Karnataka Eidgah Case: ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka HC allows Ganesh festivities at Hubballi edgah: వినాయక చవితి ముందు కర్ణాటక హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. హుబ్బళ్లి ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకలు జరుపుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అర్థరాత్రి ఈ కేసును విచారించిన ఈ కోర్టు హుబ్బళ్లి-ధార్వాడ్ ఈద్గా మైదానంలో వినాయక చవితి వేడుకలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే అంతకు ముందు బెంగళూర్ ఈద్గాలో గణేష్ చతుర్థి వేడుకలకు సంబంధించి సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ తీర్పు వచ్చిన కొన్ని గంటల్లోనే కర్ణాటక హైకోర్టు ఈ తీర్పును వెల్లడించడం విశేషం.
బెంగళూర్ ఈద్గాకు సంబంధించి భూమి యాజమాన్య వివాదం హుబ్బళ్లి కేసులో లేదని హైకోర్టు పేర్కొంది. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలు వర్తించవని జస్టిస్ అశోక్ ఎస్ కినాగి వ్యాఖ్యానించారు. హుబ్బళ్లి మైదానం కార్పొరేషన్ ఆస్తి అని గతంలో రంజాన్, బక్రీద్ వేడుకల సమయంలో ఎవరూ జోక్యం చేసుకోలేదని న్యాయమూర్తి అన్నారు. అంతకుముందు బెంగళూర్ ఈద్గాలో గణేష్ చతుర్థి విషయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఏఎస్ ఓకా, ఎంఎం సుందరేష్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం యథాతథ స్థితి కొనసాగాలని ఆదేశించింది. బెంగళూర్ ఈద్గాలో గణేష్ చతుర్థి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అంజుమన్ ఏ ఇస్లాం సంస్థ ప్రభుత్వం ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో ఇది వివాదంగా మారింది.
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
Read Also: Live: గణేష్ చతుర్థి రోజున ఇంట్లో ఈ స్తోత్రం వింటే.. అఖండ ఐశ్వర్యం మీ సొంతం
హైకోర్టు తీర్పును స్వాగతించారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. అనవసరంగా వివాదం సృష్టించాలనుకుంటున్నారని.. ఇంతకు ముందు ఈ మైదానంలో రెండు సార్లు నమాజ్ కు అనుమతి ఇచ్చారని.. ఇది పబ్లిక్ ప్రావర్టీ అని వివాదానికి ఆస్కారం ఉండదని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలతో పాటు కొంత మంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారని.. ఇది మంచి పరిణామం కాదని ఆయన అన్నారు. నమాజ్ చేయడానికి మాకు అభ్యంతరం లేదని.. అలాగే గణేష్ ఉత్సవాలను కూడా వ్యతిరేకించకూడదని కేంద్ర మంత్రి అన్నారు.
తాజావార్తలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!