Karnataka: శివమొగ్గలో టెన్షన్ టెన్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో కొత్త వివాదం మొదలైంది.. మొన్నటివరకూ హిజాబ్ వ్యవహారం హీట్ పుట్టించగా…. ఇప్పుడు బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కలకలం రేపుతోంది.. దీంతో శివమొగ్గ ఉద్రిక్తంగా మారింది. ఈ హత్య రాజకీయంగాను పెను సంచలనం సృష్టించింది. హత్యవెనక శివకుమార్ ఉన్నారని మంత్రి ఈశ్వరప్ప ఆరోపించగా.. దీని వెనక ఉన్నవారిని ఉరితీయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ముఖ్యంగా హత్య జరిగిన శివమొగ్గ పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. పరిస్థితి చేజారకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఇవాళ స్కూల్స్, కాలేజీలకు బంద్ ప్రకటించారు. మరోవైపు.. భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
Read Also: Train Tickets: ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఎన్నో ప్రయోజనాలు..
Also Read
- Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
- PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?
- CM Vijay Simplicity: దటీజ్ దళపతి.. సీఎం హోదాలో ఉన్నా.. టేబుల్ మోసి సింప్లిసిటీ చాటుకున్న విజయ్!
- PM Modi: కాంగ్రెస్కు కొత్త పేరు పెట్టిన మోడీ.. ‘MMC’ అంటే ముస్లిం లీగ్, మావోవాది కాంగ్రెస్!
శివమొగ్గ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై. హర్ష హత్యకు సంబంధించి కొన్ని ఆధారాలు లభించాయని స్పష్టం చేశారు. హంతకులకు చట్టపరంగా శిక్ష తప్పదన్నారు.మరోవైపు కర్ణాటక మంత్రి నారాయణ గౌడ.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. భజరంగ్ దళ్ కార్యకర్త హత్యను… రాజకీయం చేయడం మంచిది కాదన్నారు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్. నిందితులను గుర్తించి… కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మంత్రి ఈశ్వరప్పకు పిచ్చి పట్టిందని… అందుకే పిచ్చివాగుడు వాగుతున్నారని మండిపడ్డారు. భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య దారుణమన్నారు మాజీ సీఎం కుమారస్వామి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కావాల్సింది ఇలాంటి ఘటనలేనని…వారిప్పుడు ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. ఈ కేసును ఎన్ఐఏతో విచారణ చేయించాలని కేంద్రమంత్రి శోభా.. సీఎం బొమ్మైకు లేఖ రాశారు. మరోవైపు.. తమ కుటుంబసభ్యుడు హర్షను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం కోరుతోంది. ఇక, నిషేధాజ్ఞలు అమలులో ఉన్నప్పటికీ, కాషాయ కండువాలు ధరించిన వ్యక్తుల గుంపు రాళ్లు రువ్వడం మరియు పోలీసు వాహనానికి నిప్పంటించడంతో శివమొగ్గ హింసాత్మకంగా మారింది. మరోవైపు, ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.. వారి ఇంటరాగేషన్ జరుగుతోంది కాబట్టి వారి నేపథ్యంపై ఇప్పుడే వ్యాఖ్యానించలేనన్నారు మంత్రి జ్ఞానేంద్ర.. వారి పాత్రను నిర్ధారించడానికి దర్యాప్తు కొనసాగుతుందన్నారు.
తాజావార్తలు
-
Kiara Advani: ఆడిషన్స్ కోసం క్యూ కట్టిన..స్టార్డమ్ ఉరికే రాలేదు
-
Mutta Kalakki : తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా జివి ప్రకాష్.. రికార్డ్స్ బద్దలు కొట్టిన ‘ముట్ట కలక్కి’
-
Virat Kohli Duck: మరోసారి విరాట్ కోహ్లీ డకౌట్.. కింగ్ను సున్నాకే పెవిలియన్కు పంపిన బౌలర్లు వీరే!
-
Lenin : అఖిల్ ‘లెనిన్’ మూవీలో స్పెషల్ రోల్ ?
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?