భారత్- అమెరికా సంబంధాలు మరింత బలపడ్డాయి: బైడెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రధాని మోడీ. శుక్రవారం…ఆదేశ అధ్యక్షులు జోబైడెన్తో సమావేశమయ్యారు. కీలక విషయాలపై చర్చించారు. జో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక తొలిసారి ఈ సమావేశం జరిగింది. భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడనున్నాయని ఈ సందర్భంగా అన్నారు బైడెన్. ఇరుదేశాల సంబంధాల్లో టెక్నాలజీ కీలకపాత్ర పోషించనుందన్నారు బైడెన్. వాణిజ్య రంగంలో పరస్పర సహకారం రెండు లాభదాయకమన్నారు. భారత్-అమెరికా సంబంధాల్లో కొత్తశకం మొదలవుతోందని చెప్పారు. అమెరికాకు ప్రధాన మిత్రదేశాల్లో భారత్ కూడా ఒకటని స్పష్టం చేశారు.
ఇక ఇండియా-అమెరికా దేశాల మధ్య వాణిజ్య అంశాలు చాలా కీలకమన్నారు ప్రధాని మోడీ. ఈ దశాబ్దంలో ఇరు దేశాలు ఎంతో సహకరించుకున్నాయని చెప్పారు. వాణిజ్య అంశాలు మరింత బలపడడం చాలా అవసరమన్నారు.ఆ తర్వాత వైట్హౌస్లో క్వాడ్ దేశాల సదస్సు జరిగింది. అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు పాల్గొన్నాయ్. కరోనా, వాతావరణం, ఇండో-పసిఫిక్ రీజియన్లో భద్రతపై కీలకంగా చర్చ జరిగింది. గతంలో సునామీపై కలిసికట్టుగా పనిచేసి, ప్రపంచానికి మద్ధతుగా నిలిచామన్నారు ప్రధాని మోడీ.
Also Read
- 1991 Hijack: విమానం హైజాక్ జరిగితే, నిద్ర పోయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని భుట్టో..
- Pakistan: ‘‘దౌత్యం కడుపు నింపదు’’.. పాక్ పరువు తీసిన సింగపూర్ దౌత్యవేత్త..
- Ayatollah Khamenei: చనిపోయిన 4 నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు.. ఇన్నాళ్లు ఎక్కడ ఉంచారు.?
- Pakistan: పాకిస్థాన్లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 40 మంది మృతి
ఇప్పుడు కరోనాపై పోరాటం చేస్తున్నామని చెప్పారు.క్వాడ్ సమావేశం భారత్కు అత్యంత కీలకం. క్వాడ్ గ్రూపులో ఉన్న దేశాల్లో చైనాతో సరిహద్దును పంచుకుంటోన్న ఏకైక దేశం భారత్. ఈ సరిహద్దులోని చాలా ప్రాంతాలు వివాదాస్పదం అయ్యాయి. ఇండో-పసిఫిక్ రీజియన్లో చైనాను ఎదుర్కొనేందుకు, క్వాడ్లోని మిగతా మూడు సభ్య దేశాలతో కలిసి వ్యూహాత్మక ప్రణాళికలను రూపొందించేందుకు క్వాడ్ సమావేశం ఉపయోగపడుతుందని భావిస్తోంది భారత్.
తాజావార్తలు
-
India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
-
Arunodaya Naganna Passes Away : మూగబోయిన విప్లవ గళం.. అరుణోదయ నాగన్న కన్నుమూత.!
-
US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
-
PM Modi: న్యూజిలాండ్ టూర్కు మోడీ.. 40 ఏళ్లలో తొలి భారత ప్రధానిగా రికార్డ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
ట్రెండింగ్
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!