PM Modi: భారత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తడం దురదృష్టకరం.. రాహుల్పై ప్రధాని ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: భారతదేశంలో ప్రజాస్వామ్యంపై తాను చేసిన వ్యాఖ్యలు కర్ణాటక, భారతదేశం, దేవుడిపై దాడి అని ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మండిపడ్డారు. లండన్ నేలపై భారత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు తలెత్తడం దురదృష్టకరం అని కర్ణాటక పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. “ఈ వ్యక్తులు భగవాన్ బసవేశ్వరుడిని, కర్ణాటక ప్రజలను, భారతదేశ ప్రజలను అవమానిస్తున్నారు. అలాంటి వారికి కర్ణాటక దూరంగా ఉండాలి.” అని ఈ ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో ఆయన ప్రసంగించారు. ప్రపంచం మొత్తం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను అధ్యయనం చేస్తోందని, భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్యం మాత్రమే కాదు.. ప్రజాస్వామ్యానికి తల్లి అని మనం చెప్పగలమని.. భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే శక్తి ఏదీ లేదని ప్రధాని మోదీ అన్నారు. భారత ప్రజాస్వామ్యంపై దాడి చేసేందుకు కొందరు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని ఆయన మండిపడ్డారు.
Read Also: Viral Video: బహిరంగ ర్యాలీలో మహిళా నాయకురాలిని ముద్దు పెట్టుకున్న ఎమ్మెల్యే?
Also Read
- Maharashtra: డ్యాన్స్ క్లాస్ ఉందని వంట చేయని భార్య.. దారుణానికి ఒడిగట్టిన భర్త..
- Ishan Kishan: కెప్టెన్గా ఇషాన్ కిషన్ రీఎంట్రీ.. రేపే తుది సమరం..
- Iran-US War: మరోసారి యుద్ధం తీవ్రం.. ఖర్గ్ ద్వీపం దగ్గర భారీ పేలుళ్లు.. ఇరాన్ ఆయిల్ ట్యాంకర్పై అమెరికా దాడి!
- Poonam Pandey: శృంగార వీడియోలు ‘‘సామాజిక సేవ’’.. వ్యభిచారంపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు..
భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, తనతో సహా పలువురు రాజకీయ నాయకులు నిఘాలో ఉన్నారని రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీల మధ్య తాజా చర్చనీయాంశంగా మారాయి. పదేపదే ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన దేశ విదేశాల్లో పరువు తీశారని బీజేపీ ఆరోపించింది.స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దేశం సాధించిన విజయాలను ప్రధాని మోదీ అప్రతిష్టపాలు చేశారని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ ఎదురుదాడికి దిగారు.
గతవారం ఇండియన్ జర్నలిస్టుల సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడుతూ, ”స్వాతంత్య్రం వచ్చిన 60 లేదా 70 ఏళ్లలో ప్రధాని మోదీ విదేశాలకు వెళ్లి ప్రకటించడం నాకు గుర్తుంది.భారతదేశంలో అపరిమిత అవినీతి ఉందని.. విదేశాల్లో ఇలా మాట్లాడడం నాకు గుర్తుంది.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఏమీ చేయలేదని, ప్రతి భారతీయుడిని అవమానిస్తూ ఆయన ప్రసంగం మీరు వినలేదా.” అంటూ రాహుల్ గాంధీ అన్నారు. తానెప్పుడూ దేశ పరువు తీయలేదన్నారు.
తాజావార్తలు
-
KTR : జీవో 97పై కేటీఆర్ ఫైర్.. విద్యార్థులకు కీలక హామీ
-
Maharashtra: డ్యాన్స్ క్లాస్ ఉందని వంట చేయని భార్య.. దారుణానికి ఒడిగట్టిన భర్త..
-
Ishan Kishan: కెప్టెన్గా ఇషాన్ కిషన్ రీఎంట్రీ.. రేపే తుది సమరం..
-
Iran-US War: మరోసారి యుద్ధం తీవ్రం.. ఖర్గ్ ద్వీపం దగ్గర భారీ పేలుళ్లు.. ఇరాన్ ఆయిల్ ట్యాంకర్పై అమెరికా దాడి!
-
Poonam Pandey: శృంగార వీడియోలు ‘‘సామాజిక సేవ’’.. వ్యభిచారంపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!