Terror Attack In J&K: జమ్మూ కాశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలో శుక్రవారం ఇద్దరు వలస కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడిన సోఫియాన్ (25), ఉస్మాన్ మాలిక్ (25) శ్రీనగర్లోని జెవీసీ ఆసుపత్రి బెమీనాలో చేర్చారు.
Terrorist Attack In Budgam: జమ్మూకశ్మీర్లోని బుద్గామ్లోని మజమా గ్రామంలో ఉగ్రవాదులు ఇద్దరు యువకుల్ని కాల్చిచంపారు. గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్పించారు అక్కడి ప్రజలు. ఆ క్షతగాత్రులను సంజయ్, ఉస్మాన్గా గుర్తించారు అధికారులు. వారిద్దరూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వాసులు. వీరు ఆ ప్రాంతంలోని జల్ జీవన్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్న ఉద్యోగులని అధికారులు తెలిపారు. అయితే చికిత్స సమయంలో వారిద్దరూ కోలుకోలేక మరణించారని అధికారులు తెలియచేసారు. Read Also: Kamal Haasan: అభిమానులకు కృతజ్ఞతలు అంటూ ఎమోషనల్ పోస్ట్…
జమ్మూకాశ్మీర్లో కొత్తగా ఏర్పడిన నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం-రాజ్భవన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒమర్ అబ్డుల్లా ప్రభుత్వం కేంద్రపాలిత వ్యవస్థాపక దినోత్సవాన్ని బహిష్కరించింది.
Jammu Kashmir: జమ్మూలోని అఖ్నూర్ ప్రాంతంలో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంత భారీ ఆయుధాలు, మెటీరియల్ లభ్యతను చూస్తే ఈ ఉగ్రవాదులు కచ్చితంగా దీర్ఘకాలిక యుద్ధం చేయాలనే ఉద్దేశంతో పెద్ద కుట్రకు పాల్పడ్డారని స్పష్టమవుతోంది. స్వాధీనం చేసుకున్న వస్తువులలో M4 కార్బైన్, AK-47 రైఫిల్, ఇతర సామగ్రి వంటి అధునాతన ఆయుధాలు ఉన్నాయి.…
జమ్మూకశ్మీర్లో ఇటీవల వరుసగా ఉగ్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మరోసారి ఆర్మీవాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సోమవారం జమ్మూ కాశ్మీర్లోని అఖ్నూర్ సెక్టార్లో ఆర్మీ వాహనంపై జరిగిన దాడిలో కనీసం ఒక ఉగ్రవాది హతమైనట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉగ్రవాదులతో భద్రతా బలగాలు కాల్పులకు తెగబడుతున్నాయి.
Pakistan: ప్రపంచం ఆశ్చర్యపోయేలా పాకిస్థాన్ భారీ ఎత్తున ఉగ్రవాద సంస్థను అబోటాబాద్లో నడుపుతోంది. ఈ విషయాన్ని భారత ఇంటెలిజెన్స్ టీమ్ పసిగట్టింది. ఈ ఉగ్ర క్యాంప్ను ఏకంగా సైన్యంలోని కీలక జనరల్ దీన్ని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.
ప్రధాని మోడీతో జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జమ్మూకాశ్మీర్పై రాష్ట్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని ప్రధాని మోడీకి ఒమర్ అందజేశారు. జమ్మూకాశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీ వచ్చిన ఒమర్ అబ్దుల్లా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్ర హోదా తీర్మానాన్ని అందజేశారు.
Farooq Abdullah says Kashmir will never become Pakistan: జమ్మూ కాశ్మీర్లోని గందర్బల్లో ఉగ్రదాడి తర్వాత, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా పాకిస్తాన్ను లక్ష్యంగా చేసుకున్నారు. కాశ్మీర్ పాకిస్థాన్గా మారదని పాక్ పాలకులకు చెప్పాలనుకుంటున్నామని ఆయన సోమవారం అన్నారు. ఈ సందర్బంగా ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఈ క్రూరమైన వ్యక్తులు దీని నుండి ఏమి పొందుతారు? దీని వల్ల ఇక్కడ పాకిస్తాన్ను సృష్టిస్తుందని వారు భావిస్తున్నారా? నిజంగా భారత్తో…
Terror Attack: జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గాందర్బల్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ వైద్యుడు సహా ఆరుగురు కార్మికులు మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు.