నెల్లూరు జిల్లాలో వై.సి.పి.నేతల మధ్య విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప తరగటం లేదు. ఆత్మకూరు ఉప ఎన్నికల సందర్భంగా ఈ విభేదాలు మరోసారి తేటతెల్లమయ్యాయి. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ తరువాత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్…మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిల మధ్య విభేదాలు తీవ్రం అయ్యాయి. మంత్రి కాకాణికి తాను రెట్టింపు సహకారం అందిస్తామని అనిల్ కుమార్ వ్యంగంగా చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. కాకాణికి శుభాకాంక్షలు చెప్తూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో…
కాకినాడ జిల్లా పిఠాపురంలో దళిత గర్జనకు టీడీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అనుమతి నిరాకరించిన పోలీసులు. మాజీ ఎమ్మెల్యే వర్మను టీడీపీ ఆఫీస్ లోనే నిర్బంధించారు పోలీసులు. దీంతో ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చిన టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తాళాలు పగలగొట్టి వర్మను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులతో టీడీపీ క్యాడర్ వాగ్వాదానికి దిగింది. టీడీపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం పిఠాపురంలో టీడీపీ కార్యాలయం నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మని ఇంటికి తీసుకుని…
పోలవరం ప్రాజెక్ట్ పై మంత్రి అంబటి రాంబాబు సరైన సమాధానం చెప్పడం లేదని, చెప్పేదంతా తప్పుల తడకగా ఉందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. డయా ఫ్రమ్ వాల్ ను చంద్రబాబు కడితే దానిని ఏమి చేయాలో తెలియక అయోమయ పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఉంది. ప్రాజెక్ట్ పై ఎందుకు నిపుణులతో పరిశీలన చేయడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మీరు ఒక కాంట్రాక్టర్ ను పెట్టుకున్నారు. గతంలో ప్రభుత్వం ఒక కాంట్రాక్టర్ ను పెట్టుకుంది.…
కోనసీమలో జరిగిన సంఘటన చాలా సున్నితమయిన అంశం అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మీడియాతో పవన్ కళ్యాణ్ చిట్ చాట్ నిర్వహించారు. కోనసీమలో తాజా పరిస్థితేంటని మీడియా ప్రతినిధులను ఆరా తీశారు పవన్. మంత్రి పినిపె విశ్వరూప్ కూడా బాధితుడేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కోనసీమ ఎపిసోడ్ సెన్సిటివ్గా ఉందనే విషయాన్ని కేంద్ర నిఘా విభాగం ముందుగానే అలెర్ట్ చేసింది. అయినా ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదన్నారు. కేంద్రం అలెర్ట్ చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించ లేదని…
ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. నలుగురు వైసీపీ అభ్యర్ధులు ఏకగ్రీవం అయ్యారు. రాజ్యసభ ఎంపీలుగా వైసీపీ నుంచి నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు తెలిపారు. అసెంబ్లీ సెక్రటరీ చేతుల మీదుగా డిక్లరేషన్ సర్టిఫికెట్లు అందుకున్నారు విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, కృష్ణయ్య, బీద మస్తాన్ రావు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ… రాజ్యాధికారంలో బీసీలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. బీసీలకు మాటలు కాకుండా చేతల్లో అభివృద్ధి చూపిస్తున్నారు.సీఎం జగన్ దేశానికి…
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో విక్రమ్ రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ అవకాశం కల్పించారన్నారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. ఆత్మకూరు అభివృద్ధికి గౌతమ్ ఎంతో కృషి చేశారు.మెట్ట ప్రాంత రైతుల సమస్యలను తెలుసుకుని విక్రమ్ రెడ్డి ముందుకు వెళుతున్నారు. ప్రభుత్వ అభివృద్ధి..సంక్షేమ పథకాలు వల్లే మాకు ఓట్లు వస్తాయి. లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తాం. ఈ ఎన్నికలలో పోటీకి ఎవరూ ముందుకు రావడం లేదు. బీజేపీ నేతలు కూడా పోటీకి భయపడుతున్నారు. వచ్చే రెండేళ్లలో మరింత అభివృద్ధి…
* నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్. ప్రధాని నరేంద్రమోడీతో సాయంత్రం భేటీ కానున్న జగన్. * నేడు పోలవరం ప్రాజెక్టుని సందర్శించనున్న ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం అధికారులతో మంత్రి అంబటి సమీక్ష * ఇవాళ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్. హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో అవతరణ వేడుకల్లో పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నేతలు. *విశాఖ ఆంధ్రాయూనివర్శిటీలో…
*ఉదయగిరిలో ఎం.ఎల్.ఏ.మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి పర్యటన. *కోవూరులో ఎం.ఎల్.ఏ.నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పర్యటన *ఇవాళ్టి నుంచి తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం. అలిపిరి వద్ద తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్ రహిత వస్తువులను మాత్రమే అనుమతించనున్న టీటీడీ. *శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న జనసేన నేత కొణిదెల నాగబాబు. నియోజకవర్గాల సమన్వయ కర్తలు , ద్వితీయ శ్రేణి నేతలతో సమావేశం. *విశాఖలో నేడు, రేపు మాజీ కేంద్రమంత్రి సురేష్ ప్రభు ఉత్తరాంద్ర టూర్….కేజీహెచ్ లో ఎంపీ నిధులతో కొనుగోలు…
ఒంగోలులో జరుగుతున్న టీడీపీ మహానాడులో ఉద్వేగభరితంగా ప్రసంగించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వైఎస్సార్సీపీ అంటే యువజన శృంగార రౌడీ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు రాముడు.. జగన్ రాక్షసుడు. టీడీపీ స్థాపించిన 40 ఏళ్ల చరిత్రలో ఈ రోజు ప్రత్యేక స్థానం. పార్టీ పునాదులు గట్టిగా ఉన్నాయి.. ఎవ్వరూ ఏం చేయలేరు. టీడీపీని ఏదో చేద్దామనుకున్న వాళ్లు గాల్లో కొట్టుకుపోయారు. టీడీపీ కార్యకర్తల శరీరం కొస్తే పసుపు రక్తం వస్తుంది. వైసీపీ నేతలు చంపే…
టీడీపీ మహానాడుకి జనం పోటెత్తారు. ప్రకాశం వేదికగా సైకిల్ పార్టీ గుబాళించింది. మహానాడు2022 సందర్భంగా నారా లోకేష్ మీడియాతో ముచ్చటించారు. వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ తన పార్టీ కార్యకర్తలను గాలికి వదిలేశారు. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు.. ప్రజలను హింసించిన వైసీపీ నేతలు.. ఇప్పుడు సొంత పార్టీ కేడరునే హింసిస్తోందన్నారు. ఓ ఎమ్మెల్సీ తన డ్రైవర్, పార్టీ కార్యకర్తనే చంపేస్తే.. మరో ఎమ్మెల్యే తన పార్టీ గ్రామ స్థాయి నేతను హత్య చేయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.…