ISRO: ఇంటెలిజెన్స్ సేకరణ కోసం వచ్చే ఐదేళ్లలో 50 ఉపగ్రహాలను ప్రయోగిస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somanath: రానున్న కాలంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష రంగంలో భారత్ను ప్రధాన శక్తిగా మార్చడమే లక్ష్యంగా కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. జియో ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించేందుకు వచ్చే ఐదేళ్లలో భారత్ 50 ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. భద్రతా దళాల కదలికలను పర్యవేక్షించే సామర్థ్యంతో పాటు వేలాది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఛాయా చిత్రాలను తీయగల సామర్థ్యంతో వివిధ కక్ష్యలలో ఉపగ్రహాలను రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు.
Read Also: Devil Movie OTT: ‘డెవిల్’ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్..!!
Also Read
- Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
- ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్ను క్లీన్స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
- TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
- SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
ఇక, బొంబాయిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) వార్షిక సైన్స్ అండ్ టెక్నాలజీ ఈవెంట్ టెక్ఫెస్ట్లో సోమ్నాథ్ మాట్లాడుతూ.. మార్పు గుర్తింపు, డేటా విశ్లేషణ, ఏఐ- సంబంధిత డేటా ఆధారిత ప్రయత్నాల పరంగా ఉపగ్రహాల సామర్థ్యాన్ని మెరుగుపరచడం చాలా ముఖ్యమని చెప్పారు. భారతదేశం బలమైన దేశంగా ఎదగాలన్న ఆకాంక్షను సాకారం చేసుకోవడానికి.. ప్రస్తుతం ఉన్న ఉపగ్రహ నౌకల పరిమాణం సరిపోదని.. అది ఈ రోజు ఉన్న దానికంటే 10 రెట్లు అవసరమని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు. దేశ సరిహద్దులు, పొరుగు ప్రాంతాలపై నిఘా ఉంచే సామర్థ్యం ఈ వ్యోమనౌకకు ఉందన్నారు. ఇదంతా శాటిలైట్ల ద్వారా చూడవచ్చని సోమ్నాథ్ అన్నారు. అ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నాము.. కానీ, ఇప్పుడు భిన్నమైన ఆలోచనా విధానం ఉంది అని ఆయన చెప్పారు.
Read Also: Himanta Biswa Sarma : వివాదాల్లో చిక్కుకున్న సీఎం.. ‘బ్రాహ్మణ-శూద్ర’ పోస్ట్ను తొలగింపు
అయితే, ఏదైనా దేశం యొక్క బలం దాని చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోగల సామర్థ్యమేనని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమ్ నాథ్ వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో పూర్తి చేసేందుకు 50 ఉపగ్రహాలను సమీకరించామన్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ ప్రత్యేక జియో-ఇంటెలిజెన్స్ సేకరణలో సహకరించేందుకు భారత్కు పంపుతున్నామని ఆయన అన్నారు. భారత్ ఈ స్థాయిలో ఉపగ్రహాలను ప్రయోగించగలిగితే దేశం ఎదుర్కొంటున్న ముప్పులను మరింత మెరుగైన రీతిలో తగ్గించవచ్చని సోమనాథ్ చెప్పారు.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
-
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్ను క్లీన్స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
-
TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
-
Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
-
KFC పార్కింగ్లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..