Amit Shah Review: జమ్మూ ఉగ్రదాడి ఘటన.. ఎల్లుండి అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశం
- జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్ష
- రియాసిలో యాత్రికుల బస్సుపై దాడితో సహా పలు ఉగ్రవాద దాడులపై చర్చ
- జూన్ 16న మరోసారి ఉన్నత స్థాయి సమావేశం
- జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితి.. అమర్ నాథ్ యాత్రకు సంబంధించిన సన్నాహాలపై చర్చ
జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడుల నేపథ్యంలో భద్రతా పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంహెచ్ఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. రియాసిలో యాత్రికుల బస్సుపై దాడితో సహా పలు ఉగ్రవాద దాడులపై చర్చించారు. ఈ క్రమంలో.. అమిత్ షా జూన్ 16న షా ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితి, అమర్ నాథ్ యాత్రకు సంబంధించిన సన్నాహాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు తదితరులు హాజరుకానున్నారు.
Telangana: తెలుగు పాఠ్య పుస్తకం ముందుమాటలో తప్పులు.. చర్యలు చేపట్టిన ప్రభుత్వం
Also Read
- Top Selling CNG Cars: భారత్లో అత్యధికంగా సేల్ అయిన CNG కార్లు ఇవే..
- Jeffrey Epstein: ఎప్స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన 'సూసైడ్ లేటర్'.. ప్రపంచ కుబేరులకు దడ!
- SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
- US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ 'మాస్టర్ ప్లాన్' సిద్ధం!
జమ్మూకశ్మీర్లో ప్రస్తుత పరిస్థితులు, ఉగ్రవాద ఘటనల అనంతరం తీసుకున్న చర్యలపై హోంమంత్రికి సమాచారం అందించినట్లు సమాచారం. గత నాలుగు రోజుల్లో జమ్మూకశ్మీర్లోని రియాసి, కథువా, దోడా జిల్లాల్లో నాలుగు చోట్ల ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడుల్లో తొమ్మిది మంది యాత్రికులు, ఒక సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందగా, ఏడుగురు భద్రతా సిబ్బందితో పాటు పలువురు గాయపడ్డారు. కతువా జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు అనుమానిత పాకిస్థాన్ ఉగ్రవాదులు కూడా మరణించారు. అలాగే వారి వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
T20 World Cup 2024: సూపర్ 8లో టీంఇండియాతో తలపడే జట్లు అవేనా..
ఇదిలా ఉంటే.. జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితిని అంచనా వేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ ప్రాంతంలో ప్రస్తుత భద్రతా రంగం, కొనసాగుతున్న ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాలపై ప్రధాన మంత్రి వివరణాత్మక సమాచారాన్ని తెలుసుకున్నారు. సమీక్ష అనంతరం భద్రతా బలగాల వ్యూహాత్మక మోహరింపు, ఉగ్రవాద నిరోధక చర్యల కార్యాచరణ అంశాలపై దృష్టి సారించారు.
తాజావార్తలు
-
Top Selling CNG Cars: భారత్లో అత్యధికంగా సేల్ అయిన CNG కార్లు ఇవే..
-
IPL 2026 Playoffs Chances: రసవత్తరంగా ప్లేఆఫ్స్ రేస్.. గుజరాత్కు చిగురించిన ఆశలు, ఆ 5 టీమ్స్ ఇక ఇంటికేనా?
-
Jeffrey Epstein: ఎప్స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన ‘సూసైడ్ లేటర్’.. ప్రపంచ కుబేరులకు దడ!
-
TG DGP C.V. Anand: తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకరణ..
-
Tandur: తాండూరులో చేతబడి కలకలం.. కూతురు ప్రేమ విఫలం కావాలని తల్లి క్షుద్రపూజలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!