Pakistan: బిన్ లాడెన్ ఇంట్లో ఉగ్రవాద శిక్షణ శిబిరం.. కనిపెట్టిన భారత ఇంటెలిజెన్స్
- పాకిస్థాన్ ఓ మెగా టెర్రర్ క్యాంప్ను ఏర్పాటు చేశారని సమాచారం..
- అబోటాబాద్లో ఈ ఉగ్ర క్యాంప్ను నడిపిస్తున్నట్లు భారత ఇంటెలిజెన్స్ వెల్లడి..
- పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ జనరల్ ఆధ్వర్యంలోనే ఈ టెర్రర్ క్యాంప్: ఇంటెలిజెన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ప్రపంచం ఆశ్చర్యపోయేలా పాకిస్థాన్ భారీ ఎత్తున ఉగ్రవాద సంస్థను అబోటాబాద్లో నడుపుతోంది. ఈ విషయాన్ని భారత ఇంటెలిజెన్స్ టీమ్ పసిగట్టింది. ఈ ఉగ్ర క్యాంప్ను ఏకంగా సైన్యంలోని కీలక జనరల్ దీన్ని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఓ జాతీయ ఆంగ్లపత్రిక కథనం ప్రచురించింది. నిషేధిత ఉగ్ర సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్లు కలిసి ఏకంగా పాక్ సైనిక స్థావరం పక్కనే ఓ మెగా టెర్రర్ క్యాంప్ను ఏర్పాటు చేశాయని తెలిపింది. ఇందులోకి అనుమతి లేకుండా బయటి వ్యక్తులు అడుగు పెట్టడం అంత ఈజీ కాదని చెప్పుకొచ్చింది.
Read Also: Union Bank Of India: భారీగా లోకల్ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Also Read
ఇక, పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన ఓ గుర్తు తెలియని జనరల్ ఈ టెర్రర్ క్యాంప్ ను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ యువకులు, యువతులకు ఆయుధ వినియోగంతో పాటు ఇతర ఉగ్ర కార్యకలాపాల్లోనూ ట్రైనింగ్ ఇస్తున్నారు. గతంలో అబోటాబాద్లోని ఓ సేఫ్ హౌస్లోనే అల్ఖైదా ఉగ్ర సంస్థ నాయకుడు బిన్ లాడెన్ దాక్కొన్నాడు. 2011 మే నెలలో అమెరికా కమాండోలు రహస్యంగా హెలికాప్టర్లలో ఇక్కడికి చెరుకుని లాడెన్ను చంపివేయడంతో ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఆ ఇంటిని పూర్తిగా కూల్చివేసింది. అయితే, ఇప్పుడు అదే స్థలంలో కొత్తగా ఉగ్రవాద శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
Read Also: Modi Laddu: ఈ దీపావళికి ‘మోడీ లడ్డూ’ స్పెషల్ ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
కాగా, ఈ ప్రదేశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది అని ఇండియన్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. టెర్రర్ చీఫ్లు హఫీజ్ సయీద్, మసూద్ అజర్, సయ్యద్ సలాహుద్దీన్లు ఈ క్యాంప్ను సందర్శించినట్లు పేర్కొనింది. ఇది పాకిస్థాన్లోనే అతి పెద్ద టెర్రర్ క్యాంప్గా గూఢచారి అధికారులు భావిస్తున్నాయి. లష్కరే, జైషే, హిజ్బుల్ సంస్థలు సంయుక్తంగా ఇక్కడే నియామకాలు చేపడుతున్నట్లు సమాచారం. కొన్నాళ్లుగా జమ్మూ కశ్మీర్లో టెర్రరిస్టుల దాడులు పెరిగిపోవడంతో అబోటాబాద్లో ఉగ్ర శిబిరం విషయం బయటకు రావడం గమనార్హం.
తాజావార్తలు
-
Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
-
Hyderabad: అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
-
Riyan Parag: మేము కూడా మనుషులమే, తప్పులు జరుగుతాయి.. ఇక్కడ మిస్టర్ పర్ఫెక్ట్ ఎవడూ లేడు!
-
TeluguOne Ravi Shankar: పంచభూతాల సాక్షిగా డైరెక్టర్గా మారిన తెలుగు వన్ రవిశంకర్!
-
Russian Ruble: డాలర్కు బిగ్ షాక్.. ప్రపంచంలోనే బెస్ట్ కరెన్సీగా రూబుల్.. వరుసగా రెండో ఏడాది రికార్డ్..
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?