భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1 గురించి ఇస్రో చీఫ్ కీలక ప్రకటన చేశారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఛైర్మన్ ఎస్. సోమనాథ్ ఐఐటీ బొంబాయి వార్షిక సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెస్టివల్కు హాజరయ్యారు. ఈ ఫెస్టివల్లో ఆయన మిషన్కు సంబంధించిన వివరాలను పంచుకున్నారు.
సూర్యుడి అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 మిషన్ విజయవంతంగా దూసుకుపోతుంది. అయితే, ఆ ఉపగ్రహంలో ఉన్న ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్ పరిమెంట్ పేలోడ్ సౌర గాలులను పరిశీలన చేయడం ప్రారంభించింది.
Aditya L1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటర్ ప్లానెటరీ మిషన్, ఆదిత్య ఎల్1 సోలాల్ మిషన్ విజయవంతంగా నిర్దేశించిన మార్గంలో వెళ్తోంది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఇస్రో ఆదిత్యఎల్1 అంతరిక్ష నౌకను ప్రయోగించింది. ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌక చివరి దశకు చేరుకుందని, L1 కక్ష్యలో ప్రవేశపెట్టే విన్యాసాలు జనవరి 7, 2024 నాటికి పూర్తవుతాయని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.
చంద్రయాన్-3ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన లాంచ్ వెహికల్ ఎల్వీఎం3 ఎం4 లోని క్రయోజనిక్ పైభాగం నియంత్రణ కోల్పోయి బుధవారం మధ్యాహ్నం 2 గంటల 42 నిమిషాలకు భూ వాతావరణంలోకి ప్రవేశించిందని.. అది ఉత్తర పసిఫిక్ మహాసముద్రం లో పడే అవకాశం ఉందని తెలిపింది.
PM Modi: భారత గగన్యాన్ మిషన్లో భాగంగా ఇస్రో ఈ రోజు ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని చేపట్టింది. ప్రయోగాత్మకంగా ‘టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్(టీవీ-డీ1) పరీను శనివారం విజయవంతంగా నిర్వహించింది. క్రూమాడ్యుల్ని రాకెట్ ద్వారా నింగిలోకి పంపించారు, ఆ తరువాత క్రూ మాడ్యుల్, రాకెట్ నుంచి విడిపోయి పారాశ్యూట్ల సాయంతో బంగాళాఖాతంలో సురక్షితంగా పడింది.