ఛీఛీ వీళ్లు కొడుకులా.. కసాయిలా.. దానికోసం కన్నతండ్రిని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబ్బు.. ప్రపంచాన్ని నడిపిస్తోంది.. కాదు కాదు శాసిస్తోంది. రక్త సంబంధాలు, మానవత్వం మరిచి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. ఆస్తికోసం కన్నబిడ్డలు కన్న తల్లిదండ్రులను హతమారుస్తున్నారు. తాజాగా ఇద్దరు కొడుకులు.. ఆస్తి గొడవల్లో కన్నతండ్రిని అతి దారుణంగా పొడిచి చంపారు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. మండ్య జిల్లాలోని శ్రీరంగ పట్టణం తాలూకాలోని కరెమేగళకొప్పలు గ్రామంలో మరికాళయ్య కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. అతడికి ఇద్దరు కొడుకులు శశికుమార్, రాజేష్. ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు చేసి ఒక దారి చేసిన మరికాళయ్య ఇటీవల డబ్బు అవసరమై తనకున్న భూమిలో ఎకరా భూమిని రూ.30 లక్షలకు అమ్మాడు. ఆ అమ్మిన సొమ్మును కొడుకులిద్దరికి సమానంగా పంచుతానని తెలిపాడు. అయితే ఆస్తిపై కన్నేసిన కొడుకులు తండ్రికి తెలియకుండా భూమి కొన్నవారి వద్దకు వెళ్లి రూ.30 లక్షలు తమకే వచ్చే విధంగా మాట్లాడుకున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న తండ్రి మరికాళయ్య రిజిస్ట్రేషన్ రోజున సంతకం పెట్టలేదు. దీంతో కోపంతో రగిలిపోయిన ఆ కొడుకులు తండ్రిపై గొడవకు దిగారు. ఆ గొడవలో కొడుకులు కసాయిల్లా మారి కన్నతండ్రిని కత్తితో పొడిచిపొడిచి హతమార్చారు. ఈఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న కొడుకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read
తాజావార్తలు
-
Tamil Nadu: ఈ రాత్రికి కేరళం వెళ్లిపోనున్న గవర్నర్.. విజయ్ ప్రమాణస్వీకారంపై సర్వత్రా ఉత్కంఠ!
-
Sheikh Hasina: బెంగాల్ సీఎం సువేందుపై షేక్ హసీనా ప్రశంసలు..
-
Soft Mysore Pak Recipe : ఇంట్లోనే హోటల్ స్టైల్ సాఫ్ట్ మైసూర్ పాక్.. పక్కా కొలతలతో ఇలా చేసుకోండి.!
-
Crispy Ragi Vada: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! రాగి పిండితో సింపుల్గా కరకరలాడే వడలు
-
Tamil Nadu: హమ్మయ్య.. ఉత్కంఠకు తెర.. విజయ్కు వీసీకే మద్దతు