Pakistan: బిన్ లాడెన్ ఇంట్లో ఉగ్రవాద శిక్షణ శిబిరం.. కనిపెట్టిన భారత ఇంటెలిజెన్స్
- పాకిస్థాన్ ఓ మెగా టెర్రర్ క్యాంప్ను ఏర్పాటు చేశారని సమాచారం..
- అబోటాబాద్లో ఈ ఉగ్ర క్యాంప్ను నడిపిస్తున్నట్లు భారత ఇంటెలిజెన్స్ వెల్లడి..
- పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ జనరల్ ఆధ్వర్యంలోనే ఈ టెర్రర్ క్యాంప్: ఇంటెలిజెన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ప్రపంచం ఆశ్చర్యపోయేలా పాకిస్థాన్ భారీ ఎత్తున ఉగ్రవాద సంస్థను అబోటాబాద్లో నడుపుతోంది. ఈ విషయాన్ని భారత ఇంటెలిజెన్స్ టీమ్ పసిగట్టింది. ఈ ఉగ్ర క్యాంప్ను ఏకంగా సైన్యంలోని కీలక జనరల్ దీన్ని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఓ జాతీయ ఆంగ్లపత్రిక కథనం ప్రచురించింది. నిషేధిత ఉగ్ర సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్లు కలిసి ఏకంగా పాక్ సైనిక స్థావరం పక్కనే ఓ మెగా టెర్రర్ క్యాంప్ను ఏర్పాటు చేశాయని తెలిపింది. ఇందులోకి అనుమతి లేకుండా బయటి వ్యక్తులు అడుగు పెట్టడం అంత ఈజీ కాదని చెప్పుకొచ్చింది.
Read Also: Union Bank Of India: భారీగా లోకల్ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Also Read
- India - Oman Gas Pipeline: ఇక, హార్మూజ్తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
- India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
- Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
- POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
ఇక, పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన ఓ గుర్తు తెలియని జనరల్ ఈ టెర్రర్ క్యాంప్ ను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ యువకులు, యువతులకు ఆయుధ వినియోగంతో పాటు ఇతర ఉగ్ర కార్యకలాపాల్లోనూ ట్రైనింగ్ ఇస్తున్నారు. గతంలో అబోటాబాద్లోని ఓ సేఫ్ హౌస్లోనే అల్ఖైదా ఉగ్ర సంస్థ నాయకుడు బిన్ లాడెన్ దాక్కొన్నాడు. 2011 మే నెలలో అమెరికా కమాండోలు రహస్యంగా హెలికాప్టర్లలో ఇక్కడికి చెరుకుని లాడెన్ను చంపివేయడంతో ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఆ ఇంటిని పూర్తిగా కూల్చివేసింది. అయితే, ఇప్పుడు అదే స్థలంలో కొత్తగా ఉగ్రవాద శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
Read Also: Modi Laddu: ఈ దీపావళికి ‘మోడీ లడ్డూ’ స్పెషల్ ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
కాగా, ఈ ప్రదేశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది అని ఇండియన్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. టెర్రర్ చీఫ్లు హఫీజ్ సయీద్, మసూద్ అజర్, సయ్యద్ సలాహుద్దీన్లు ఈ క్యాంప్ను సందర్శించినట్లు పేర్కొనింది. ఇది పాకిస్థాన్లోనే అతి పెద్ద టెర్రర్ క్యాంప్గా గూఢచారి అధికారులు భావిస్తున్నాయి. లష్కరే, జైషే, హిజ్బుల్ సంస్థలు సంయుక్తంగా ఇక్కడే నియామకాలు చేపడుతున్నట్లు సమాచారం. కొన్నాళ్లుగా జమ్మూ కశ్మీర్లో టెర్రరిస్టుల దాడులు పెరిగిపోవడంతో అబోటాబాద్లో ఉగ్ర శిబిరం విషయం బయటకు రావడం గమనార్హం.
తాజావార్తలు
-
Dhruva Yoga: జూన్ 17న ధ్రువ యోగం.. ఈ రాశుల వారికి జాక్పాట్..
-
Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
-
Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
-
India – Oman Gas Pipeline: ఇక, హార్మూజ్తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
-
India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!