Karnataka: బైక్ పై ముగ్గురు మగవాళ్లు ప్రయాణించడం నిషేధం.. ఎందుకంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Triple riding ban on bike in Mangaluru: కర్ణాటకలోని మంగళూర్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బైక్ పై ముగ్గురు పురుషులు ప్రయాణించడాన్ని నిషేధించారు. ఆగస్టు 8 వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమలు కానున్నాయి. అయితే 18 ఏళ్లలోపు వారికి, వృద్ధులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అయితే ఇటీవల కాలంలో కర్ణాటకలో మతపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. మంగళూర్ కమిషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ విధిస్తున్నట్లు కమిషనర ఎన్ శశికుమార్ వెల్లడించారు. ప్రజాకార్యకలాపాలు, వ్యాపారాలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే అనుమతించబడతాయని ఆయన వెల్లడించారు.
ఇటీవల కాలంలో మంగళూర్ ప్రాంతంలో వరసగా మూడు హత్యలు జరగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇటీవల బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్ నెట్టార్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ హత్య అనంతరం మంగళూర్ ప్రాంతంలో మహ్మద్ ఫాజిల్ అనే యువకుడిని దుండగులు దారుణంగా హత్య చేశారు. అంతకుముందు కూడా హర్ష అనే భజరంగ్ దళ్ కార్యకర్తను కొంతమంది దుండగులు హత్య చేశారు. ఇలా వరసగా హత్యలు అవుతుండటంతో మతఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. దీంతో పోలీసులు సాయంత్రం నుంచి ఉదయం వరకు బైక్ పైన ముగ్గురు ప్రయాణించడాన్ని నిషేధించింది.
Also Read
- Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
- Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
- TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
- Special Trains: సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
Read Also: Kerala: కేరళలో భారీ వర్షాలు.. 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్.
దీంట్లో భాగంగానే.. బహిరంగ ప్రదేశాల్లో నినాదాలు చేయడం, ఐదుగురి కన్నా ఎక్కువ మంది గుమికూడరాదని స్పష్టం చేసింది. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, ఆందోళనలకు దిగడం, ఫోటోలు-పోస్టర్లను ప్రదర్శించడాన్ని నిషేధించారు. ఆయుధాలు పట్టుకుని తిరగడం, టపాసులు కాల్చడం, దిష్టిబొమ్మల దహనాలను నిషేధించారు పోలీసులు. ఆగస్టు 8 వరకు ప్రైవేటు ఫంక్షన్లు, వేడుకలు, ర్యాలీలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. ఇటీవల ప్రవీణ్ నెట్టారు హత్య తరువాత రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలు, బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రవీణ్ నెట్టారు తల్లిదండ్రులను పరామర్శించేందుకు స్వయంగా వెళ్లారు.
తాజావార్తలు
-
Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
-
Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
-
Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Vaibhav Sooryavanshi: ఏం మానియా క్రియేట్ చేశావ్ బుడ్డోడా.. నీ ఆట కోసం ప్రపంచ ప్రసార మాధ్యమాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావ్గా..
-
Green Chillies Storage Tips: పచ్చిమిరపకాయలు త్వరగా పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్తో నెలల తరబడి తాజాగా..!
ట్రెండింగ్
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!