PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కాశ్మీర్ వేదిగకా మెగా ర్యాలీకి సిద్ధమవుతున్నారు. వచ్చే నెలలో జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అనంత్నాగ్ జిల్లాలో భారీ బహిరంగ సభ ఉండే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీ కాశ్మీర్ లోయలో పర్యటించడం ఇదే తొలిసారి అవుతుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ కాశ్మీర్లో ఈ ఎన్నికల ర్యాలీని నిర్వహించబోతోంది.
Ravi River: సింధు దాని ఉపనదుల జలాలను భారత్ సమర్థవంతంగా వాడుకునేందుకు సిద్ధమైంది. పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో నిర్మితమవుతున్న షాపూర్ కంది బ్యారేజ్ నిర్మాణం తుదిదశకు చేరుకోవడంతో పాకిస్తాన్కి రావి నది నీటి ప్రవాహాన్ని భారత్ నిలిపేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లోకి ప్రవహించే 1150 క్యూసెక్కుల రావి నది నీటిని ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లోని కథువా, సాంబా జిల్లాల్లోని 32,000 హెక్టార్ల భూమికి సాగు నీరుగా ఇవ్వనున్నారు.
Yana Mir: భారత్లో జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో మైనారిటీలను అణిచివేస్తున్నారని, ఇండియన్ ఆర్మీ దురాగతాలకు పాల్పడుతోందని వెస్ట్రన్ మీడియాతో పాటు పాకిస్తాన్ ప్రేలాపనలను కాశ్మీరీ యువతి, హక్కుల కార్యకర్త యానా మీర్ కొట్టిపారేసింది. తప్పుడు ప్రచారాలు చేస్తున్న ‘‘టూల్కిట్ ఫారిన్ మాడియా’’పై ఆమె విరుచుకుపడింది. బ్రిటన్ పార్లమెంట్లో ఆమె చేసిన ప్రసంగం ఇప్పుడు వైరల్గా మారింది.
Earthquake : జమ్మూ కాశ్మీర్లో రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.5గా నమోదై బలమైన భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం ఉత్తర కాశ్మీర్ అని అన్నారు. సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ప్రకారం, భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉంది.
INDIA bloc: 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉంటామని భావించి ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలో విబేధాలు కనిపిస్తున్నాయి. టీఎంసీ, ఆప్ వంటి పార్టీలు ఇప్పటికే తాము ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించాయి. సీట్ల షేరింగ్లో కాంగ్రెస్ వైఖరిని నిందించాయి. మమతా బెనర్జీ ఒక అడుగు ముందుకేసి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం 40 స్థానాలైనా గెలుచుకుంటుందా.? అనే అనుమానాన్ని వ్యక్తం చేశాయి. మరోవైపు ఆప్ పంజాబ్, ఢిల్లీల్లో కాంగ్రెస్తో పొత్తుపై పెద్దగా స్పందించడం లేదు.
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. శ్రీనగర్ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు ఇదే కేసులో గత నెలలో సమన్లు అందాయి.
జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మారుమూల గ్రామంలో ఇవాళ తెల్లవారు జామున ఇంటికి మంటలు అంటుకోవడంతో ముగ్గురు మైనర్ బాలికలు సజీవదహనం అయ్యారని పోలీసు అధికారులు తెలిపారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ రోజు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో స్థానికేతర కార్మికుడు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వ్యక్తిని పంజాబ్ అమృత్సర్కి చెందిన అమృత్ పాల్ సింగ్గా గుర్తించారు. క్షతగాత్రుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటన శ్రీనగర్ పట్టణంలోని షహీద్ గంజ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. దాడికి పాల్పడిన వారి ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా…
Terrorist arrest: ఆర్మీలో పనిచేసిన జవాన్ లష్కరే తోయిబా ఉగ్రవాదిగా మారాడు. అతడిని ఢిల్లీ పోలీసులు న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేసినట్లు మంగళవారం అధికారులు తెలిపారు. రిటైర్డ్ ఆర్మీ సైనికుడు రియాజ్ అహ్మద్ గత కొంత కాలంగా లష్కర్ ఉగ్రవాదిగా పనిచేస్తున్నాడు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు కుప్వారా జిల్లాలోని ఎల్ఈటీ మాడ్యుల్ చేధించిన కొద్ది రోజుల తర్వాత ఈ అరెస్ట్ చోటు చేసుకుంది.
Chenab river: పాకిస్తాన్ని చావు దెబ్బతీసింది భారత్. అప్పుడెప్పుడో నెహ్రూ హాయాంలో పాక్ అధినేత అయూబ్ ఖాన్తో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో సింధూ నదీ జలాల ఒప్పందం జరిగింది. అయితే, పలు సందర్భాల్లో భారత్ను దెబ్బకొట్టేందుకు సీమాంతర ఉగ్రవాదాన్ని, ఉగ్రదాడుల్ని చేస్తున్నా.. ఈ ఒప్పందం జోలికి మాత్రం భారత్ ఏనాడు వెళ్లలేదు. అయితే, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాకిస్తాన్కి ఎక్కడ కొడితే దెబ్బ గట్టిగా తగులుతుందో చూసి ఇండియా దెబ్బ కొడుతోంది. తాజాగా మరోసారి అలాంటి…