Viral Video: హౌతీ ఉగ్రవాదులు ఆదివారం రోజు ఇజ్రాయిల్పై బాలిస్టిక్ మిస్సై్ల్తో దాడి చేశారు. ఇజ్రాయిల్లో అతిపెద్ద విమానాశ్రయమైన టెల్ అవీవ్లోని బెన్ గురియన్ విమానాశ్రయంపైకి మిస్సైల్ని ప్రయోగించారు. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయిల్ ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 నుంచి కేవలం 75 మీటర్ల దూరంలోనే క్షిపణి పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
India Pak War: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాక్ నేతలు భారత్ ఏ చర్య తీసుకున్నా, తమ ఆర్మీ ధీటైన జవాబు ఇస్తుందని బీరాలు పలుకుతున్నారు. తమ వద్ద అణ్వాస్త్రాలు ఉన్నాయని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, బలహీనతల్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోంది. నిజానికి భారత సైన్యం ముందు నిలబడే దమ్ము లేదని విషయాలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి.
Netanyahu: ప్రధాని నరేంద్రమోడీకి, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఫోన్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గురువారం ఎక్స్లో పోస్ట్ చేశారు. దాడికి పాల్పడిన టెర్రరిస్టుల్ని, వారి మద్దతుదారుల్ని న్యాయం ముందు నిలబెట్టాలనే భారతదేశ దృఢ సంకల్పానికి ఇజ్రాయిల్ మద్దతుగా నిలిచింది. జోర్డాన్ రాజు అబ్దుల్లా -2 కూడా ప్రధాని మోడీకి ఫోన్ చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, భారత దేశానికి మద్దతుగా…
Rahul Gandhi: ఇజ్రాయిల్ గూఢచార సంస్థ "మొసాద్" ఆపరేషన్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హిండెన్బర్గ్ సంస్థ పలుమార్లు అదానీని లక్ష్యం చేసుకుంటూ సంచలన నివేదికలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నివేదికల ఆధారంగా మన దేశంలో ప్రతిపక్షాలు అధికార బీజేపీపై తీవ్ర విమర్శలు చేశాయి. అయితే, ఈ వ్యవహారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాత్ర ఉన్నట్లు మొసాద్ కనుగొంది. రాహుల్ గాంధీ అదానీని లక్ష్యంగా చేసుకుని హిండెన్బర్గ్తో ‘‘సమన్వయం’’ చేసుకున్నట్లు ఆరోపించింది. కాంగ్రెస్,…
పహల్గామ్ ఉగ్ర దాడిని అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన మారణహోమంతో అమెరికా పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ పోల్చారు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుందని.. అలాగే పాకిస్థాన్పై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని సూచించారు.
Terror Attack: జమ్ము కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలోని పహల్గామ్లోని బైసరన్ లోయను చూసేందుకు వచ్చిన పర్యటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగ బడ్డారు. ఈ ఉగ్ర దాడిలో మృతుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉంది. అయితే, ఇప్పటి వరకు సుమారు 27 మంది టూరిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
Pakistan: బంగ్లాదేశ్ దారిలోనే పాకిస్తాన్ నడుస్తోంది. ఇటీవల ఇజ్రాయిల్-గాజా యుద్ధంపై నిరసనగా పాలస్తీనాకు మద్దతుగా బంగ్లాదేశ్లోని ప్రధాన నగరాలు, పట్టణాలలోని కేఎఫ్సీ అవుట్లెట్స్, బాటా షోరూంలపై అక్కడి నిరసనకారులు దాడులు చేశారు. తాజాగా, పాకిస్తాన్లో కూడా కేఎఫ్సీ టార్గెట్గా దాడులు జరుగుతున్నాయి. కేఎఫ్సీ రెస్టారెంట్లపై 20 వేర్వేరు దాడులు నమోదయ్యాయి. ఒక ఉద్యోగిని కాల్చి చంపారు. ఈ దాడులకు సంబంధించి దాదాపుగా 160 మందిని అరెస్ట్ చేసినట్లు అక్కడి పోలీసులు శనివారం తెలిపారు.
బందీల విడుదల విషయంలో హమాస్ సంచలన ప్రకటన చేసింది. గాజాపై యుద్ధాన్ని ముగిస్తే మిగిలిన ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హమాస్ ప్రకటించింది.
గాజా సరిహద్దు సమీపంలోని ఇజ్రాయెల్ ప్రజలు నివాసం ఉండే ప్రాంతంలో ఐడీఎఫ్ ఫైటర్ జెట్ బాంబు దాడి జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో ఐడీఎఫ్ దళాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే ఈ దాడి కేవలం సాంకేతిక లోపంతో జరిగినట్లుగా ఇజ్రాయెల్ తెలిపింది.
గాజాపై మరోసారి ఇజ్రాయెల్ విరుచుకుపడింది. బుధవారం షెజైయాలో జరిపిన దాడిలో 38 మంది చనిపోయినట్లు పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. షెజైయాలోని ఒక భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో పిల్లలు సహా కనీసం 29 మంది పాలస్తీనియన్లు మరణించారని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు.