Karnataka: శివమొగ్గలో టెన్షన్ టెన్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో కొత్త వివాదం మొదలైంది.. మొన్నటివరకూ హిజాబ్ వ్యవహారం హీట్ పుట్టించగా…. ఇప్పుడు బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కలకలం రేపుతోంది.. దీంతో శివమొగ్గ ఉద్రిక్తంగా మారింది. ఈ హత్య రాజకీయంగాను పెను సంచలనం సృష్టించింది. హత్యవెనక శివకుమార్ ఉన్నారని మంత్రి ఈశ్వరప్ప ఆరోపించగా.. దీని వెనక ఉన్నవారిని ఉరితీయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ముఖ్యంగా హత్య జరిగిన శివమొగ్గ పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. పరిస్థితి చేజారకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఇవాళ స్కూల్స్, కాలేజీలకు బంద్ ప్రకటించారు. మరోవైపు.. భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
Read Also: Train Tickets: ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఎన్నో ప్రయోజనాలు..
Also Read
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్గా మారిన స్వీట్!
- Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్గా మారిన ఘటన
శివమొగ్గ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై. హర్ష హత్యకు సంబంధించి కొన్ని ఆధారాలు లభించాయని స్పష్టం చేశారు. హంతకులకు చట్టపరంగా శిక్ష తప్పదన్నారు.మరోవైపు కర్ణాటక మంత్రి నారాయణ గౌడ.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. భజరంగ్ దళ్ కార్యకర్త హత్యను… రాజకీయం చేయడం మంచిది కాదన్నారు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్. నిందితులను గుర్తించి… కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మంత్రి ఈశ్వరప్పకు పిచ్చి పట్టిందని… అందుకే పిచ్చివాగుడు వాగుతున్నారని మండిపడ్డారు. భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య దారుణమన్నారు మాజీ సీఎం కుమారస్వామి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కావాల్సింది ఇలాంటి ఘటనలేనని…వారిప్పుడు ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. ఈ కేసును ఎన్ఐఏతో విచారణ చేయించాలని కేంద్రమంత్రి శోభా.. సీఎం బొమ్మైకు లేఖ రాశారు. మరోవైపు.. తమ కుటుంబసభ్యుడు హర్షను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం కోరుతోంది. ఇక, నిషేధాజ్ఞలు అమలులో ఉన్నప్పటికీ, కాషాయ కండువాలు ధరించిన వ్యక్తుల గుంపు రాళ్లు రువ్వడం మరియు పోలీసు వాహనానికి నిప్పంటించడంతో శివమొగ్గ హింసాత్మకంగా మారింది. మరోవైపు, ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.. వారి ఇంటరాగేషన్ జరుగుతోంది కాబట్టి వారి నేపథ్యంపై ఇప్పుడే వ్యాఖ్యానించలేనన్నారు మంత్రి జ్ఞానేంద్ర.. వారి పాత్రను నిర్ధారించడానికి దర్యాప్తు కొనసాగుతుందన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్హౌస్లో ట్రంప్తో జిన్పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!