ఉత్తర కాశ్మీర్ బారాముల్లా జిల్లా ఉరీలోని గోహ్లాన్ ప్రాంతంలో ఉగ్రవాద చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఉరీ సెక్టార్లోని ఎల్ఓసి సమీపంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చినట్లు సమాచారం.
PM Modi: అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్ర హోదా జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎన్నో రోజుల నుంచి కోరుతున్న అంశాలు. ఈ అంశాలపై ప్రధాని నరేంద్రమోడీ హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ, మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఆ రాష్ట్రంలో ప్రసంగించారు.
Chenab Railway Bridge: ప్రపంచంలోనే అత్యంత ఎతైన రైల్వే బ్రిడ్జ్ని నిర్మించి భారత్ రికార్డ్ సృష్టించింది. జమ్మూ కాశ్మీర్లో రైల్వే మార్గానికి ఎంతో కీలకమైన ‘‘చీనాబ్ రైల్వే వంతెన’’ పై నుంచి ఈ రోజు భారతీయ రైల్వే విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించింది.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. ఇటీవల కాలంలో కేంద్రపాలిత ప్రాంతంలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్న తరుణంలో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు ఈ రోజు మట్టుపెట్టాయి.
Jammu Kashmir: ఉత్తర కశ్మీర్లోని బందిపొర జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నట్లు వార్తలు రావడంతో భద్రతా బలగాలు ఈ చర్యలు చేపట్టాయి.
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అన్ని విధాలా అంతమొందించాలని, రాబోయే అమర్నాథ్ యాత్రకు భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రతా బలగాలను ఆదేశించారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ డివిజన్లో ఉద్భవిస్తున్న ఉగ్రవాదాన్ని అణిచివేయాలని, లోయలో దాని పునరుద్ధరణను నిరోధించాలని షా భద్రతా బలగాలకు సూచించారు.
జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడుల నేపథ్యంలో భద్రతా పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంహెచ్ఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. రియాసిలో యాత్రికుల బస్సుపై దాడితో సహా పలు ఉగ్రవాద దాడులపై చర్చించారు. ఈ క్రమంలో.. అమిత్ షా జూన్ 16న షా ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితి, అమర్ నాథ్ యాత్రకు సంబంధించిన సన్నాహాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూ…
Terrorist Attacks: జమ్మూ కాశ్మీర్లో వరసగా జరుగుతున్న ఉగ్రవాద ఘటనలు ఆ రాష్ట్రంలో మరోసారి భయాందోళనల్ని పెంచాయి. గత ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన రోజునే, ఉగ్రవాదులు రియాసి జిల్లాలో శివ్ ఖోరీ నుంచి కత్రాకు యాత్రికులతో వెళ్తున్న బస్సుపై దాడి చేశారు.
కేంద్రంలో మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాడ్డక జమ్మూకాశ్మీర్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నాలుగు రోజుల్లో 4 ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూ-కశ్మీర్ పరిస్థితులపై ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించారు.
Reasi Terror Attack: జమ్మూ కాశ్మీర్ రియాసీ జిల్లాలో ఆదివారం బస్సుపై ఉగ్రవాద దాడి ఘటనలో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న 50 మందిని అదుపులోకి తీసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రకటించారు.