రిపబ్లిక్ డేను దృష్టిలో ఉంచుకుని.. జనవరి 26న జమ్మూకశ్మీర్లో దాడికి ప్లాన్ చేశామని ఉగ్రవాది జావేద్ మట్టూ తెలిపాడు. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం విచారణలో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ టెర్రరిస్ట్ హిజ్బుల్ ముజాహిదీన్ సభ్యుడిగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే.. హిజ్బుల్ ముజాహిదీన్ A++ కేటగిరీకి చెందిన ఉగ్రవాది జావేద్ అహ్మద్ మట్టూ ఈ నెల జనవరి 4న అరెస్టయ్యాడు. కాగా.. అతన్ని పోలీసులు విచారించగా, ఈ విషయం బయటపడింది.
Ram Bhajan: యావత్ దేశం రామ మందిర ప్రారంభోత్సవం, బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపన కోసం ఎదురుచూస్తోంది. జనవరి 22న ఈ మహాత్తర ఘట్టం జరగబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమం కోసం యూపీ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. రామ మందిర వేడుకకు సమయం దగ్గర పడుతున్నా కొద్ది దేశవ్యాప్తంగా పండగ వాతావరణ నెలకొంది.
Operation Sarvashakti: జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని తిప్పికొట్టేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధమైంది. లోయలో మళ్లీ ఉగ్రవాదాన్ని పెంచేందుకు ఇటీవల పూంచ్, రాజౌరీ ప్రాంతాల్లో టెర్రరిస్టులు దాడులకు పాల్పడుతున్నారు. పిర్ పంజాల్ పర్వతాలను, అక్కడి అడవుల్లో దాక్కుంటూ భద్రతా సిబ్బందికి సవాల్ విసురుతున్నారు. ఈ ప్రాంతంలోని గుహలు, కొండలు, అడవులు ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారడంతో వారిని ఏరేసేందుకు చేస్తున్న ఆపరేషన్లు కష్టంగా మారాయి. ఇటీవల జరిగిన ఉగ్రదాడుల్లో అధికారులతో సహా జవాన్లు 20 మంది…
POK: పాకిస్తాన్లో బ్రిటన్ రాయబారిగా ఉన్న జేన్ మారియట్ ఇటీవల పాక్ ఆక్రమిత్ కాశ్మీర్(పీఓకే)లో పర్యటించడం వివాదాస్పదమైంది. పాకిస్థాన్లోని UK హైకమిషనర్ జేన్ మారియట్ జనవరి 10న మీర్పూర్ను సందర్శించారు. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె పర్యటన ‘‘అత్యంత అభ్యంతరకరం.. భారత సార్వభౌమాధికారం,
Terrorist Attack: జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. పూంచ్లో శుక్రవారం సాయంత్రం ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై దాడికి తెగబడ్డారు. లోపల ఉన్న సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే సైనికులు కూడా ఉగ్రవాదులపైకి కాల్పులు జరిపారు. ఇప్పటి వరకు ఈ ఎదురుకాల్పుల్లో గాయాలు, కానీ మరణాలు కానీ నివేదించబడలేదు. సమీపంలోని ఎత్తైన కొండ పై నుంచి ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దాడికి గురైన ఆర్మీ కాన్వాయ్లో అనేక వాహనాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Mehbooba Mufti: జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ పార్టీ అధినేత మహబూబా ముఫ్తీ తృటిలో భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. గురువారం మధ్యాహ్నం ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన అనంత్నాగ్ జిల్లాలోని సంగమ్ వద్ద జరిగింది. ఎదురుగా వస్తు్న్న కారును, ముఫ్తీ ప్రయాణిస్తున్న స్కార్పియో ఢీకొట్టింది.
Article 370: జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే ‘ఆర్టికల్ 370’ని బీజేపీ నేతృత్వంలోని 2019లో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలని కోరుతూ మళ్లీ సుప్రీంకోర్టులో ‘రివ్యూ పిటిషన్’ దాఖలైంది.
కశ్మీర్ లోయలోని షోపియాన్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ రోజు తెల్లవారు జామున షోపియాన్లోని ఛోటిగామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు- ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
Javed Ahmed Mattoo: హిజ్బుల్ ముజాహిదీన్కి చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జావేద్ అహ్మద్ మట్టూ గురువారం ఢిల్లీలో పట్టుబడ్డాడు. కేంద్ర ఏజెన్సీల సమన్వయంతో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ టీం మట్టూను అరెస్ట్ చేసింది. ఇతను జమ్మూకాశ్మీర్ లో హిజ్బుల్ ఉగ్రసంస్థ తరుపున పనిచేస్తున్నాడు. పోలీసులు మట్టూ నుంచి ఒక పిస్టల్, ఆరు లైవ్ కాట్రిడ్జ్లు, దొంగలించబడిన కారును స్వాధీనం చేసుకున్నారు.
జమ్ముకశ్మీర్లోని హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన వాంటెడ్ టెర్రరిస్టు జావేద్ అహ్మద్ మట్టూ గురువారం ఢిల్లీలో పట్టుబడ్డాడు. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం అతడిని అరెస్టు చేసింది.