Terrorist Attacks: జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడుల ఉద్దేశ్యం ఏమిటి..?
- జమ్మూ కాశ్మీర్లో వరసగా ఉగ్రదాడులు..
- మోడీ ప్రమాణస్వీకారం నుంచే దాడులు మొదలు..
- పరిస్థితులు సరిగా లేవని చెప్పేందుకే ఉగ్రదాడులు..
- మరోసారి మోడీ అధికారంలోకి రావడంతో రగిలిపోతున్న పాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorist Attacks: జమ్మూ కాశ్మీర్లో వరసగా జరుగుతున్న ఉగ్రవాద ఘటనలు ఆ రాష్ట్రంలో మరోసారి భయాందోళనల్ని పెంచాయి. గత ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన రోజునే, ఉగ్రవాదులు రియాసి జిల్లాలో శివ్ ఖోరీ నుంచి కత్రాకు యాత్రికులతో వెళ్తున్న బస్సుపై దాడి చేశారు. ఈ ఘటనలో 10 మంది మరణించారు. ఆ తర్వాత వరసగా కథువా, దోడా ప్రాంతాల్లో మూడు ఉగ్రవాద ఘటనలు జరిగాయి. ఇందులో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చగా.. ఒక జవాన్ అమరుడయ్యారు.
అయితే, ఇటీవల కాలంలో పీర్ పంజాల్ పరిధి దిగువన ఉన్న జమ్మూలో ఉగ్రవాద ఘటనలు గణనీయంగా పెరిగాయి. రిటైర్డ్ ఆర్మీ అధికారుల ప్రకారం.. ప్రధానిమోడీ, ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అధికారం చేపడుతున్న సమయంలో, మోడీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ పరిస్థితుల్ని చక్కదిద్దలేదనే అభిప్రాయాన్ని కలిగించేందుకే బస్సుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారని లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అటా హుస్నైన్(రిటైర్డ్) అన్నారు. 2000లో జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలోని చిట్టి సింగ్ పోరా గ్రామంలో ఉగ్రవాదులు 35 మంది సిక్కు యాత్రికులను కాల్చి చంపిన అంశాన్ని ఉదహరించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత పార్లమెంట్లో ప్రసంగించేందుకు ఒక రోజు ముందు ఈ ఘటన జరిగిందని గుర్తు చేశారు.
Also Read
- India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
- Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ
- Cockroach Janta Party: 2 కోట్ల ఫాలోవర్లు, 2 వేల మంది కూడా రాలే.."కాక్రోచ్ జనతా పార్టీ" ఫ్లాప్ షో..
- Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
Read Also: Heavy Rains: చురుగ్గా రుతుపవనాలు కదలిక.. నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన..
మోడీ మరోసారి ప్రధానిగా ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మోడీ తన ప్రభుత్వ విజయాలను చెబుతున్న సందర్భంలోనే, జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు బాగా లేవని చూపించాలని శత్రుదేశం పాకిస్తాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఉగ్రవాద దాడుల్ని ప్రోత్సహిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికలు విజయవంతగా ముగిసిన తర్వాత, మళ్లీ ప్రధాని మోడీ మూడోసారి అధికారంలోకి రావడంతో పాకిస్తాన్ ఏదో ఒకటి చేయాలనే లక్ష్యంతో వ్యవహరిస్తోంది. ఆర్మీ ఆపరేషన్ల వల్ల గత కొంత కాలంగా ఉగ్రవాదుల్ని మట్టుబెడుతున్నారు. కాశ్మీరీ యువత టెర్రరిజం నుంచి బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ ఉనికిని చాటుకునేందుకు ఈ దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
గతంలో పోలిస్తే ఉగ్రదాడుల భిన్నంగా జరుగుతున్నాయి. కొన్ని చిన్నచిన్న గ్రూపులు టార్గెటెడ్ కిల్లింగ్స్ చేపడుతున్నాయి. వీరంతా బాగా శిక్షణ తీసుకుని ఉన్నారు. ముఖ్యంగా ‘‘జింగిల్ వార్ఫేర్’’లో ఆరితేరారు. అడవుల్లో రోజుల పాటు మకాం వేసి, గుహల్లో నివసిస్తూ అదును చూసి ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. దానికి ఆటంకం కలిగించేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : మమతా బెనర్జీ రాజకీయ కోట కూలుతుందా? బెంగాల్లో మహారాష్ట్ర సీన్ రిపీటవుతుందా?
-
India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
-
Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
-
Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ ‘స్టాండప్ కామెడీ’.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
-
Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!