Hijab Issue: వాడివేడిగా వాదనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిజాబ్ వివాదంపై విచారణను రేపటికి వాయిదా వేసింది కర్ణాటక హైకోర్టు. హిజాబ్ కాంట్రావర్సీపై కోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. హిజాబ్ ను అనుమతించాలా లేదా అనేది తేల్చే అంశాన్ని కాలేజీ కమిటీలకు వదిలేయడం ఇల్లీగల్ అన్నారు పిటిషనర్ల తరపు అడ్వోకేట్ దేవదత్ కామత్. కేంద్రీయ విద్యాలయాల్లో కూడా ముస్లిం విద్యార్థినులు తలకు స్కార్ఫ్ కట్టుకునేందుకు అనుమతిస్తోన్న విషయం కోర్టుకు తెలిపారు. కర్ణాటకలో ముస్లిం అమ్మాయిలు కొత్తగా యూనీఫామ్ కావాలని డిమాండ్ చెయ్యడం లేదని, ప్రభుత్వం ఆదేశాల మేరకు వేసుకుంటున్న యూనీఫామ్ రంగులోనే హిజాబ్ లు ధరిస్తామని మనవి చేస్తున్నారని ముస్లిం అమ్మాయిల తరుపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. హిజాబ్ ను నిషేధించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 25కు విరుద్దమన్నారు. అది న్యాయ సమీక్షకు నిలబడదని చెప్పారు. హిజాబ్ ధరించి ముస్లిం అమ్మాయిలు స్కూళ్లకు హాజరయ్యేలా అనుమతించాలని కోర్టును కోరారు.
Read Also: Movie Tickets: ఇంత అవమానమా..? చిరంజీవి చేతులు జోడించి వేడుకోవాలా..?
Also Read
- NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
- Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
- FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
అయితే, హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరా… కాదా అన్నది తేల్చాలని అభిప్రాయపడింది ప్రభుత్వం. ఖురాన్ లో చెప్పిన మతపరమైన అంశాలన్నీ పాటించాలా అని దేవదత్ కామత్ ను ప్రశ్నించింది హైకోర్టు. అయితే, అన్నీ పాటిస్తున్నారా, లేదా అనే విషయం కచ్చితంగా చెప్పలేమన్నారు పిటిషనర్ల తరపు న్యాయవాది. ఇస్లామిక్ విశ్వాసాల ప్రకారం ముఖానికి స్కార్ఫ్ ధరించడం తప్పనిసరి అని కామత్ చెప్పారు. రెండు పక్షాల వాదనలు విన్న హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. హిజాబ్ లు వేసుకుని కాలేజ్ కు వెళ్లడానికి అవకాశం ఇవ్వాలని కొందరు ముస్లీం అమ్మాయిలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ విచారణ చేసిన కర్ణాటక హైకోర్టు హిజాబ్ లు, కాషాయం కండువాలు వేసుకుని ఎవ్వరూ కూడా విద్యాసంస్థల్లో అడుగు పెట్టకూడదని ఇటీవల మద్యంతర ఉత్తర్వులు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, విద్యా సంస్థల్లో ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించే విషయంలో కర్ణాటకలో వివాదం కంటిన్యూ అవుతోంది. ఇవాళ్టి నుంచే కర్ణాటకలో స్కూళ్లు ప్రారంభమయ్యాయి. తాము ఈ అంశాన్ని తేల్చేవరకు మతపరమైన వస్త్రాలు ధరించకుండా స్కూళ్లకు వెళ్లాలని గత వారం విద్యార్థులకు సూచించింది హైకోర్టు. అయితే ఇవాల స్కూళ్లు మొదలు కాగా… వివాదానికి కేంద్రంగా ఉన్న ఉడుపి జిల్లాలో ఎవరూ కూడా హిజాబ్ ధరించి స్కూళ్లకు రాలేదు. ఉడుపి జిల్లాలో 144 సెక్షన్ విధించారు. కానీ మాండ్యలో ఓ స్కూల్ దగ్గర టీచర్లు, పేరెంట్స్ కు ఆర్గ్యుమెంట్ జరిగింది. బురఖా వేసుకుని వచ్చిన స్టూడెంట్స్ ను స్కూళ్లోకి అనుమతించలేదు టీచర్లు.
తాజావార్తలు
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!