Chenab Railway Bridge: ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై నుంచి రైలు ప్రయాణం.. ట్రయర్ రన్ వీడియో వైరల్..
- చీనాబ్ రైల్వే వంతెనపై ట్రయల్ రన్ సక్సెస్..
- జమ్మూ కాశ్మీర్లో చీనాబ్ నదిపై నిర్మాణం..
- ప్రపంచంలోనే అతి ఎత్తైన వంతెనగా గుర్తింపు..
- జమ్మూ కాశ్మీర్ని దేశంతో అనుసంధానించే ప్రాజెక్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chenab Railway Bridge: ప్రపంచంలోనే అత్యంత ఎతైన రైల్వే బ్రిడ్జ్ని నిర్మించి భారత్ రికార్డ్ సృష్టించింది. జమ్మూ కాశ్మీర్లో రైల్వే మార్గానికి ఎంతో కీలకమైన ‘‘చీనాబ్ రైల్వే వంతెన’’ పై నుంచి ఈ రోజు భారతీయ రైల్వే విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించింది. రాంబన్ జిల్లాలోని సంగల్దాన్-రియాసీ మధ్య చీనాబ్ నదిపై ఈ వంతెనను నిర్మించారు. ఈ మార్గంలో త్వరలోనే రైలు సేవలు ప్రారంభం కానున్నాయని అధికారలు తెలిపారు. ట్రయల్ రన్లో రైలు జమ్మూ కాశ్మీర్లోని అందమై పర్వతాల మధ్య ఉన్న చీనాబ్ వంతెన పై నుంచి ప్రయాణించడం చూడొచ్చు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
Read Also: Summer solstice: రేపు ఏడాదిలోనే ‘‘సుదీర్ఘమైన పగలు’’.. అయనాంతాలు అంటే ఏమిటి, ఎలా ఏర్పడుతాయి..?
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
ఈ వంతెన చీనాబ్ నదికి ఎగువన 359 మీటర్లు( సుమారు 109 అడుగులు) ఎత్తులో నిర్మితమైంది. పారిస్లోని ఈఫిల్ టవర్ కన్నా దాదాపుగా 35 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఉదంపూర్ శ్రీనగర్ బాలాముల్లా రైల్ లింక్(USBRL) ప్రాజెక్ట్ కింద ఈ వంతెనను నిర్మించారు. ఇది జమ్మూని, కాశ్మీర్ని రైలుతో అనుసంధానిస్తుంది. కాశ్మీర్ని మిగతా దేశంతో కలుపుతుంది. 48.1 కి.మీ పొడమైన బనిహాల్-సంగల్దాన్ సెక్షన్ ప్రాజెక్టును ఫిబ్రవరి 20,2024న ప్రధాని మోడీ ప్రారంభించారు.
తాజాగా జరిగిన రైలు ట్రయల్ రన్కి సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. సంగల్దాన్-రియాసి సెక్షన్ల మధ్య MEMU రైలు ట్రయల్ రన్ విజయవంతమైందని ప్రకటించారు. 118 కి.మీ ఖాజిగుండ్-బారాముల్లా మధ్య కవర్ చేసే ప్రాజెక్టుని ఫేస్-1 పనుల్ని అక్టోబర్ 2009లో ప్రారంభించారు. తదుపరి దశల్లో 18 కి.మీ బనిహాల్-ఖాజీగుండ్ సెక్షన్ ని జూన్ 2013లో, 35కి.మీ ఉధంపూర్-కత్రా సెక్షన్ని జూలై 2014లో ప్రారంభించారు.
#WATCH | J&K: Indian Railway conducts a trial run on the newly constructed world's highest railway bridge-Chenab Rail Bridge, built between Sangaldan in Ramban district and Reasi. Rail services on the line will start soon pic.twitter.com/gHGxhMHYe3
— ANI (@ANI) June 20, 2024
Successful trial run of MEMU train between Sangaldan – Reasi section of USBRL project.
📍Jammu & Kashmir pic.twitter.com/GjaKX6Ci8Q
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 20, 2024
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!