Hijab Issue: వాడివేడిగా వాదనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిజాబ్ వివాదంపై విచారణను రేపటికి వాయిదా వేసింది కర్ణాటక హైకోర్టు. హిజాబ్ కాంట్రావర్సీపై కోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. హిజాబ్ ను అనుమతించాలా లేదా అనేది తేల్చే అంశాన్ని కాలేజీ కమిటీలకు వదిలేయడం ఇల్లీగల్ అన్నారు పిటిషనర్ల తరపు అడ్వోకేట్ దేవదత్ కామత్. కేంద్రీయ విద్యాలయాల్లో కూడా ముస్లిం విద్యార్థినులు తలకు స్కార్ఫ్ కట్టుకునేందుకు అనుమతిస్తోన్న విషయం కోర్టుకు తెలిపారు. కర్ణాటకలో ముస్లిం అమ్మాయిలు కొత్తగా యూనీఫామ్ కావాలని డిమాండ్ చెయ్యడం లేదని, ప్రభుత్వం ఆదేశాల మేరకు వేసుకుంటున్న యూనీఫామ్ రంగులోనే హిజాబ్ లు ధరిస్తామని మనవి చేస్తున్నారని ముస్లిం అమ్మాయిల తరుపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. హిజాబ్ ను నిషేధించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 25కు విరుద్దమన్నారు. అది న్యాయ సమీక్షకు నిలబడదని చెప్పారు. హిజాబ్ ధరించి ముస్లిం అమ్మాయిలు స్కూళ్లకు హాజరయ్యేలా అనుమతించాలని కోర్టును కోరారు.
Read Also: Movie Tickets: ఇంత అవమానమా..? చిరంజీవి చేతులు జోడించి వేడుకోవాలా..?
Also Read
- NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
అయితే, హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరా… కాదా అన్నది తేల్చాలని అభిప్రాయపడింది ప్రభుత్వం. ఖురాన్ లో చెప్పిన మతపరమైన అంశాలన్నీ పాటించాలా అని దేవదత్ కామత్ ను ప్రశ్నించింది హైకోర్టు. అయితే, అన్నీ పాటిస్తున్నారా, లేదా అనే విషయం కచ్చితంగా చెప్పలేమన్నారు పిటిషనర్ల తరపు న్యాయవాది. ఇస్లామిక్ విశ్వాసాల ప్రకారం ముఖానికి స్కార్ఫ్ ధరించడం తప్పనిసరి అని కామత్ చెప్పారు. రెండు పక్షాల వాదనలు విన్న హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. హిజాబ్ లు వేసుకుని కాలేజ్ కు వెళ్లడానికి అవకాశం ఇవ్వాలని కొందరు ముస్లీం అమ్మాయిలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ విచారణ చేసిన కర్ణాటక హైకోర్టు హిజాబ్ లు, కాషాయం కండువాలు వేసుకుని ఎవ్వరూ కూడా విద్యాసంస్థల్లో అడుగు పెట్టకూడదని ఇటీవల మద్యంతర ఉత్తర్వులు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, విద్యా సంస్థల్లో ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించే విషయంలో కర్ణాటకలో వివాదం కంటిన్యూ అవుతోంది. ఇవాళ్టి నుంచే కర్ణాటకలో స్కూళ్లు ప్రారంభమయ్యాయి. తాము ఈ అంశాన్ని తేల్చేవరకు మతపరమైన వస్త్రాలు ధరించకుండా స్కూళ్లకు వెళ్లాలని గత వారం విద్యార్థులకు సూచించింది హైకోర్టు. అయితే ఇవాల స్కూళ్లు మొదలు కాగా… వివాదానికి కేంద్రంగా ఉన్న ఉడుపి జిల్లాలో ఎవరూ కూడా హిజాబ్ ధరించి స్కూళ్లకు రాలేదు. ఉడుపి జిల్లాలో 144 సెక్షన్ విధించారు. కానీ మాండ్యలో ఓ స్కూల్ దగ్గర టీచర్లు, పేరెంట్స్ కు ఆర్గ్యుమెంట్ జరిగింది. బురఖా వేసుకుని వచ్చిన స్టూడెంట్స్ ను స్కూళ్లోకి అనుమతించలేదు టీచర్లు.
తాజావార్తలు
-
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి?.. ఇరాక్ సాయుధ గ్రూప్ సంచలన ప్రకటన
-
Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
-
Jana Nayagan Release : జననాయగన్ దెబ్బకు బిచాణా ఎత్తేస్తోన్న సినిమాలు
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు రంగం సిద్ధం..? చివరి వన్డే ఇదేనా..!
-
NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!