Hijab: హైకోర్టులో ఆసక్తికర వాదనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.. ఇక, ఈ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు కొందరు విద్యార్థులు.. ఆ కేసులో విచారణ కొనసాగుతుండగా.. ఇవాళ ఆసక్తికరమైన వాదనలు జరిగాయి.. కర్ణాటక సర్కార్ తరఫున అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవాద్గీ హైకోర్టులో వినిపించిన వాదనలకు ప్రాధాన్యత ఏర్పిడింది.. హిజాబ్ ఇస్లాం మతానికి అవసరమైన మతపరమైన ఆచారం కాదన్న ఆయన.. హిజాబ్ ధరించడాన్ని నిరోధించడం మత స్వేచ్ఛను అడ్డుకున్నట్టు కాదన్నారు. మత స్వేచ్ఛకు హామీనిచ్చే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-25ను ఉల్లంఘించినట్టుకాదని ఈ సందర్భంగా హైకోర్టులో వాదనలు వినిపించారు.. హిజాబ్ లేదా కాషాయ కండువాలు ధరించకుండా నిషేధిస్తూ ఈ నెల 5వ తేదీన కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొంతమంది ముస్లిం బాలికలు కోర్టులో సవాల్ చేయడాన్ని, వారు చేసిన ఆరోపణలను తిరస్కరించారు ఏజీ..
Read Also: Telangana: రిజిస్ట్రేషన్ల శాఖ కాసుల వర్షం.. రూ.10 వేల కోట్ల మార్క్ దాటేసి..
Also Read
- Delhi: ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి చర్చలు..
- Supreme Court: భర్తల పొట్టకొట్టొద్దు.. భార్యల తీరుపై సుప్రీంకోర్టు కామెంట్స్..
- Delhi: ఢిల్లీలో హై టెన్షన్.. మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ భారీ నిరసన.. సంకెళ్లతో ఆందోళన
- CJP Protest: యువతి పరిస్థితి విషమం.. ప్రముఖుల పరామర్శ.. వైద్యులు ఏం చెప్పారంటే..!
కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితూ రాజ్ అవస్థి, జస్టిస్ జేఎం ఖాజీ మరియు జస్టిస్ కృష్ణ ఎం దీక్షిత్ ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు ఏజీ.. సమానత్వం, సమగ్రత, ప్రజల స్వేచ్ఛకు కలిగించేలా ఈ నిర్ణయం తీసుకున్నారనడం సరికాదని.. ఇది చట్టవిరుద్ధం ఏమీ కాదన్నారు.. ప్రభుత్వ ఉత్తర్వులో హిజాబ్ సమస్య లేదు.. ప్రభుత్వ ఉత్తర్వులు హానికరం కాదు.. ఇది పిటిషనర్ల హక్కులను ప్రభావితం చేయదని పేర్కొన్నారు.. అయితే, తరగతి గదిలో హిజాబ్ను అనుమతించాలా వద్దా అని కళాశాలలు నిర్ణయించుకోవచ్చు అని తెలిపారు.. కాగా, డిసెంబర్ చివరి నుండి రాష్ట్రంలో క్లాస్రూమ్లలో హిజాబ్ను నిషేధిస్తూ వచ్చిన ఉత్తర్వులతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.. ఇతర ప్రాంతాలకు కూడా ఈ వ్యవహారం పాకింది.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను కర్ణాటక హైకోర్టు ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది..
తాజావార్తలు
-
Ramayana : బడ్జెట్ 4000 కోట్లు.. బిజినెస్ 250 కోట్లా?
-
Telangana Eco Tourism : తెలంగాణ ఎకో టూరిజం బూస్ట్.. కొత్త మాస్టర్ ప్లాన్.!
-
Delhi: ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి చర్చలు..
-
ROKO Jodi: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త.. ఒక్క నెలలో మళ్లీ బరిలోకి..
-
Supreme Court: భర్తల పొట్టకొట్టొద్దు.. భార్యల తీరుపై సుప్రీంకోర్టు కామెంట్స్..
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!