Smriti Irani: మాతృభూమిని అవమానించిన కాంగ్రెస్కు ఒక్క ఓటు కూడా వేయొద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Irani: లండన్లో ఇటీవల కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఫైర్ అయ్యారు. వయనాడ్ ఎంపీ విదేశీ గడ్డపై దేశాన్ని పరువు తీశారని అన్నారు. కర్ణాటకలోని హుబ్లీలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఇరానీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకుడు తన మాతృభూమిని అవమానించారని, ఈ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు తమ పార్టీకి ఒక్క ఓటు కూడా వేయరని అన్నారు. విదేశీ గడ్డపై స్వదేశానికి చెడ్డపేరు తెచ్చే నాయకులను బట్టబయలు చేసి వ్యతిరేకించాలని ఆమె అన్నారు.
‘‘ప్రపంచం దృష్టిలో దేశ గౌరవాన్ని నిలబెట్టే పోరాటానికి ఈ ఎన్నికలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. బీజేపీలో ఉన్న మనం మన దేశాన్ని తల్లిగా చూస్తామని విశ్వసిస్తుండగా, ప్రతిపక్షంలో ఉన్న కొందరు నాయకులు విదేశీ గడ్డపై మన మాతృభూమిని తిట్టడానికి, అవమానించడానికి ఏమాత్రం తిరుగులేదు. అలాంటి వారిని మనం వ్యతిరేకించాలి” అని స్మృతీ ఇరానీ అన్నారు. రాహుల్ గాంధీ తన ఇటీవల యూకే పర్యటనలో ప్రముఖ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఉపన్యాసంలో భారత ప్రజాస్వామ్యం దాడిలో ఉందని అన్నారు.
Also Read
- Telangana Exhibitors : ఆ 'జీవో 77' రద్దు చేయకుంటే 400 థియేటర్లు మూత.. సీఎం రేవంత్ రెడ్డికి ఎగ్జిబిటర్ల లేఖ
- US-Russia: రష్యాలో ల్యాండ్ అయిన అమెరికా మిలిటరీ విమానం.. ఏం జరుగుతోంది.?
- Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్పై అమెరికా ఆఫర్ ఇదేనా?
- Kiss Car: బాయ్ ఫ్రెండ్ కారుకు 3,400 ముద్దులు.. షాకిచ్చిన పోలీసులు
Read Also: BJP: రాహుల్ లండన్ ప్రసంగంపై దుమారం.. క్షమాపణ చెప్పాల్సిందేనని బీజేపీ డిమాండ్
పార్లమెంట్ బడ్జెట్ సెషన్ రెండో భాగంలో కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఆయనపై విరుచుకుపడేందుకు అవకాశాన్ని కల్పించాయి. రాహుల్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ కాషాయ పార్టీ పార్లమెంటు ఉభయ సభల సమావేశాలకు అంతరాయం కలిగిస్తోంది. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకుడు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, భారతదేశం గురించి అగౌరవంగా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని అన్నారు.భారత ప్రజాస్వామ్యాన్ని విమర్శించడం, కించపరచడం రాహుల్ గాంధీకి అలవాటు అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
తాజావార్తలు
-
Telangana Exhibitors : ఆ ‘జీవో 77’ రద్దు చేయకుంటే 400 థియేటర్లు మూత.. సీఎం రేవంత్ రెడ్డికి ఎగ్జిబిటర్ల లేఖ
-
US-Russia: రష్యాలో ల్యాండ్ అయిన అమెరికా మిలిటరీ విమానం.. ఏం జరుగుతోంది.?
-
Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్పై అమెరికా ఆఫర్ ఇదేనా?
-
Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
-
Kiss Car: బాయ్ ఫ్రెండ్ కారుకు 3,400 ముద్దులు.. షాకిచ్చిన పోలీసులు
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!