కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా నడుస్తోంది. తాజాగా విజయపుర జిల్లాలోని ఇండి ప్రభుత్వ పీయూసీ కాలేజీకి తిలకం (సింధూరం) పెట్టుకుని వచ్చిన హిందూ విద్యార్థిని లెక్చరర్లు అడ్డుకున్నారు. తిలకం తీసేసి లోపలికి రావాలని ఆదేశించారు. దీనికి విద్యార్థి తిరస్కరించాడు. అయితే తిలకం ఉంటే కాలేజీ లోపలకు వచ్చేందుకు వీల్లేదని, ఇంటికి వెళ్లిపోవాలని లెక్చరర్లు స్పష్టం చేశారు. దీంతో భజరంగ్ దళ్, శ్రీరామ్ సేన కార్యకర్తలు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. సింధూరం అనేది మతానికి సంబంధించినది కాదని,…
ప్రస్తుతం కర్ణాటకను ఊపేస్తున్న వివాదం .. హిజాబ్. ముస్లిం మహిళలు హిజాబ్(తలపై వస్త్రం) లేకుండా స్కూల్స్ కి, కాలేజీలకు రావాలని అక్కడివారు పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదంపై హైకోర్ట్ లో విచారణ జరుగుతుంది. ఈ వివాదంపై పలువురు ప్రముఖులు తమధైన రీతిలో స్పందిస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ వివాదస్పద నటి స్వర భాస్కర్ హిజాబ్ వివాదంపై స్పందించి మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. హిజాబ్ వివాదం వింటుంటే .. మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణం గుర్తొస్తుందంటూ…
హిజాబ్ వివాదంపై విచారణను రేపటికి వాయిదా వేసింది కర్ణాటక హైకోర్టు. హిజాబ్ కాంట్రావర్సీపై కోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. హిజాబ్ ను అనుమతించాలా లేదా అనేది తేల్చే అంశాన్ని కాలేజీ కమిటీలకు వదిలేయడం ఇల్లీగల్ అన్నారు పిటిషనర్ల తరపు అడ్వోకేట్ దేవదత్ కామత్. కేంద్రీయ విద్యాలయాల్లో కూడా ముస్లిం విద్యార్థినులు తలకు స్కార్ఫ్ కట్టుకునేందుకు అనుమతిస్తోన్న విషయం కోర్టుకు తెలిపారు. కర్ణాటకలో ముస్లిం అమ్మాయిలు కొత్తగా యూనీఫామ్ కావాలని డిమాండ్ చెయ్యడం లేదని, ప్రభుత్వం ఆదేశాల మేరకు…
కర్ణాటకలో హిజాబ్ వ్యవహారం చల్లారడం లేదు. ఈ విషయంలో కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈరోజు నుంచి కర్ణాటకలో తిరిగి స్కూళ్లు ప్రారంభం అయ్యాయి. అయితే, కర్ణాటకలోని శివమొగ్గ ఊహించని ఓ ఘటన చోటుచేసుకుంది. శివమొగ్గ ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్న కొందరు ముస్లీం యువతులను ప్రభుత్వ ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. హాజాబ్ను తీసివేసి స్కూల్ లోపలికి వెళ్లానని కోరారు. ఉపాధ్యాయుల విన్నపాన్ని యువతులు అంగీకరించలేదు. ఒప్పించే ప్రయత్నం చేశారు.…
అతనికి చిన్నతనం నుంచి రైతు కావాలని కల. రైతుగా మారడానికి చిన్నతనం నుంచి చాలా కష్టపడ్డాడు. కష్టపడి పనిచేశాడు మహాలింగ నాయక్. ఎంత కష్టపడినా ఉండేందుకు చిన్న గుడిసెను కూడా ఏర్పాటు చేసుకోలేకపోయాడు. రైతుగా మారాలంటే పొలం కావాలి. పోలం లేకుండా వ్యవసాయం చేయడం చాలా కష్టం. అయితే, తాను పనిచేసే యజమాని వద్ద చాలా కాలం మహాలింగ నాయక్ నమ్మకంగా పనిచేశాడు. నాయక్ పని నచ్చడంతో అతనికి యజమాని మంగుళూరుకు 55 కిలోమీటర్ల దూరంలోని అద్యనాదక్…
తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా వుంటున్నాయి. బీజేపీ నేతలపై టీఆర్ ఎస్ నేతలు మండిపడుతూనే వున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కీలక వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎంఐఎం పార్టీ తో టీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం అని బీజేపీ విమర్శిస్తోంది. మరి ఎంఐఎం అధినేత ఓవైసీ పై కాల్పులు జరిగిన తీరును చూస్తే ఎవరు ఎవరితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారో అర్థమవుతుందన్నారు లక్ష్మారెడ్డి. కర్ణాటకలో జరుగుతున్న హిజ బ్ గొడవ.. ఎక్కడ తెలంగాణ వరకు వ్యాపిస్తుందో…
కర్ణాటకలో హిజాబ్ వ్యవహారంపై చిచ్చు రేపుతోంది.. రాష్ట్రంలోని కొన్ని కళాశాలల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై నిషేధం విధించడం రచ్చగా మారింది.. ఈ నేపథ్యంలో బెంగళూరులోని విద్యా సంస్థల దగ్గర సమావేశాలు, నిరసనలపై రెండు వారాల పాటు నిషేధం విధించారు.. హిజాబ్ వ్యవహారంలో వరుస నిరసనల నేపథ్యంలో.. తరగతి గదుల్లో హిజాబ్ ధరించే హక్కుపై మితవాద గ్రూపులు ముస్లిం బాలికలను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించడంతో కర్ణాటకలో నిరసనలు తీవ్రమయ్యాయి.. ఇది కాస్తా ఇతర కళాశాలలకు వ్యాపించాయి… కర్నాటకలోని…
కర్ణాటకలో హిజాబ్ వివాదంపై ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్హాసన్ స్పందించారు. కర్ణాటకలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు అలజడి రేపేలా ఉన్నాయని కమల్ ట్వీట్ చేశారు. అమాయక విద్యార్థుల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో జరుగుతున్న ఇటువంటి పరిణామాలు తమిళనాడు వరకు పాకకుండా చూసుకోవాలని… తమిళనాడులో ప్రగతిని కోరుకునే వారు ఇటువంటి సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కమల్ హాసన్ తన…
కర్ణాటకలో హిజాబ్ అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పలు ప్రాంతాల్లో ముస్లిం విద్యార్థినులు తల, మెడను కప్పి వుంచే స్కార్ఫ్ ధరించి క్లాసులకు హాజరవుతున్నారు. దీనినే హిజాబ్ అంటారు. అయితే హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థులను కాలేజీల్లోకి అనుమతించడం లేదు. దీనిని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. కాలేజీలో చేరినప్పుడే తమకు ఈ విషయాలు చెప్పి ఉండాల్సిందని.. కానీ చెప్పకుండా ఇప్పుడు అనుమతించకపోవడం సరికాదని విద్యార్థులు మండిపడుతున్నారు. నిరసనలు వ్యక్తం చేసినా ప్రయోజనం లేకపోవడంతో క్లాసులకు హాజరుకాకుండా నిరాశగా వెనుతిరుగుతున్నారు.…
రాజకీయాలు అన్నాకా వివాదాలు రాకుండా ఉండవు. ఎవరో ఒకరు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు. తాజాగా కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే రాజకుమార్ పాటిల్ తెల్కూర్ కూడా వివాదంలో చిక్కుకున్నారు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆ బీజేపీ ఎమ్మెల్యేనే అంటూ ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం కర్ణాటకలో సంచలనంగా మారింది. అయితే రాజకుమార్ పాటిల్ తెల్కూర్ మాత్రం ఇందులో ఏ నిజం లేదని ఆమె నా మీద ఘాటు ఆరోపణలు చేస్తుందని తెలుపుతున్నారు.…