Terrorist Attack In Budgam: ఉగ్రవాదుల దాడి.. ఇద్దరు యువకులు మృతి
- జమ్మూకశ్మీర్లోని బుద్గామ్లోని మజమా గ్రామంలో.
- ఉగ్రవాదుల దాడి..
- ఇద్దరు యువకులు మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorist Attack In Budgam: జమ్మూకశ్మీర్లోని బుద్గామ్లోని మజమా గ్రామంలో ఉగ్రవాదులు ఇద్దరు యువకుల్ని కాల్చిచంపారు. గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్పించారు అక్కడి ప్రజలు. ఆ క్షతగాత్రులను సంజయ్, ఉస్మాన్గా గుర్తించారు అధికారులు. వారిద్దరూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వాసులు. వీరు ఆ ప్రాంతంలోని జల్ జీవన్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్న ఉద్యోగులని అధికారులు తెలిపారు. అయితే చికిత్స సమయంలో వారిద్దరూ కోలుకోలేక మరణించారని అధికారులు తెలియచేసారు.
Read Also: Kamal Haasan: అభిమానులకు కృతజ్ఞతలు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన కమల్
Also Read
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
- UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
- Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
గత 12 రోజుల్లో జమ్మూ కాశ్మీర్లో సామాన్యులపై దాడి జరగడం ఇది రెండోసారి. అంతకుముందు అక్టోబర్ 20న గందర్బల్ జిల్లాలోని గగాంగీర్ ప్రాంతంలో ఉగ్రవాదులు 7 మందిని కాల్చిచంపారు. వీరిలో ఒక వైద్యుడు షానవాజ్ అహ్మద్గా గుర్తించారు. అంతకుముందు అక్టోబర్ 16న షోపియాన్లో ఉగ్రవాదులు స్థానికేతర యువకుడిని కాల్చి చంపారు. జమ్మూ కాశ్మీర్లో అక్టోబరు నెలలో తీవ్రవాద సంబంధిత సంఘటనలు పెరిగాయి. ఫలితంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 మంది పౌరులు, ముగ్గురు చొరబాటుదారులు, ముగ్గురు సైనికులు, ఇద్దరు ఆర్మీ పోర్టర్లు, ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారు.
Read Also: Pappu Yadav: ఎవరు చంపాలనుకుంటున్నారో.. వచ్చి నన్ను చంపేయండి
మరణించిన పౌరుల్లో ఒక స్థానిక కాశ్మీరీ, ఇద్దరు జమ్మూ, 5 మంది జమ్మూ – కాశ్మీర్ వెలుపల ప్రాంతాల వారు ఉన్నారు. ఇది కాకుండా, ఈ సంఘటనలలో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. కిష్త్వార్లోని ఛత్రు ప్రాంతంలో ఉమ్మడి దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్తో ఈ దాడులు మొదలయ్యాయి.
తాజావార్తలు
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
-
UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!