Indian Air Force: జమ్మూ కాశ్మీర్లోని వైమానికి దళ స్టేషన్లో వింగ్ కమాండర్గా పనిచేసే అధికారి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్ ఆరోపించడం సంచలనంగా మారింది. అత్యాచారం, మానసిక వేధింపులు, నిరంతర వేధింపులకు పాల్పడినట్లు మహిళా అధికారి ఆరోపించడంతో ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) ఇంటర్నల్ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
Indian Army: జమ్మూ అండ్ కాశ్మీర్ లో వరుసగా ఉగ్రవాదుల బెదిరింపులకు వ్యతిరేకంగా స్థానిక భద్రతను పెంపొందించడానికి విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ (VDGs)కి శిక్షణ ఇవ్వడానికి భారత సైన్యం, జమ్మూ పోలీసులు ముందుకు వచ్చారు.
Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరులో విజయం సాధించేందుకు పార్టీల పోరు మొదలైంది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం నుంచి పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
ప్రధాని మోడీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. బ్రూనై, సింగపూర్ టూర్కు వెళ్లారు. అక్కడ నుంచి రాగానే జమ్మూకాశ్మీర్లో ప్రధాని ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 8 నుంచి ఎన్నికల ప్రచారంలో మోడీ పాల్గొననున్నారు. మూడు ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని పాల్గొంటారని, జమ్మూ ప్రాంతంలో రెండు చోట్ల, కశ్మీర్లో ఒక చోట బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రధాని ప్రచారం సాగిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
Mehabooba Mufti: శ్రీనగర్లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సభలో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు.
జమ్మూలో ప్రమాదం చోటు చేసుకుంది. మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. కొండచరియలు విరిగిపడటంతో పలువురు శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక సహాయక బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
దేశ మాజీ ప్రధాని, జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ జమ్మూకశ్మీర్లో పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీనగర్ నుంచి బారాముల్లా వరకు రైల్వే లైన్ను పరిశీలించి, ప్రయాణికుల సౌకర్యాలపై సమాచారం తీసుకున్నారు.
Mehbooba Mufti: జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. వచ్చే నెల ఆఖరులో మూడు విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరగబోయే తొలి ఎన్నికలు ఇవే. ఇదిలా ఉంటే, కాశ్మీరీ కీలక నేత, మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ(పీడీపీ) అధినేత మెహబూబా ముఫ్తీ తాను ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ముఖ్యమంత్రి అయినప్పటికీ పార్టీ ఎజెండాను అమలు చేయడం సాధ్యం కాదని అన్నారు.…
జమ్మూకశ్మీర్లో తన పెళ్లిపై రాయ్బరేలీకి చెందిన కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. తాను పెళ్లి చేసుకునే ఆలోచనలో లేనని, అయితే పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చెప్పాడు.