Pakistan: బిన్ లాడెన్ ఇంట్లో ఉగ్రవాద శిక్షణ శిబిరం.. కనిపెట్టిన భారత ఇంటెలిజెన్స్
- పాకిస్థాన్ ఓ మెగా టెర్రర్ క్యాంప్ను ఏర్పాటు చేశారని సమాచారం..
- అబోటాబాద్లో ఈ ఉగ్ర క్యాంప్ను నడిపిస్తున్నట్లు భారత ఇంటెలిజెన్స్ వెల్లడి..
- పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ జనరల్ ఆధ్వర్యంలోనే ఈ టెర్రర్ క్యాంప్: ఇంటెలిజెన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ప్రపంచం ఆశ్చర్యపోయేలా పాకిస్థాన్ భారీ ఎత్తున ఉగ్రవాద సంస్థను అబోటాబాద్లో నడుపుతోంది. ఈ విషయాన్ని భారత ఇంటెలిజెన్స్ టీమ్ పసిగట్టింది. ఈ ఉగ్ర క్యాంప్ను ఏకంగా సైన్యంలోని కీలక జనరల్ దీన్ని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఓ జాతీయ ఆంగ్లపత్రిక కథనం ప్రచురించింది. నిషేధిత ఉగ్ర సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్లు కలిసి ఏకంగా పాక్ సైనిక స్థావరం పక్కనే ఓ మెగా టెర్రర్ క్యాంప్ను ఏర్పాటు చేశాయని తెలిపింది. ఇందులోకి అనుమతి లేకుండా బయటి వ్యక్తులు అడుగు పెట్టడం అంత ఈజీ కాదని చెప్పుకొచ్చింది.
Read Also: Union Bank Of India: భారీగా లోకల్ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Also Read
- Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
- Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
ఇక, పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన ఓ గుర్తు తెలియని జనరల్ ఈ టెర్రర్ క్యాంప్ ను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ యువకులు, యువతులకు ఆయుధ వినియోగంతో పాటు ఇతర ఉగ్ర కార్యకలాపాల్లోనూ ట్రైనింగ్ ఇస్తున్నారు. గతంలో అబోటాబాద్లోని ఓ సేఫ్ హౌస్లోనే అల్ఖైదా ఉగ్ర సంస్థ నాయకుడు బిన్ లాడెన్ దాక్కొన్నాడు. 2011 మే నెలలో అమెరికా కమాండోలు రహస్యంగా హెలికాప్టర్లలో ఇక్కడికి చెరుకుని లాడెన్ను చంపివేయడంతో ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఆ ఇంటిని పూర్తిగా కూల్చివేసింది. అయితే, ఇప్పుడు అదే స్థలంలో కొత్తగా ఉగ్రవాద శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
Read Also: Modi Laddu: ఈ దీపావళికి ‘మోడీ లడ్డూ’ స్పెషల్ ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
కాగా, ఈ ప్రదేశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది అని ఇండియన్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. టెర్రర్ చీఫ్లు హఫీజ్ సయీద్, మసూద్ అజర్, సయ్యద్ సలాహుద్దీన్లు ఈ క్యాంప్ను సందర్శించినట్లు పేర్కొనింది. ఇది పాకిస్థాన్లోనే అతి పెద్ద టెర్రర్ క్యాంప్గా గూఢచారి అధికారులు భావిస్తున్నాయి. లష్కరే, జైషే, హిజ్బుల్ సంస్థలు సంయుక్తంగా ఇక్కడే నియామకాలు చేపడుతున్నట్లు సమాచారం. కొన్నాళ్లుగా జమ్మూ కశ్మీర్లో టెర్రరిస్టుల దాడులు పెరిగిపోవడంతో అబోటాబాద్లో ఉగ్ర శిబిరం విషయం బయటకు రావడం గమనార్హం.
తాజావార్తలు
-
KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
-
CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
-
Murali Kishor: ‘లెనిన్’ డైరెక్టర్కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
-
Ramayana : బడ్జెట్ 4000 కోట్లు.. బిజినెస్ 250 కోట్లా?
-
Telangana Eco Tourism : తెలంగాణ ఎకో టూరిజం బూస్ట్.. కొత్త మాస్టర్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!