుకున్నారు. ఇక, కేసు ఆలస్యం కావడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ తన వాదనలను ముగించారు యడ్యూరప్ప తరపు న్యాయవాది. ఇక, ఇరువురు వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు తదుపరి విచారణను జనవరి 17వ తేదీకి వాయిదా వేసింది. యడ్యూరప్పకు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.
Read Also: Side Effects of Smoking: సిగరెట్లు ఎక్కువగా తాగుతున్నారా? దాని సైజ్ తగ్గుతుందట!
అయితే, 2024 ఫిబ్రవరిలో బెంగళూరు నివాసంలో యడ్యూరప్ప తన 17 ఏళ్ల కుమార్తెను వేధించాడని ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రిపై నమోదు అయింది. సదరు మహిళ గత ఏడాది మేలో ఊపిరితిత్తుల క్యాన్సర్తో చనిపోయింది. యడ్యూప్పపై లైంగిక వేధింపుల ఫిర్యాదు మార్చి 2024లో నమోదైంది. కాగా, పోలీసుల నిర్లక్ష్యంపై బాధితురాలి సోదరుడు జూన్లో యడ్యూరప్పను తక్షణమే అరెస్టు చేసి విచారించాలని డిమాండ్ చేస్తూ హైకోర్టులో తాజాగా పిటిషన్ను దాఖలు చేశారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!