Mehabooba Mufti: ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు ఉండబోదు..
- జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉండబోదు..
- బీజేపీ కశ్మీర్ అభివృద్ధికి సంబంధించిన అన్ని ప్రయత్నాలను తోసిపుచ్చింది..
- జమ్మూలో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరు: మెహబూబా ముఫ్తీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mehabooba Mufti: శ్రీనగర్లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సభలో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది మాత్రం పీడీపీనే అని పేర్కొన్నారు. జమ్మూలో తమ గెలుపును ఎవరూ ఆపలేరు.. ఈ సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటు కోసమే ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు. 1947 నుంచి అలానే చేస్తున్నారని వారికి అంతకు మించి వేరే టార్గెట్ లేదని ఆరోపించింది. కేవలం మంత్రి పదవుల కోసమే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ- కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటుందని ముఫ్తీ తెలిపారు.
Read Also: CM Chandrababu: మంత్రులకు సీఎం సీరియస్ వార్నింగ్.. పని చేయని వాళ్లు నాకు అక్కర్లేదు..!
Also Read
పీడీపీ మద్దతు లేకుండా ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని మెహబూబా ముఫ్తీ అన్నారు. 2002లో కేవలం 16 మంది ఎమ్మెల్యేలతో పార్టీ ఏర్పాటు చేశాం.. కానీ, ప్రస్తుతం అలాంటి తరహా పరిస్థితులే నెలకొంటాయని అన్నారు. తమ ఎజెండాను అమలు చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాం.. కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం గతంలో భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపాం.. కానీ బీజేపీ కశ్మీర్ అభివృద్ధికి సంబంధించిన అన్ని ప్రయత్నాలను తోసిపుచ్చింది.. అందుకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేదని వెల్లడించింది. బీజేపీతో పీడీపీకి ఎలాంటి సంబంధాలు లేవు.. ఈ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతాయని ఆశిస్తున్నాను.. పోలీసులు ప్రజలను పోలీస్ స్టేషన్లకు పిలిచి వేధింపులకు గురి చేయడం లాంటి చర్యలను వెంటనే ఆపివేయాలని మెహబూబా ముఫ్తీ కోరారు.
తాజావార్తలు
-
Haji Ali Ship: హోర్ముజ్ జలసంధిలో ఘోరం.. భారత నౌకను ముంచేసిన డ్రోన్ దాడి!
-
Phool Gobi Yakhni Recipe : ఘుమఘుమలాడే కాశ్మీరీ వంటకం.. పూల్ గోబీ యఖ్నీ తయారీ విధానం..!
-
Storm Hit UP: ఒక్క రోజే 100 మంది మృతి.. యూపీలో తుఫాను బీభత్సం..
-
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
-
Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?