Karnataka Politics: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, బీజేపీ నేతలను కుక్కపిల్లలంటూ విమర్శించారు. ప్రధాని మోదీ ముందు వీరంతా కుక్కపిల్లలని.. మోదీని చూస్తే వణికిపోతారంటూ విమర్శించారు. 15వ ఆర్థిక సంఘం కర్ణాటకకు స్పెషల్ అలెవెన్స్ కింద రూ. 5,495 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసినా ఆర్థిక మంత్రి సీతారామన్ ఇవ్వలేదని సిద్దరామయ్య విమర్శించారు.
Shock : ఓ అమ్మాయికి ఆపరేషన్ చేసిన వైద్యులు కంగుతిన్నారు. ఆ అమ్మాయి కడుపులో దాదాపు అరకేజీ వెంట్రుకల ఉండను తొలగించారు. ఇలాంటి అరుదైన శస్త్ర చికిత్సకు మైసూరులోని అపోలో ఆస్పత్రి వేడుకైంది.
Crime News : బెంగుళూరులో దారుణం జరిగింది. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో అమ్మాయిని కత్తితో పొడిచాడు ఓ యువకుడు. అనంతరం అదే కత్తితో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
Elephant Gift To Dancing Girl: ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఇంటర్నెట్లో చాలా చురుగ్గా ఉంటారు. ఎప్పుడు ఎలాంటి కొత్త వీడియో కనిపించినా షేర్ చేస్తుంటారు.
కర్ణాటకలో 2023లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. 2023 ఎన్నికలకు ముందు కేఎస్ ఈశ్వరప్ప, రమేష్ జార్కిహోళి వంటి అసంతృప్తితో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలకు కేబినెట్లో స్థానం కల్పించేందుకు కర్ణాటక ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణకు కేంద్ర మంత్రి అమిత్ షా ఆమోదం తెలిపారు.
మహిళలపై వేధింపులకు పాల్పడుతోన్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. ఓ వ్యక్తి మద్యం సేవించి.. తన దారిలో తను వెళ్లకుండా.. ఓ మహిళలను వేధించడంతో చెప్పుదెబ్బలు తప్పలేదు.. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి.. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించసాగాడు.. ధార్వాడ్ జిల్లాలో ఫుల్గా మద్యం సేవించిన వ్యక్తి.. శుభాష్ రోడ్డులో తూలుతూ కనిపించాడు. అక్కడ ఉన్న ఓ మహిళ వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు..…
BJP MP Pragya Thakur Named In Police Case For "Hindus, Keep Knives" Speech: బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్(సాధ్వి ప్రజ్ఞా) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక శివమొగ్గలో రెచ్చగొట్టే ప్రకటన చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూ జాగరణ వేదిక దక్షిణ ప్రాంత సదస్సులో మాట్లాడుతూ.. ముస్లింలను కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఈ భోపాల్ ఎంపీపై ఫిర్యాదు నమోదైంది. ఎంపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
CM Bommai assures action in Mangaluru murder case: కర్ణాటకలో మంగళూర్ హత్య ఉద్రిక్తతలకు కారణం అవుతోంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఇప్పటికే ఈ కేసులో విచారణ ప్రారంభించారు పోలీసులు. ఘటనకు కారణం అయినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హామీ ఇచ్చారు. ఆందోళన చేస్తున్న ప్రజలు శాంతి భద్రతలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు శాంతిగా ఉండాలని కోరారు.
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. 'కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ' పేరును ఆదివారం బెంగళూరులోని తన నివాసంలో ప్రకటించారు.
కర్ణాటకలోని మంగళూరు శివార్లలోని కాటిప్పళ్లలో శనివారం రాత్రి ఇద్దరు గుర్తుతెలియని దుండగులు 45 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి చంపారు. దీనిని అనుసరించి, జిల్లా యంత్రాంగం డిసెంబర్ 25 ఉదయం 6 నుంచి డిసెంబర్ 27 ఉదయం 6 గంటల వరకు నగర శివార్లలోని సూరత్కల్, బజ్పే, కావూరు, పనంబూర్లలో సీఆర్పీసీ సెక్షన్ 144 విధించింది.