మొదటి నుంచి టెస్లా అధినేత ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్షుడిని వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. తాజా మరోసారి అధ్యక్షుడు జో పై మండిపడ్డాడు. 2030 నాటికి అమెరికాలో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి, వినియోగంపై అధ్యక్షుడు బైడెన్ సమీక్షను నిర్వహించారు. వినియోగం, పెట్టుబడి అంశంలో ఎలక్ట్రిక్ కార్ల కంపెనీల అధినేతలతో జో బైడెన్ సమావేశం అయ్యారు. ప్రపంచంలో అత్యధిక ఎలక్ట్రిక్ కార్లను జనరల్ మోటార్స్ సంస్థ ఉత్పత్తి చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ సమావేశానికి టెస్లా అధినేత ఎలన్…
కరోనా మహమ్మారి మరోసారి అగ్రరాజ్యం అమెరికాపై దండయాత్ర చేస్తోంది.. ఒమిక్రాన్ విజృంభణతో యూఎస్ విలవిల్లాడుతోంది. ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో యూఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంట్లోనే కోవిడ్-19 పరీక్షలు చేసుకునేలా 100 కోట్ల ర్యాపిడ్ కిట్లతో పాటు వైరస్ బారినపడకుండా రక్షణ కల్పించే ఎన్95 మాస్క్లను తమ పౌరులకు ఉచితంగా అందిస్తామని దేశాధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. దీంతోపాటు వచ్చే వారం నుంచి వెయ్యి మంది సైనిక వైద్య సిబ్బందిని దేశవ్యాప్తంగా మోహరిస్తామని…
సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు అగ్రరాజ్యాన్ని సైతం వణికిస్తోంది… యూఎస్లో పెద్ద సంఖ్యలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. గణాంకాలను పరిశీలిస్తే.. గత వారం రోజుల్లో నమోదైన మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల్లో 73 శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయంటే.. ఒమిక్రాన్ ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో అర్థం చేసుకోవచ్చు.. ఇక, న్యూయార్క్ ఏరియాలో తాజా కేసుల్లో 90శాతానికిపైగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులే ఉండడం కూడా ఆందోళన కలిగిస్తోంది.. గత వారం…
అగ్రరాజ్యమైన అమెరికా పాలన కార్యాలయం వైట్ హౌస్లో మరోసారి కరోనా కలకలం సృష్టించింది. గత నెలలో కూడా శ్వేత సౌధంలో కరోనా కేసులు బయటకు రావడంతో వైద్యులు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్కు పరీక్షలు నిర్వహించారు. కొంతమందిని ఐసోలేషన్లో ఉంచారు. అయితే తాజాగా మరో కరోనా కేసు వైట్ హౌస్లో వెలుగు చూసింది. గత మూడు రోజుల క్రితం జోబైడెన్తో ప్రయాణించిన తన పాలన యంత్రాంగంలోని ఓ వ్యక్తి కరోనా పాజిటివ్గా నిర్థారణైంది. అయితే కరోనా సోకిన ఉద్యోగి…
అమెరికా రష్యా దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా కన్నేసింది. ఆ దేశ సరిహద్దులో 75 వేల సైనిక బలగాలను మోహరించింది. పెద్ద సంఖ్యలో యుద్ధ ట్యాంకులను మోహరించింది. దీంతో ఆప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఉక్రెయిన్పై రష్యా ఎలాంటి దాడులకు పాల్పడినా తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని అమెరికా హెచ్చరించింది. Read: చేతకాని వైసీపీ ఎంపీలు చట్టసభల్లో దేనికి?: పవన్ కళ్యాణ్ రష్యాపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. అమెరికాతో పాటుగా జీ7…
అమెరికాలో ఎప్పుడూ లేని విధంగా టోర్నడోలు విరుచుకుపడ్డాయి. ఆరురాష్ట్రాల్లో టోర్నడోలు విరుచుకుపడటంతో సుమారు 100 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గల్లంతైయ్యారు. గల్లంతైన వారిలో ఎంతమంది మరణించారో తెలియదని స్థానిక వార్తసంస్థలు పేర్కొన్నాయి. దీంతో ప్రాణనష్టం భారీగా ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనావేస్తున్నాయి. Read: ఛండీగడ్ తొలి ఒమిక్రాన్ కేసు నమోదు.. టోర్నడోలు విరుచుకుపడిన ప్రాంతాల పరిస్థితులపై జో బైడెన్ సమీక్షను నిర్వహించారు. కెంటకీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. త్వరలనే టోర్నడో…
రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల మధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఉక్రెయిన్ తూర్పు సరిహద్దుల వెంట రష్యా భారీ ఎత్తున సైనికులను, యుద్ద ట్యాంకులను మొహరించింది. ఉక్రెయిన్ను రష్యా ఆక్రమించుకోవాలని చూస్తోందనే వదంతులు వ్యాపించడంతో అమెరికా ఉలిక్కిపడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వీడియోకాల్లో మాట్లాడారు. దాదాపు రెండున్న గంటలసేపు వారి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. పలకరింపులతో మొదలైన వీడియో కాల్ క్రమంగా ఉక్రెయిన్ పై చర్చవైపు మళ్లింది. Read: హ్యుందాయ్ భారీ…
అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ కంట్రీ చైనా మధ్య ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది.. తాజాగా, తైవాన్ విషయంలోనూ రెండు అగ్రరాజ్యాల మధ్య వార్నింగ్ల పర్వం నడుస్తోంది.. తైవాన్ స్వాతంత్ర్యానికి అమెరికా మద్దతివ్వడమంటే నిప్పుతో చెలగాటమాడినట్లే అంటూ తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు వార్నింగ్ ఇచ్చారు చైనా అధినేత జిన్ పింగ్.. ఈ విషయాన్ని చైనా మీడియా వెల్లడించింది… ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాఫిక్గా మారిపోయింది.. జో బైడెన్, జిన్పింగ్ మధ్య…
అమెరికా పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రధాని మోడీ. శుక్రవారం…ఆదేశ అధ్యక్షులు జోబైడెన్తో సమావేశమయ్యారు. కీలక విషయాలపై చర్చించారు. జో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక తొలిసారి ఈ సమావేశం జరిగింది. భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడనున్నాయని ఈ సందర్భంగా అన్నారు బైడెన్. ఇరుదేశాల సంబంధాల్లో టెక్నాలజీ కీలకపాత్ర పోషించనుందన్నారు బైడెన్. వాణిజ్య రంగంలో పరస్పర సహకారం రెండు లాభదాయకమన్నారు. భారత్-అమెరికా సంబంధాల్లో కొత్తశకం మొదలవుతోందని చెప్పారు. అమెరికాకు ప్రధాన మిత్రదేశాల్లో భారత్ కూడా ఒకటని స్పష్టం…
భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడనున్నాయన్నారు అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్. ఇరుదేశాల సంబంధాల్లో టెక్నాలజీ కీలకపాత్ర పోషించనుందన్నారు బైడెన్. వాణిజ్య రంగంలో పరస్పర సహకారం రెండు దేశాలకు లాభదాయకమన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోడీతో.. వైట్హౌజ్లో సమావేశమైన బైడెన్.. భారత్-అమెరికా సంబంధాల్లో కొత్తశకం మొదలవుతోందని చెప్పారు. అమెరికాకు ప్రధాన మిత్రదేశాల్లో భారత్ కూడా ఒకటని స్పష్టం చేశారు. బైడెన్తో భేటీ వల్ల అన్ని అంశాలపై చర్చించుకునే అవకాశం లభించిందన్నారు ప్రధాని మోడీ. ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడే…